చాలు!!!?:- డా.ప్రతాప్ కౌటిళ్యా
చదువులు -పేదలకు 
మాత్రమే!!
పదవులు-పెద్దలకు 
మాత్రమే!!

రాజకీయాలు 
దేశాన్ని పాలిస్తాయి 
దేశాన్ని నిర్మిస్తాయి!!

చదువులు 
దేశాన్ని మారుస్తాయి 
దేశం దశ దిశను ఆవిష్కరిస్తాయి!!

భారత రాజ్యాంగాన్ని రచించింది 
రచయిత కాదు-పాలకులు కాదు!?
రాజ్యాంగాన్ని రచించింది 
భారతదేశ ప్రజలు!!!!!!!!?

పాఠకులు పుస్తకాన్ని ప్రేమిస్తే 
రచయితను ప్రేమిస్తారు.!!
కానీ 
ఇక్కడ రచయితలు ప్రజలే
పాఠకులు ప్రజలే!!??!!!!!!?

పాలకులు కావాలనుకుంటే 
ముందు పాఠకులు కావాలి 
అంటే రాజ్యాంగం చదువుకోవాలి!!?

పేదలకు చదువులు మేలు!
పెద్దలకు రాజకీయాలు చాలు!!!

దోపిడీ చేయాలనుకుంటే 
దొంగలు కండి.!?
డబ్బు కావాలనుకుంటే 
దొంగ వ్యాపారం చేయండి!!?

రాజ్యాంగాన్ని కాపాడాలనుకుంటేనే
రాజకీయాల్లోకి రండి!!!!!?
రాజకీయాన్ని వ్యాపారం చేయకండి!!?

డా.ప్రతాప్ కౌటిళ్యా.

కామెంట్‌లు