వేదభూమి నా దేశంత్యాగధనులు జనియించిన ధన్య భూమి నా దేశంకవి పండితులుదయించిన కర్మ భూమి నా దేశంమునివరేణ్యులు నడయాడిన పుణ్య భూమి నా దేశంపుణ్యక్షేత్రాలకు నిలయం నా దేశంపురాణేతిహాసాలకు ఆలయం నా దేశందేహాన్ని లెక్కచేయని రాజులకన్న నా దేశందేశానికి ప్రాణమిచ్చు వీరులున్న నా దేశంఅశోకుడేలిన ధర్మ ప్రదేశంబుద్దుడు వెలిసిన శాంతి దేశంఅహింసనే ఆయుధమై శ్వాసించిన దేశంశాంతి కపోతం ఎగరేసిన దేశంనా దేశంఓంకార నాదాలను ఒడిసి పట్టుకుందిఆకుపచ్చని సంతకాలను నేలపై రాసి పెట్టుకుందికళల అలల తొలుకులతో కనువిందు చేస్తుందిఅనురాగపు మమకారాలకు కొలువై నిలిచిందిఆత్మీయపు పలకరింపులతో పులకించిపోతోందిగంగా, గోదావరీ నదీ జలాల గల గలలలోఅవని సంబుర పడంగ నా దేశం పునీతమౌతోందిపింగళి వెంకయ్యను గెలిపించిన జెండాత్రివర్ణ పతాకమై ఎగురుతోంది ప్రతి గుండెనిండావిశ్వ వేదికపై వినిపిస్తోంది విజయబావుటా పేరుజయ జయహో భారతంటు నినాదాల హోరుకులమతాల పెనుగులాట మసకబారుతోందిప్పుడుభిన్న మతాల సంస్కృతితో సమైక్య రాగం పాడుతోందిప్పుడునేనూ నా దేశమంటూనలుదిక్కుల పరిమళాలు వీస్తున్నాయిజాతి ఖ్యాతి దిగ్దిగంతాలకు వ్యాప్తి చేస్తున్నాయి.._______
|| నా దేశం || ;-మచ్చ రాజమౌళిదుబ్బాక9059637442
త్రివర్ణ పతాకమై వెలుగుతోంది ప్రతి గుండె నిండా
ఎంత బాగుందో ఈ నీ కవిత
కొండ వేంకట నర్సయ్య భార్గవ
addComments
కామెంట్ను పోస్ట్ చేయండి