పుస్తకావిష్కరణ మహోత్సవము
 ఆదిలాబాద్:- ఉట్నూరు సాహితీ వేదిక, ప్రభుత్వ జూనియర్ కళాశాల ఇంద్రవెల్లి సంయుక్తంగా నిర్వహిస్తున్న పుస్తకావిష్కరణ కార్యక్రమంలో ఉసావే పూర్వ అధ్యక్షులు శ్రీ రాథోడ్ శ్రావణ్ గారిచే రచించబడిన పండుగలు ముత్యాల హారాలు పుస్తకాన్ని జిల్లా పరిషత్ చైర్మన్ గౌ, శ్రీ, రాథోడ్ జనార్ధన్ గారు, జిల్లా మాధ్యమిక విద్యాధికారి ఆదిలాబాద్ గౌ,శ్రీ రవీందర్ కుమార్ 
 గార్ల చేతుల‌ మీదుగ ఆవిష్కరణ కార్యక్రమం ఉంటుందని ఉట్నూరు సాహితీ వేదిక అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు గౌ‌, శ్రీ కవన కోకిల జాదవ్ బంకట్ లాల్, ముంజం జ్ఞానేశ్వర్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కార్యక్రమానికి కళాశాల ప్రిన్సిపల్ శ్రీ  ధన్ రాజ్ ఐటిడిఎ ఎఇ  శ్రీ రాథోడ్ భీమ్ రావు,  తెలంగాణ రచయితల వేదిక రాష్ట్ర ఉపాధ్యక్షులు గౌ, శ్రీ ,గోపగాని రవీందర్, ఉట్నూరు బి.ఇడి కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ మెస్రం మనోహర్,
 జిల్లా ప్రిన్సిపల్ సంఘం అధ్యక్షుడు గౌ శ్రీ జాదవ్ గణేష్ కుమార్, లెక్చరర్ సంఘం రాష్ట్ర అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి శ్రీ జాదవ్  బలరామ్,  డి.శ్రీనివాస్, యం.బాలాజీ,  వహీద్  మోసిన్, కళాశాల సిబ్బంది తదితరులు హాజరౌతారని వారు అన్నారు.కావున
 విద్యార్థులు, కవులు, రచయితలు మొదలగు వారందరూ హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.
ఈ కార్యక్రమం ప్రభుత్వ జూనియర్ కళాశాల ఇంద్రవెల్లి లో తేది: 06-12-2022 న సమయం ఉదయం 11.30 గం,, లకు డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ వర్థంతి సందర్భంగా ఘనంగా నివాళులు అర్పించి కార్యక్రమం ప్రారంభమౌతుందని వారు పేర్కొన్నారు.

కామెంట్‌లు