సీస పద్యం :
ఉత్తరాంధ్రనగల ఉన్నత పట్టణం
విజయనగర మందు వెలసి యున్న,
శ్రీ పైడిమాంబ మహీపతుల బిడ్డ ,
నగరాన యిలవేల్పు నయము గాను ;
తల్లి దీవెనలతో తప్పక ప్రతియేట ,
ఉత్సవమ్ము జరుగు ఊరు వాడ ;
సిరిమాను సిద్ధమై తిరువీధి పయనించి,
కనుల విందునుచేస్తు కాచు చుండు ;
తేటగీతి :
పెక్కు ప్రాంతాల ప్రజలొచ్చి వేడు కొనగ ,
మ్రొక్కు కున్న వారల జూచు మురిపముగను,
కోట ప్రాంగణం ముమ్మారు కోరి వచ్చి ...
కన్న వారల దీవించి గౌర వించు !!
~~~~~~~~~~~~~~~~~~~~~~~
addComments
కామెంట్ను పోస్ట్ చేయండి