: సీస పద్యం :; రామానుజం. ప.


 అందరికీ     భారత గణతంత్ర    దినోత్సవ  శుభాకాంక్షలు
==========================================
                      
భారత  స్వాతంత్య్రం    భాగ్యోత్సవాలలో  ,
           గణతంత్ర  వేడుక   గంధ మలరె  ;
స్మరింతు  తొల్లిగా    అమరుల  త్యాగాలు,
          అర్పింతు   పుష్పాలు , వారి కెల్ల   ;
దేశ  స్వేచ్ఛా  సాధనే   ధ్యేయముగ , తమ
          ధన, మాన, ప్రాణాది  త్యాగులకును  ;
జాతి   దీప్తి  పెరిగి   ,   జాగృతి  పొందెనే   --          
జయహో! భరతమాత!  జయము, జయము !!
తేట గీతి   :
విద్య,   ఆరోగ్య, సంక్షేమ  విరులు విరిసె   ,
శస్త్ర,    అస్త్ర, సాంకేతికా  శక్తి  పొంది  ,
సర్వ   జనుల కాదర్శమై  --  సద్గుణాల  ,
రత్నగర్భ    సాధించెనే   రమ్య  చరిత   !!
                      పరికల్పన  : రామానుజం. ప.
     ~~~~~~~ జైహింద్ ~~~ ~~~

కామెంట్‌లు