విశ్వనరుడు మన గుర్రం జాషువా;- అంకాల సోమయ్యదేవరుప్పులజనగామ9640748497
అక్షరాన్ని ఆయుధంగా
మలచి 
అంటరానితనాన్ని
నిరసించుటకై
కవితా ఖడ్గాన్ని ఝలిపించిన
నవయుగ కవి చక్రవర్తి మధుర శ్రీనాథ 
శ్రీ గుర్రం జాషువా
గబ్బిలం ,ఫిరదౌసి ముసాఫిరులు,
స్వప్న కథ,
కొత్త లోకం,
క్రీస్తు చరిత్ర,
ఎన్నని చూపను 
నాటి కాలము సామాజిక ‌రుగ్మతల్ని వ్యతిరేకిస్తూ
తాను 
ఎక్కుపెట్టిన  కవితాస్త్రాలు
ఊరికి ఆవల ఆవాసాలు,
ఊరి బావిలో నీరు తాగడానికి
వీలులేని పరిస్థితి,
బడికి, గుడికి దూరమైన
ఆ బాల జాషువా తన పసితనాన
వారి తల్లినడిగాడు
ఎందుకమ్మా మనకు
బడిలో, గుడిలో ప్రవేశమెందుకులేదన్నప్పడు
జాషువా గారి తల్లి
ఇది జాతికి పట్టిన జబ్బు
నాయనా
దీనిని బాగుచేయగల వైద్యుదొకడిప్పుడు కావాలన్నది
అప్పుడే నిర్ణయించుకున్నాను
జాషువా 
ఆ( ఈ)ఆసమ సమాజం 
బాగుచేయువైద్యున్ని
నేనెందుకు కాకూడదని
మనలో కొందరు అంటరానివాళ్ళు అనే భావన
పురాణేతిహాసాలలో మతగ్రంథాలలో ఉందా!?
అని భారత, రామాయణం,భాగవతం,
వేదాలు ఉపనిషత్తులు
మతగ్రంథాలు ఊరిచివర పాడుబడ్డ బంగ్లాలో
గుడ్డిదీపపు వెలుగు లో
నిత్యం చదివేవాడు
అప్పుడు బాల జాషువా కు
అవగతమైన 
విషయమేమంటే
ఇదంతా
కొన్ని అగ్ర కులాలు కావాలనే 
ఆడుతున్న పైశాచిక ఆటయని
దీనిని నిరసిస్తూ
కలంయోధుడై  
నాటి సమకాలీన పరిస్థితులను తమ రచనల్లో
ఎండగట్టాడు
ఎగుడుదిగుడు లేని సమాజాన్ని 
సమంచేసాడు

కులమతాలు గీసుకున్న గీతలజొచ్చి పంజరాన గట్టువడనునేను,
నిఖిల లోక మెట్లు నిర్ణయించినను
గాని విశ్వనరుడ 
నేను,అని
ఎలుగెత్తి చాటాడు
కులదురహంకారాన్ని
అడుగడుగునా
ఖండించాడు 
మన జాషువా
దళితజనభాందవుడు
బహుజనుల ఆశాజ్యోతి
ప్రాతఃస్మరణీయుడు
మన గుర్రం జాషువా


కామెంట్‌లు