పోరాటం వద్దు-ఐక్యతే ముద్దు. ;-డా.బెల్లంకొండనాగేశ్వరరావు.చెన్నయ్.

  
తమముందుఉన్నఒకరొట్టెకోసం రెండుపిల్లులు ఈరోట్టె  నాకంటే నాకేకావాలి అని వాదులాడుకోసాగాయి.అటుగావెళుతున్నకోతి పిల్లుల వాదులాటవిని"ఏమిటి అల్లుళ్ళు మీలో మీరేవాదులాట"అన్నది.
"కోతి మామా ఈరొట్టెను ముందుగా నేనేచూసాను ఇదినేనే తింటాను"అన్నది మొదటి పిల్లి."లేదు రొట్టెను మొదట నేనేచూసాను కనుక ఈరోట్టెను నేనేతింటాను"అన్నది రొండోపిల్లి.
" అల్లుళ్ళు మధ్యవర్తిగా నేను మీకు తీర్పుచేపుతాను,రొట్టెను రెండు ముక్కలు చేసి మీఇద్దరికి చెరిసగం సమంగా పంచుతాను"అందికోతి.
"మామా యాభై ఏళ్ళక్రితం మీతాత ఇలా పంపకంపేరున రొట్టెను రెండుముక్కలుచేసి,ఈభాగం ఎక్కువఉంది,కాదు మరోభాగం ఎక్కువఉంది అంటూ రెట్టెమొత్తం కోతి మామే నాడు తిన్నాడట,ఆకథమాకు మాపెద్దల ద్వారా తెలుసు, పెద్దలుచెప్పే కథలు వినడంవలన, చదవడంవలన బోలెడు లోకజ్ఞానం పొందవచ్చనితెలుసుకున్నాం,అయినా పోరాటంవలన లాభంఏముంటుంది గాయాలుతప్ప, పోరాటం వద్దు ఐకమత్యమే ముద్దు.అని మేంతెలుసుకున్నాం,మా వచ్చిన సమస్యను మేమే పరిష్కరించుకుంటాం ఇందులో నీజోక్యంవద్దు, ఇతరుల మేథస్సును,ధనాన్ని శ్రమను,ఆహారాన్ని దోచుకోవడానికి నీకు సిగ్గు అనిపించడంలేదు,మనం మన అవసరాలకు ఎలా దాచుకుంటామో,ఎదటివారుకూడా వారి అవసరాలకు అలానే దాచుకుంటారు.దొంగతనముచేసి మోసగించి ఎవరూ పెద్దవాళ్ళుకాలేరు అటువంటిచర్యలవలన సమాజం మనల్ని హీనంగాచూస్తుంది ఎవ్వరూ మనల్ని గౌరవించరు,మనకన్న చిన్నప్రాణులు ఆహారంకోసం అలుపు ఎరుగని పోరాటం చేస్తున్నాయి వాటినిచూసి నేర్చుకో!"అన్నది మెదటి పిల్లి.

కామెంట్‌లు