శిక్షణ పొందిన గురువులు :- ఎడ్ల లక్ష్మి -సిద్దిపేట
తల్లి తండ్రుల్లారా రారండి 
బడికి మీరు వెళ్ళండి 
బడిలో గురువులను చూడండి 
శిక్షణ పొందిన ఉపాధ్యాయులు 

ఆటపాటలతో వారు 
అక్షరాలు నేర్పుతారు 
చక్కటి విద్యను బోధిస్తూ 
చక్కదిద్దుతారు పిల్లలను 

క్రమశిక్షణ నేర్పుతూ వారు 
విజ్ఞానులుగా మారుస్తారు 
జ్ఞానము పొందిన పిల్లలు 
సరస్వతి పుత్రులైవారు

భారత దేశ పౌరులుగా వారు 
దేశానికి సేవలు చేస్తూ 
విజయాల దిశలో నడుస్తూ 
దేశానికి ఎల్లలై నిలుస్తారు 


కామెంట్‌లు