గాంధీ గారు చనిపోయిన రెండు నెలల లోపే 1948 వ సంవత్సరంలో వారి శిలా విగ్రహాన్ని ముదునూరులో ప్రతిష్టించారు. ముదునూరులో రాజకీయ చైతన్యాన్ని తీసుకొచ్చి సమాజం కన్నా ముందు నడపాలన్న అభిప్రాయంతో ప్రతి ఒక్కరిలో మార్పు తీసుకురావడానికి ప్రయత్నం చేసిన అన్నే సుబ్రహ్మణ్యం గారి విగ్రహాన్ని స్థాపించారు గ్రామ అభివృద్ధికి ఎన్నో రకాలుగా సహకరించి సాయపడిన కాకాని వెంకటరత్నం గారి విగ్రహాన్ని 1978 వ సంవత్సరంలోనే ప్రతిష్టించారు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న ఎన్టీ రామారావు, వైయస్ రాజశేఖర్ రెడ్డి గార్ల విగ్రహాలు కూడా ఉన్నాయి. విప్లవాత్మక భా
వాలతో సమాజాన్ని ముందుకు నడిపిన అన్నే అంజయ్య గారి గుర్తుగా వారి విగ్రహాల్ని ఏర్పాటు చేశారు.
ఆశయాలకు ఆదర్శంగా జీవించే ఏ వ్యక్తిని దేశం ఆదరించదని అనేక సందర్భాలలో రుజువు అయ్యింది. నాగులపల్లి కోటేశ్వరరావు గారు, ఎలమంచిలి రామకృష్ణ గారు వీరిద్దరూ వామపక్ష భావాలకు కట్టుబడి సమాజానికి ఎంతో ఉపయోగపడే ఆదర్శాలతో ముందుకు దూసుకు వెళుతున్న సమయంలో
1950వ సంవత్సరంలో వారిని బలి తీసుకున్నారు వారి సేవలను గుర్తించి ముదునూరు గ్రామస్తులు వారిద్దరి పేరుతో స్తూపాలను ఏర్పాటు చేసి నేటికీ వారి ఆదర్శలను జ్ఞాపకం చేసుకుంటూనే ఉన్నారు. మనిషిని చంపగలరు తప్ప మనసులను వారి లోని మంచితనాన్ని ఎవరు కూడా చంపలేరు ఈ ప్రపంచంలో అనిపిస్తుంది. ఇలాంటి సంఘటనలను చూసినప్పుడు.
అయితే కొంతమంది కనిపిస్తుంది ఇక్కడ అడ్డుగా ఈ విగ్రహాలను ఎందుకు పెట్టారు దాని వల్ల తెలిసేది ఏమిటి అని. నిజం. దేశానికి గాంధీ మహత్ముడు చేసిన సేవలు ఎలాంటివో ప్రజలకు తెలుస్తుంది కానీ మన గ్రామంలో మన కోసం చేసిన పెద్దల పనులు ఏ ఒక్కటీ మనకు జ్ఞాపకం ఉండవు కారణం అలక్ష్యం. వాటిని చేయమని ఎవరు అడిగారు. వారి అవసరం వల్ల వారు చేశారు అనేవారు కొంతమంది ఉంటారు. కాదు ఉన్నారు. వారికి తెలియని ఒకే ఒక విషయం ఈ దేశంలో కానీ గ్రామంలో కానీ పెద్దల త్యాగాలు లేకపోతే ఆ దేశం ముందుకు వెళ్ళదు అని తెలియాలి అది జ్ఞాపకం చేయడం కోసం ఈ విగ్రహ స్థాపనలు వారిని చూసిన తర్వాత నైనా వీరు ఎవరు? ఏమిటి? ఎందుకు వీరి విగ్రహం ఇక్కడ ఉన్నది అని ఆరా తీస్తే అసలు విషయం తెలుస్తుంది దానిమీద ఆసక్తి పెరుగుతుంది దానితో ఆ వ్యక్తికి తన హృదయంలో ప్రముఖ స్థానం ఇవ్వడానికి ప్రయత్నిస్తాడు... దానితో గ్రామంలో ఏదో ఒక మంచి పని చేయాలన్న ఆలోచన పుట్టుకొస్తుంది.
వాలతో సమాజాన్ని ముందుకు నడిపిన అన్నే అంజయ్య గారి గుర్తుగా వారి విగ్రహాల్ని ఏర్పాటు చేశారు.
ఆశయాలకు ఆదర్శంగా జీవించే ఏ వ్యక్తిని దేశం ఆదరించదని అనేక సందర్భాలలో రుజువు అయ్యింది. నాగులపల్లి కోటేశ్వరరావు గారు, ఎలమంచిలి రామకృష్ణ గారు వీరిద్దరూ వామపక్ష భావాలకు కట్టుబడి సమాజానికి ఎంతో ఉపయోగపడే ఆదర్శాలతో ముందుకు దూసుకు వెళుతున్న సమయంలో
1950వ సంవత్సరంలో వారిని బలి తీసుకున్నారు వారి సేవలను గుర్తించి ముదునూరు గ్రామస్తులు వారిద్దరి పేరుతో స్తూపాలను ఏర్పాటు చేసి నేటికీ వారి ఆదర్శలను జ్ఞాపకం చేసుకుంటూనే ఉన్నారు. మనిషిని చంపగలరు తప్ప మనసులను వారి లోని మంచితనాన్ని ఎవరు కూడా చంపలేరు ఈ ప్రపంచంలో అనిపిస్తుంది. ఇలాంటి సంఘటనలను చూసినప్పుడు.
అయితే కొంతమంది కనిపిస్తుంది ఇక్కడ అడ్డుగా ఈ విగ్రహాలను ఎందుకు పెట్టారు దాని వల్ల తెలిసేది ఏమిటి అని. నిజం. దేశానికి గాంధీ మహత్ముడు చేసిన సేవలు ఎలాంటివో ప్రజలకు తెలుస్తుంది కానీ మన గ్రామంలో మన కోసం చేసిన పెద్దల పనులు ఏ ఒక్కటీ మనకు జ్ఞాపకం ఉండవు కారణం అలక్ష్యం. వాటిని చేయమని ఎవరు అడిగారు. వారి అవసరం వల్ల వారు చేశారు అనేవారు కొంతమంది ఉంటారు. కాదు ఉన్నారు. వారికి తెలియని ఒకే ఒక విషయం ఈ దేశంలో కానీ గ్రామంలో కానీ పెద్దల త్యాగాలు లేకపోతే ఆ దేశం ముందుకు వెళ్ళదు అని తెలియాలి అది జ్ఞాపకం చేయడం కోసం ఈ విగ్రహ స్థాపనలు వారిని చూసిన తర్వాత నైనా వీరు ఎవరు? ఏమిటి? ఎందుకు వీరి విగ్రహం ఇక్కడ ఉన్నది అని ఆరా తీస్తే అసలు విషయం తెలుస్తుంది దానిమీద ఆసక్తి పెరుగుతుంది దానితో ఆ వ్యక్తికి తన హృదయంలో ప్రముఖ స్థానం ఇవ్వడానికి ప్రయత్నిస్తాడు... దానితో గ్రామంలో ఏదో ఒక మంచి పని చేయాలన్న ఆలోచన పుట్టుకొస్తుంది.
addComments
కామెంట్ను పోస్ట్ చేయండి