నేషనల్ గ్రీన్ కోర్ ఆధ్వర్యంలో మొక్కల పెంపకం

 పర్యావరణ పరిరక్షణ కోసం మొక్కలు నాటి, అవి చెట్లుగా పెరిగేవరకూ కృషి చేయవలసిన బాధ్యత అందరిపైనా ఉందని కడుము జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు గొర్లె తిరుమలరావు అన్నారు. 
వాతావరణంలో కాలుష్య నివారణకు విరివిగా పచ్చదనం చేకూర్చాలని అందుకు మనమంతా కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. నేషనల్ గ్రీన్ కోర్ కమిటీ కార్యదర్శి తూతిక సురేష్, ఎన్ జి సి ప్రతినిధి, వ్యాయామ ఉపాధ్యాయులు జన్ని చిన్నయ్యల ఆధ్వర్యంలో పాఠశాల ఆటస్థలంలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని  నిర్వహించారు. ఇటీవల పుట్టినరోజు సందర్భంగా పాఠశాలలో మొక్కలు నాటిన విద్యార్థులు ధనుకోట సందీప్, డి.నాని, డి.మనోజ్, డి.భరత్, కరక తరుణ్ లను ప్రధానోపాధ్యాయులు గొర్లె తిరుమలరావు, ఎన్ జి సి కమిటీ కార్యదర్శి తూతిక సురేష్, వ్యాయామ ఉపాధ్యాయులు జన్ని చిన్నయ్య, ఉపాధ్యాయులు అభినందించారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులంతా వృక్షాలు పెంచడం మానవుని మనుగడకు, జీవనోపాధికి, పురోగతికి ముఖ్యమైన ఆరోగ్య సోపానాలని ప్రసంగించారు. ప్రధానోపాధ్యాయులు గొర్లె తిరుమలరావు, ఉపాధ్యాయులు తూతిక సురేష్, దార జ్యోతి, కింజరాపు నిర్మలాదేవి, కుదమ తిరుమలరావు, పెయ్యల రాజశేఖరం, వల్లూరు లక్ష్మునాయుడు, బత్తుల వినీల, పడాల సునీల్, జన్ని చిన్నయ్య,  బోనెల కిరణ్ కుమార్, గుంటు చంద్రం, రబికుమార్ మహాపాత్రో, సస్మితా పాఢి, సింగంశెట్టి మురళీకృష్ణలు పాల్గొన్నారు.
కామెంట్‌లు