హిందూ సామ్రాజ్య స్థాపకుడు- ఛత్రపతి శివాజి(19 ఫిబ్రవరి 1630- 3 ఏప్రిల్ 1680)................................జీవితాన మొదట దేశమనితల్లి తండ్రులు, విద్య నేర్పిన గురువు కి తరువాత ప్రాధాన్యత అనిబానిసత్వం నుంచి దేశాన్ని రక్షించుటే నా కర్తవ్యం అనిహిందుసామ్రాజ్యస్థాపన కేతన జీవితాన్ని అర్పించినఛత్రపతి శివాజీ సదా స్మరణీయులు......!!మహారాష్ట్రలో పూణే దరిషాహాజీ, జిజియాబాయి దంపతులకు జన్మించిన శివాజీ బాల్యంలో మాతృమూర్తి చెప్పిన రామాయణ,భారత గాధలు ,శిబి, రంతిదేవుల జీవిత చరిత్రలతో ప్రభావితుడై నందునజిజియాబాయి మొదటిగురువే అనిపరదేవతా గా స్వీకరించినమాతృభక్తి పరాయణుడు.!పదిహేడేండ్ల ప్రాయంలోనే బీజాపూర్ సామ్రాజ్యానికి తోర్నా కోట, రాయఘడ్ కోటలను స్వాధీనము చేసుకుని, తండ్రి ని అన్న శంభాజీ తో కలసి ఖైదునుంచి విడిపించిన వీరపుత్రుడు. పరాక్రమవంతుడైనఅఫజుల్ ఖాన్ తలనరికితన ఇష్టదైవమైన భవానీమాత దేవాలయవినాశనకారుని హతమార్చిన పరాక్రమ దైవభక్తులు శివాజీ మహరాజ్...!!యశ్వంతి అను పేరు గల ఉడుము సహాయంతో మంత్రి తానాజీ రాయఘడ్ కోటను ఆక్రమించి వీరమరణం పొందినపుడుశత్రువును గెలిచాము కానీ సింహాన్ని పోగొట్టుకున్నామన్న స్నేహశీలి శివాజీ....!!శత్రుసంహరము చేసి వారి అందమైన భార్యని శివాజీకి సైనికాధికారి బహుమతిగా ఇస్తేమీ అంత అందమైన తల్లికినే జన్మిస్తే ఎంత అందముగా ఉందునో అన్నశివాజీ స్త్రీ జనోద్ధారకుడునిష్కళంక దేశభక్తుడు...!!పరమత సహనానికి ప్రతీకగా ఆయుధ విభాగాధిపతి హైదర్ ఆలీఖాన్ ను,నావికాదళానికి ఇబ్రహీంఖాన్ ను,సర్వ సైన్యాధ్యక్షునిగా దౌలత్ ఖాన్ ను నియమించినరాజనీతిజ్ఞులు శివాజీమీకివే మా శతకోటి భారతీయుల వందనములు....!!............................
ఛత్రపతి శివాజి:- కవి మిత్ర, సాహిత్య రత్న -ఆచార్య అయ్యలసోమయాజుల ప్రసాద్-(పుష్యమి)-విశాఖపట్నం
• T. VEDANTA SURY

addComments
కామెంట్ను పోస్ట్ చేయండి