పెద్దేముల్ గురుకుల ఆర్ట్ టీచర్ కి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ డాక్టరేట్ ;-వెంకట్: మొలక ప్రతినిధి వికారాబాద్ జిల్లా
 గోనె లింగరాజు తుమ్మల పెన్ పహాడ్ గ్రామం, ఆత్మకూరు (S) మండలం,సూర్యాపేట జిల్లా లో వ్యవసాయ కూలి కుటుంబానికి చెందిన గోనె ఎల్లయ్య వీరమ్మ దంపతులకు నాలుగవ సంతానం. గోనె లింగరాజు  హైదరాబాద్ కేంద్రీయ విశ్వ విద్యా ద్యాలయo లో 22 వ స్నాతకోత్సవం సందర్భంగా అక్టోబర్ 1 న శ్రీ.ధర్మేంద్ర ప్రధాన్ (విద్యా మంత్రి మరియు భారత నైపుణ్యాభివృద్ధి & వ్యవస్థాపకత మంత్రిత్వ శాఖ మంత్రి), డా.తమిళసాయి సౌందరరాజన్ (తెలంగాణ గౌరవనీయ గవర్నర్) మరియు ప్రొఫెసర్.ఆర్.లింబాద్రి (TSCHE చైర్మన్). సమక్షంలో జస్టిస్ నర్సింహా రెడ్డి (గౌరవనీయ ఛాన్సలర్, UoH) నుండి డాక్టరేట్ అందుకున్నారు.  ఎంతో కష్టపడి మారుమూల గ్రామం అయిన తుమ్మల పెన్ పహాడ్ గ్రామం నుండి యూనివర్సిటీ స్థాయి కి వెళ్ళాలన్న తన కోరిక నెరవేరిందని గోనె లింగరాజు తన సంతోషాన్ని పంచుకున్నారు.
5వ తంగతి  నుండి ఇంటర్ వరకు  సాంఘిక సంక్షేమ గురుకులం  లో చదివి  చిత్రకళ పైన ఆసక్తి వున్న  లింగరాజు JNATU హైదరాబాద్  కాలేజీ లో BFA (painting) చదివి తరువాత ప్రో. స్టాన్లీ సురేష్ గారి సూచన తో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ లో MFA (painting) తరువాత అదే యూనివర్సిటీ లో ప్రో.గడ్డం కృష్ణారెడ్డి గారి పర్యవేక్షణ లో  "ఆర్ట్ గ్యాలరీలు మరియు దళిత చిత్రకారులు"  అనే అంశం పైన M.Phil పూర్తిచేసి తరువాత ప్రో.Y A సుధాకర్ రెడ్డి మరియు డా. జె. భీమయ్య గారి పర్యవేక్షణ లో " టెక్స్ట్ టైల్  ఆర్ట్ : ట్రెడిషన్ అండ్ చేంజెస్ ఇన్ తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్" అనే అంశం పైన తన PhD పరిశోధన పూర్తి చేసినారు.
అక్టోబర్ 1న జరిగిన 22 వ స్నాతకోత్సవం లో గోనె లింగరాజు గారికి డాక్టరేట్ ప్రధానం చేసినారు.
చదువుకుంటూనే మలి దశ  తెలంగాణ ఉద్యమంలో వచ్చిన  కొన్ని పుస్తకాలకు కవర్ పేజీ కి బొమ్మలు చిత్రించినారు, తను చిత్రించిన " తెలంగాణ బతుకు చిత్రాలు" మరియు  బతుకమ్మ సినిమాలో గీసిన " తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట చిత్రాలు" ఉద్యమం సమయం లో వీరికి చాలా పేరు చెచ్చినాయి. ఉద్యమ సమయంలో వీరి చిత్రాలు ఢిల్లీ మరియు తెలంగాణ పది జిల్లాలో ప్రదర్శించారు. వీరు గీసిన చిత్రాలను గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం (2017 లో కొత్త జిల్లాల ఆవిర్భావం తరువాత) ఉత్తమ చిత్రకారుని గా గుర్తించి యాబై వేల నగదు పురస్కారం తో పాటు ప్రశంసా పత్రాన్ని మంత్రి శ్రీ. జగదీష్ రెడ్డి గారి చేతుల మీదుగా ఉత్తమ చిత్రకారుడు నిగా అవార్డు అందుకున్నారు. 
