*******అన్నదమ్ముల్లాగా_రెండు సంస్కృతుల హైద్రాబాద్,సికింద్రాబాదులు.ద్విపదం:(హైటెక్ సిటీ)*******సాంకేతికతకు చిరునామై వెలసినది.అభివృద్ధికి సంకేతమై నిలబడినది.త్రిపదం:(సైబరాబాద్)*******నగర విస్తరణకు మార్గమైనది.శివారుల సింగారమై ఏర్పడినది.జనాభా నివాసానికి అనువైనది.లఘుకవిత:(సుందర భారతదేశం)**********హిమాలయాలే కిరీటాలుగాకాశ్మీరమే నుదుటి సింధూరంగానదీనదాలు జడపాయలుగాపుణ్యక్షేత్రాలే ఆభరణాలుగాపచ్చనిపొలాలే వస్త్రాలుగాఅభివృద్ధి, సౌభ్రాతృత్వం కరాలుగాసకలకళలే గళసీమగాఆధ్యాత్మికత,తాత్వికత రెండు నయనాలుగా విలసిల్లునది.వచనకవిత:(దుష్టసంహార నరసింహ దురితదూర)**************************వేయిసంవత్సరాల చరిత్ర కలిగినయోగలక్ష్మీనృసింహుని దర్శనంసర్వపాపహరణమై ప్రసిద్ది గాంచింది.గోదావరినదీ తీరాన కొలువైవేదవిద్యలకు,జ్యోతిశ్శాస్త్రానికిఆలవాలమైంది.శాతావాహనులు,బాదామి చాళుక్యులు,కళ్యాణి చాళుక్యుల కాలంలో ఉన్నతమై విలసిల్లింది.స్వయంభూ సాలగ్రామ విగ్రహరూపంలోపద్మాసనుడై,కోరమీసాల ప్రసన్నవదనంతో,భక్తులకొంగుబంగారమైనాడు.స్కాందపురాణ ప్రశస్తి కలిగిధర్మవర్మ పేరు మీదుగా ధర్మపురైతెలంగాణ ముఖ్యపుణ్యక్షేత్రమయింది.గంపలవాడ,తొట్లవాడలతోచారిత్రాత్మకమై నిలిచింది.సత్యవతీదేవి నిర్మించిన సైకతస్తంభం సత్యనిదర్శనమైనేటికీ కనిపిస్తుంది.దక్షిణకాశీగా పిలవబడి,ధర్మపురికి పోతే యమపురి ఉండదనే నానుడితో ప్రసిద్ధమైంది.శివకేశవుల నిలయమైశైవ,వైష్ణవ,ముస్లిముల మతసామరస్యానికి ప్రతీకైయమధర్మరాజు కొలువైన పవిత్రక్షేత్రం.భూషణవికాసశతకంలో స్తుత్యమై,ప్రఖ్యాతి గాంచింది.నానీ:(టీ హబ్)*****యువకెరటాలకుదిశానిర్దేశం.నవమస్తిష్కాలకుప్రోత్సాహం.
కవనపవనాలు:-డా.రామక కృష్ణమూర్తి--బోయినపల్లి, సికింద్రాబాద్.