నేల ఎన్నిటిని సింగారించుకుంటుందని...ఎన్ని సుగంధాలను పూసుకుంటుందని –ఒకసారి జొన్నకంకి అందంతోఒకసారి వరి మొక్కల చందంతోమరోసారి కంది కాంతుల ఒయ్యారాలతోమరోసారి తెల్లని పత్తి తెలుపుతోమరోసారి పెసర ఆకు పచ్చదనంతోమందారపు మమకారంతోఇంకోసారి అరటి శీతోపచారాలతోఇంకోసారి పొగాకు సుగంధంతోఇంకోసారి పసుపు గుభాళింపుతోఇంకోసారి కొత్తిమీర పరిమళంతోవేరొకసారి చిలకమొక్క పూల మురిపాలతోవేరొకసారి రాలిన పారిజాతాలతోవేరొకసారి పున్నాగపూల పులకరింతలతోవేరొకసారి తరుచ్ఛాయలతోఇన్ని అందాలు గంధాలనే కాదుఎంత ఆర్తిని ... ఆప్యాయతనుతనలో దాచుకుంటుందోమనిషే ఏమీ రాక – చేతకాకఏమీ కాకసౌందర్యాన్ని ఆస్వాదించటం కూడా రాక..అసలా సౌందర్యాన్ని గుర్తించడమే రాక..నేల – ఎన్ని రుచుల్ని వడ్డిస్తుంది –ఎన్ని వసతుల్ని – వనరుల్ని ఇస్తుంది –తృప్తిలేని మనిషినేలను ఇంకా ఇంకా ఛిద్రం చేస్తూ –ఇంకా ఇంకా బాధిస్తూ –వేధిస్తూ – శోధిస్తూ –దాని కోసమే అన్యుల వధిస్తూ –వధింపబడుతూఅనామకంగా – అవివేకంగామనిషే...
మనిషే: -రాజా వాసిరెడ్డి మల్లీశ్వరి