ఇదే కాకుండా దేశం లో వివిధ ఆర్ట్ గ్యాలరీ లలో వీరి చిత్రాలు ప్రదర్శించారు.
తను ఆర్ట్ చదువుకునే రోజుల్లో డిగ్రీ ప్రవేశ పరీక్ష కష్టంగా వుండేది.. అందుకు గత 18 సంవత్సారాలు నుండి ఎంతో మంది విద్యార్ధులకు BFA ప్రవేశ పరీక్షకు కోచింగ్ ఇస్తున్నారు. వీరి దగ్గర శిక్షణ  తీసుకున్న విద్యార్థులు దేశం లోని వివిధ ఆర్ట్ కళాశాలలో చేరుతున్నారు.
ఒక వైపు చదువుకుంటూనే, తెలంగాణ ఉద్యమంలో మరియు చిత్రకళా రంగం లో తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నారు.
తను ఈ స్థాయికి రావడానికి కారణమైన తన తల్లి తండ్రుల ప్రోత్సాహం చాలా గొప్పదని అన్నారు.
ప్రస్తుతం తను చదువుకున్న గురుకులం లోనే ( పెడ్డిముల్, వికారాబాద్ జిల్లా) ఆర్ట్ టీచర్ గా పనిచేస్తూ విద్యార్థులకు చిత్రకళా బోధన చేస్తున్నారు. 
నా  జీవితంలో మరపురాని రోజు అక్టోబర్ 1,2022.  హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ 22వ స్నాతకోత్సవం లో PhD డిగ్రీ అందుకోవడం ద్వారా నేను  పై చదువులు చదువు కావాలన్న  నా కలలు  నిజమయినాయి అని తన సంతోషాన్ని పంచుకున్నారు. ఇప్పటివరకు 300 పుస్తకాలపై ముఖచిత్రానికి చిత్రాలు వేసిన ఘనత లింగరాజుది. జై బోలో తెలంగాణ. బతుకమ్మ సినిమాలలో తెలంగాణ సైదు రైతాంగ పోరాటంపై అనేక చిత్రాలు వేసి ఔరా అనిపించుకున్నారు.
 చదువులో మార్గనిర్దేశం చేసినందుకు తన గురువులకు, ప్రోతహించిన  మిత్రులకు మరియు కుటుంబ సభ్యుల  ఆప్యాయత వల్ల ఈ విజయం సాధ్యమైంది.  నా విజయ ప్రయాణంలో భాగమైన వారందరికీ కృతజ్ఞతలు అంటూ తన సంతోషాన్ని పంచుకున్నారు.
ఆర్ట్ లో డాక్టరేట్ తీసుకున్న సందర్భంగా గురుకుల  రీజినల్ కో ఆర్డినేటర్ డా. శారద వెంకటేష్ (RCO HRR WEST) మరియు కలశాల ప్రిన్సిపాల్ శ్రీమతి పి.సుజాత, తోటి ఉపాద్యాయులు అభినందనలు తెలియజేసి నారు.
భవిష్యత్తులో ఇంకా ఉన్నత శిఖరాలకు ఎదగాలని కోరుకుంటూ మనం కోరుదాం. మొలక తరపున హార్లీ కంగ్రాట్యులేషన్స్.










కామెంట్‌లు
Unknown చెప్పారు…
ఎంతో మంది యువ కళాకారులను పరిచయం చేస్తున్న వెంకట్ గారికి ధన్యవాదములు.
Unknown చెప్పారు…
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
anjiatwelly చెప్పారు…
Keep writing inspiring news like this.