ఎవరూ లేని ప్రదేశంలో ఏకాంతంగా
జాబిల్లి వెలుతురులో మహావృక్షం కింద
కూర్చొని పుస్తకం చదువుతుంటే ఆ
అనుభూతి చాలా హాయిగా ఉంటుంది
మనస్సును ఏకాగ్రతగా ఉంచుకొని
ఎప్పటి క్షణాలను అప్పుడే ఒడిసిపట్టి
ఆస్వాదించి సంతోషించాలి .
పక్షుల కిల కిల రావాల మధ్యన
కోయిలమ్మ తియ్యని గొంతును వింటూ
చదువుతూ ఉంటే ఆహ్లాదంగా ఉంటుంది.
మనం చేసే పనిని నిష్ఠగా ,ఇష్టంగా
చేసినప్పుడే మనకు తృప్తి కలుగుతుంది.
addComments
కామెంట్ను పోస్ట్ చేయండి