హైదరాబాద్ తాజ్ హోటల్లో కవి సోమన్న పుస్తకావిష్కరణ

 పెద్దకడబూరు మండల పరిధిలోని కంబదహాళ్ జిల్లా పరిషత్  ఉన్నత పాఠశాలలో గణితోపాధ్యాయుడుగా పనిచేస్తున్న ప్రముఖ బాలసాహిత్యవేత్త ,బాలబంధు  గద్వాల సోమన్న  రచించిన  61వ పుస్తకం  "చిరు దివ్వెలు"  పుస్తకావిష్కరణ తాజ్ మహల్  హోటల్, హైదరాబాద్ లో ఘనంగా ఆవిష్కరించారు.మహర్షి వాల్మీకి సాంస్కృతిక సేవా సంస్థ ,హైదరాబాద్ వారు ఆంగ్ల నూతన సంవత్సరం-2025 సందర్భంగా నిర్వహించిన కవి సమ్మేళనం మరియు పుస్తకాల ఆవిష్కరణ మహోత్సవం కార్యక్రమంలో సోమన్న రచించిన "చిరు దివ్వెలు" పుస్తకాన్నిముఖ్య అతిథి పద్మశ్రీ శ్రీ డా.కొలకలూరి ఇనాక్,విశ్రాంత భూగర్భ గనుల శాఖ అధికారి శ్రీ డా.వి.డి.రాజగోపాల్,కళాపోషకులు విశ్రాంత అటవీశాఖ అధికారి శ్రీ ఎ. ఎల్.కృష్ణారెడ్డి,కళారత్న   శ్రీ డా.బిక్కి కృష్ణా,శ్రీడా.జె.విద్యాధర్, తె. ర.సం. అధ్యక్షులు శ్రీ నాళేశ్వరం శంకరం,గజల్ క్వీన్ శ్రీమతి వాసిరెడ్డి మల్లీశ్వరి, సినీ గీత రచయిత రి సాదనాల వేంకట స్వామి నాయుడు   విచ్చేసిన ప్రముఖుల చేతుల మీద  ఆవిష్కరింపబడింది. అనంతరం ఈ పుస్తకాన్ని శ్రీ ఎ.ఎల్.కృష్ణారెడ్డి గారికి అంకితమిచ్చారు.రమారమి 6 వసంతాల కాల వ్యవధిలో  61 పుస్తకాలు రచించి,పలు చోట్ల వాటిని ఆవిష్కరించిన గద్వాల సోమన్న  అవిరళ కృషిని ప్రశంసిస్తూ సత్కరించారు.  ఈ కార్యక్రమంలో గాయకుడు శ్రీ.డా. అరవా రవీంద్రబాబు,డప్పు కళాకారుడు కేశవయ్య, ఉపాధ్యాయులు ఎ. నాగేశ్వరరావు,కొప్పుల ప్రసాద్, కవులు, సాహితీమిత్రులు మరియు పాత్రికేయులు పాల్గొన్నారు.
కామెంట్‌లు