శరీరం ఆశాశ్వతమనిఏది మనవెంటరాదనిఈర్ష్యా ద్వేషాలు అభివృద్ధికి నిరోధకాలనిప్రేమతత్వమే ముముక్షత్వమనిశాంతి అహింసలే సుఖమయ జీవితానికి సోపానాలనిచక్రవర్తి పదవిని తృణప్రాయంగా త్యజించిసిద్ధార్థుడు యవ్వనములోనేభార్యా పుత్రులను భోగభాగ్యాలను వదలిసత్యాన్వేషణ చేసితథాగతుడని ప్రసిద్ది చెంది 'దేవుడు నీకు కోరుకున్నంతధనం ఇవ్వక పోవచ్చు.. కానీకోరుకున్నదాని కంటేఎక్కువమంచి గుణం ఇచ్చినప్పడుఅదే "అదృస్టంగా" భావించని''ఆశ దుఃఖానికి హేతువనిఆశనుంచి విముక్తి పొందితే దుఃఖం అంతం అవుతుందని'జీవితంలో మనం చేసే తప్పుల్నిగమనిచేది ఇద్దరేఒకరు పరమాత్మఇంకొకరు అంతరాత్మ అనిఅనేక సూక్తులను చెప్పిఆదర్శజీవితానికి మార్గాన్ని చూపి' బుద్ధం శరణం గచ్ఛామిధర్మం శరణం గచ్ఛామిసంఘం శరణం గచ్ఛామి'అని సమాజశ్రేయస్సు చేసిన తథాగతునికినేనందిస్తున్న అక్షరాంజలులు ...!!(బుద్ధ జయంతి సందర్భంగా వ్రాసినది)...............................
తథాగతునికి కి అక్షరాంజలులు: - కవిమిత్ర, సాహిత్యరత్న-ఆచార్య అయ్యలసోమయాజుల ప్రసాద్ (పుష్యమి)-విశాఖపట్నం.
• T. VEDANTA SURY
addComments
కామెంట్ను పోస్ట్ చేయండి