మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాకు చెందిన స్కూల్ అసిస్టెంట్ , కవయిత్రి చంద్రకళ.దీకొండ,బి.ఎస్.సి.,బి.ఎడ్.,ఎం.ఎ. గారు నూతన లఘు కవితా ప్రక్రియ *సున్నితం ను రూపొందించిన నెల్లుట్ల సునీత గారు కూర్చిన *తేనె ఊటల తెలుగు* అను కవితా సంకలనంలో *మన మాతృభాషను కాపాడుకుందాం* అనే అంశంపై తన రచనకు గాను *తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్* లో స్థానం సంపాదించి,సునీత గారిచే ప్రశంసాపత్రాన్ని అందుకున్నారు.ఈ సంకలనంలో 120 మంది కవులు రచించిన 600 *సున్నితాలు* ఉన్నాయి.ఇందులో తన కవితలకు చోటు కల్పించిన సునీత గారికి కృతజ్ఞతలు తెలిపారు.ఈ సందర్భంగా తోటి ఉపాధ్యాయులు, విద్యార్థులు ,
సాహితీ మిత్రులచే చంద్రకళ.దీకొండ గారు అభినందనలు అందుకున్నారు.
addComments
కామెంట్ను పోస్ట్ చేయండి