ఒక అడవిలో లో పెద్దపులి ఆహారం కోసం ఎదురు చూస్తూ ఒక పెద్ద పాండా చెట్టు కింద పడుకుని దిక్కులు చూస్తోంది . ఆ చెట్టు పై నుండి ఉడుత ఒకటి కిందకు వచ్చి తోక జాడిస్తు మూతిని చేతులతో తుడుచుకుని అప్పుడప్పుడు తోక అరుస్తూ వుండడం చూస్తున్న పెద్ద పులి నవ్వి ‘ ఏయ్... బుడుత వుడుతా నీవు ఎంత తోక జాడించినా భయపడుతాను అను కుంటున్నావా ? నేను పెద్ద పులిని ‘ అని గాండ్రించింది . ‘ నేను నిన్ను చూసి జాడించలేదు . అది నా పుట్టుకతో వచ్చిన నైజం’అంది ఉడుత .’ నాకే ఎదురు చెపుతున్నావా .. ఎందులో నీవు గొప్ప ? చెప్పు’ అని పులి అంది . ‘ నేను విష్ణు దేవుడు రామావతారం ఎత్తినపుడు సముద్రానికి వారధి కట్టడానికి సహాయం చేశాను . అందుకు శ్రీరామదేవుడు మూడు వేళ్ళతో నా వీపుని నిమిరి చారలు గీశాడు తెలుసా ? ఆదేనాగొప్ప ‘అంది .దానికి పెద్దపులి ‘ నీకు మూడు చారలే .. కానీ నాకు చూడు వంటి నిండా చారలే... హ్హ..హ్హ ..హ్హా ... హ్హ ‘అని నవ్వింది .
అందుకు ఉడుత ‘ ఆ చారలు నీకు ఎవరు ఇచ్చారో చెప్పు ‘ అంది . పెద్దపులి నోటిదురుసుతో అన్నమాటకి ఆలోచనలో పడి దిక్కులు చూస్తూ ఏమి చెప్పాలో అర్థంకాక తల గోక్కుని చెప్పలేకపోయింది .
ఉడుత ‘ నీవు చెప్పలేవుకాని నేను చెప్తావిను. పులిరాజా గారు .. . ఏ జన్మలోనో ఏ రాక్షసుడికో సహాయం చేసి వుంటావు .అందుకే నీకు తనాల బతకమని వాడిలా పళ్ళు ,గోళ్ళు ఇచ్చాడు . అందుకే నీవు మాంసాహారం మాంసాహారం తింటున్నావు . నేను సాత్వికాహారమైన పళ్ళు , కాయలు తింటూ బతుకుతున్నాను ‘ అని తోక జాడిస్తూ కిచ కిచ అరుస్తూ చెట్టు పైకి పోయి పండు కోరుకుతూ కూర్చుంది . పులి తన దారిన తాను పోక చిన్న బుడుత ఉడుతను గోకి అపహాస్యం పాలై నందుకు తల వంచుకుని అక్కడనుండి వెళ్ళి పోయింది .
addComments
కామెంట్ను పోస్ట్ చేయండి