ఆకాశవాణి విజయవాడ కేంద్రం;- ఏ.బి ఆనంద్,ఆకాశవాణి,విజయవాడ కేంద్రం,9492811322
 ఆత్రేయ గారు తన జీవితానికి  సంబంధించిన అనేక సంఘటనలను  సినీ రంగంలో పాటలుగా మనకు వినిపించారు  తన మనసును కదిలించిన ప్రతి ఘటనపై  తన కలం  కథనానికి కాలు దువ్వేది  ఆత్రేయ పాటలు రాసి ప్రేక్షకులను  వ్రాయక నిర్మాతలను  ఏడిపిస్తారు అన్నది  అక్షర సత్యం  తన దగ్గర పనిచేస్తున్న  వారి మాటలను  తన సొంత మాటలుగా వాడుకున్నారు  ఆత్రేయ గారు సినారే గారు  రెడ్డి గారు కూడా ఏదైనా కొత్త పాత్రను సృష్టించాలంటే  ఆ ప్రాంతం వెళ్లి అక్కడ సామాన్యుడితో మాట్లాడే  పద్ధతిని గమనించి దానిని అక్షర రూపం లోకి తీసుకొస్తారు అలాగే ఆత్రేయ గారు కూడా  జీవితంలో తల్లిదండ్రులకు దూరమై  వేశ్యల ప్రాపకంలో పెరిగి పెద్దవాడై సాహితీ మూర్తిగా వెలుగొంది న వాడు.
తాను ప్రత్యక్షంగా వేశ్యా గృహాలలో జరిగే  ఘోరాలను  ప్రత్యక్షంగా చూసినవాడు  కనుకనే ఆకాశవాణిలో పనిచేస్తున్నప్పుడు  వారు చూసిన అనేక సంఘటనలను  అక్షర రూపంలో  ఆశువుగా శ్రోతలకు అందించి  వారి కళ్ళ నుంచి నీరు తెప్పించినవాడు  వీరందరి జీవితాలను ఆపోసనబట్టి  ప్రత్యేకించి హిందీ రంగంలో మీనా కుమారి గారిని  ఆంధ్రుల  అభిమాన తార సావిత్రిని  గమనించి వారి జీవితాలను అర్థం చేసుకొని  అ అధ్యయనంతో  అద్భుతమైన గ్రంథాన్ని వ్రాసి  ఆంధ్ర దేశానికి  ముచ్చటగా మూడవ  జ్ఞానపీఠ బహుమతిని  తీసుకువచ్చినవాడు ఇవాళ  సాంకేతిక పరంగా ఎన్నో విజయాలను సాధించిన భారతదేశం  చంద్రమండలం దాటి సూర్య మండలానికి వెళ్లడానికి కూడా  వాహనాలను తయారు చేసుకున్నది  ఇది ప్రతి భారతీయుడు గర్వించదగిన విషయం.

కామెంట్‌లు