జీవితంలో సద్గుణాలు ఆచరించాల్సిన ఆవశ్యకత గురించి మన ధర్మ శాస్త్రాలలో ఎంతో విపులంగా చెప్పబడింది.సద్గుణాలను ఆచరించడం వల్ల చేపట్టిన అన్ని రంగాలలో విజయం సిద్ధిస్తుంది.. క్రీడలు, సంగీతం, చలనచిత్రాలు, వ్యాపారం మొదలైన వివిధ రంగాలలోని విజయవంతమైన వ్యక్తులందరూ సద్గుణాలను గొప్పగా పాటించేవారే. వారికి సిద్ధించిన అత్యుత్తమ విజయం అదృష్టం వల్ల కాదు. అది వారి ప్రతిభ వల్ల మాత్రమే కాదు. సద్గుణాలను, ధర్మాలను పాటించడం వారిని విజయవంతం చేసింది అనడంలో ఎలాంటి సందేహం లేదు.. అత్యంత ప్రతిభావంతులైన వ్యక్తికి కూడా జీవితంలో విజయవంతం కావడానికి శ్రమ, సోమరితనం లేకపోవడం, వినయం, క్రమశిక్షణ అవసరం. ఈ సద్గుణాలు లేకుండా కేవలం ప్రతిభ ఒక వ్యక్తిని ఎక్కడికీ తీసుకువెళ్లలేదు.అసాధారణమైన ప్రతిభ ఉండి సద్గుణాలు లేని వ్యక్తి కంటే, సగటు ప్రతిభ ఉండి ఉన్నత స్థాయి ధర్మాలు కలిగిన వ్యక్తి జీవితంలో విజయవంతమవుతాడు. సద్గుణాలు జీవితంలో విజయానికి పునాది.
ఇక అనారోగ్యం, రిలేషన్ షిప్స్ సమస్యలు, ఉద్యోగంలో సమస్యలు, తిరస్కరణలు వంటి సవాళ్లు జీవితంలో ఒక భాగం. ధర్మాల సాధన ఒక వ్యక్తి బలంగా ఉండటానికి మరియు ఈ సవాళ్ళను సరిగా ఎదుర్కోవడానికి సహాయపడతాయి. కృతజ్ఞత, సహనం, క్రమశిక్షణ, ధైర్యం వంటి ధర్మాలు జీవితంలో కఠినమైన సమయాల్లో అంతర్గత శక్తిని మరియు ధైర్యాన్ని ఇస్తాయి.
ఈ సద్గుణాలను ఆచరించదం వలన ఆరోగ్యకరమైన, దృఢమైన మరియు ఆరోగ్యకరమైన శరీరం ఉంటుంది. మంచి ఆరోగ్యం కలిగి ఉండటానికి కొంత క్రమశిక్షణ మరియు మన మీద మనకి ప్రేమ అవసరం. శరీరానికి, మనసుకు దగ్గరి సంబంధం ఉంది. మనస్సును ప్రభావితం చేసేవి శరీరాన్ని కూడా ప్రభావితం చేస్తాయి. మనస్సు, కోపం, ద్వేషం, ఆగ్రహం మరియు క్షమ లేకపోవడంతో నిండినప్పుడు, పరిపూర్ణ ఆరోగ్యం సాధ్యం కాదు.
సద్గుణాలను ఆచరించదం వలన మరెన్నో ప్రయోజనాలు వున్నాయి. క్లుప్తంగా అవి:
1.సమయానికి పనులు చేసే స్వభావం వృద్ది చెందుతుంది. పద్దతి ప్రకారం పనులు చేయడం అలవాటు అవుతుంది.
2. అభ్యాసం చేసే వయస్సులో విద్య త్వరగా అబ్బుతుంది.చెడు అలవాట్లు దరి చేరకుండా ఉండగలిగే నియంత్రణ ఏర్పడుతుంది.
3.గౌరవ భావన పెరుగుతుంది.ఆత్మవిశ్వాసం పెరుగుతుంది.ఎప్పుడూ చైతన్యవంతంగా ఉండే అవకాశం ఎక్కువ.పనితీరు మెరుగ్గా ఉంటుంది.
సద్గుణాలు;- సి.హెచ్.ప్రతాప్
addComments
కామెంట్ను పోస్ట్ చేయండి