భీష్మ పర్వము ప్రథమాశ్వాసము- 229 వ రోజు
కౌరవుల యుద్ధ సన్నాహం
సంజయుడు వ్యాసభగవానుని స్మరించి వివరణ ప్రారంభించాడు. " రాజా ! ముందుగా నేను మన సైన్యం విదడిది చేసిన ప్రదేశంలో నీ కుమారుని స్తావరానికి వెళ్ళాను అక్కడ సుయోధనుడు గాంగేయాదుల మధ్య కూర్చుని మంతనాలు జరుపుతూ " దుశ్శాసనా ! పాండవులతో యుద్ధం చేయాలన్న మన కుతూహలం ఈ నాటికి తీరనున్నది. భీష్ముడు మన సైన్యాలకు ఆరవ ప్రాణం అతడు ఒక్కడే పాండవ సైన్యాలను అంత మొందించగల యోధుడు . మనలను రక్షించు భీష్ముని మనం కంటికి రెప్పవలె రక్షించుకోవాలి . ఈతడిని ఎదిరించి నిలువగలిగిన వీరుడు ఈ అవనిలో లేడు. శిఖండి తప్ప ఈడిని నిలుప గలిగిన వారు లేరు. కనుక మనం ఈ మహానుభావుడికి శిఖండి చేతిలో మరణం సంభవించకుండా కాపాడుకోవాలి. భీష్మునికి శిఖండి ఎదురు రాకుండా జాగ్రత్తగా చూడండి " అన్నాడు. ఆపై శంఖములు, దుందుభులు , మంగళ వాద్యముల నడుమ కౌరవ సేనలు యుద్ధానికి బయలు దేరాయి. సువర్ణ తాళ కేతనముతో భీష్ముడు, కాంచన వేదిక కేతనముగా ద్రోణుడు, బంగారు గోవు కేతనంగా కృపుడు, తోకసహిత సింహం కేతనంగా అశ్వధ్ధామ, అరటి చెట్టు కేతనంగా శల్యుడు మొదలైన వీరులు బయలు దేరారు. యాదవ బలంతో కృతవర్మ, ససైన్య సమేతంగా మహారధుడైన జయద్రధుడు, గజబలంతో విందానువిందులు, కళింగ సైన్య సమేతంగా భగదత్తుడు, ససైన్య సమేతంగా తన కుమారులు తమ్ములు వెంట రాగా గాంధార రాజు శకుని , సోమదత్తుడు, భూరి శ్రవుడు, బాహ్లికుడు తమ తమ సైన్యాలతో మొహరించారు. కాంభోజరాజు సుదక్షిణుడు, కోసలరాజు బృహద్బలుడు, మహిష్మతీ పురాధీశుడు నీలుడు, త్రిగర్తాధిపతి సుశర్మ, అసుర వీరుడు అలంబసుడు, సాళ్వ, సౌవీర, శూరసేన, యవన రాజులంతా పది అక్షౌహినుల సైన్యంతో సిద్ధంకాగా నీ కుమారుడు తన అక్షౌహిని సైన్యంతో పాము పడగ కేతనంతో యుద్ధానికి తరలి వెళ్ళారు. నీ కుమారునికి ఇరు వైపుల దుశ్శాసనుడు, దుర్మరణుడు, వివింశతి , వికర్ణుడు ఉన్నారు.
భీష్ముడు సైన్యాలను యుద్ధోన్ముఖులను చేయుట
సైన్యాధ్యక్షుడైన భీష్ముడు " మహావీరులారా ! క్షత్రియ వీరులకు యుద్ధభూమిలో స్వర్గద్వారాలు తెరిచి ఉంటాయి. ఇంతకు ముందు ఎందరో యుద్ధంలో మరణించి ఆ మార్గంలో ప్రయాణించారు. క్షత్రియ వీరులకు ఇంట్లో రోగాల బారిన పడి మరణించడం కంటే మరో పాపం లేదు కనుక మీరు కూడా ఆ మార్గంలో పయనించండి. రణరంగం క్షత్రియులకు పెన్నిధి వంటింది " అన్నాడు. ఆ మాటలు విన్న క్షత్రియ వీరులు ఉత్సాహంగా " మేమంతా మీ వెంట ఉండి విజయమో వీరస్వర్గమో తేల్చుకుంటాము " అన్నారు. తరువాత సుయోధనుని అడిగి కర్ణుడు తన పుత్ర, మిత్ర, అమాత్య, బంధు సహితంగా యుద్ధభూమిలో లేడని నిర్ధారించుకున్నాడు. సుయోధనుడు కర్ణుడు అతని సంబంధితులు యుద్ధ భూమిలో లేరని భీష్మునకు తెలిపి అలాగే వ్యూహ రచన చేయమని వేడుకున్నాడు. భీష్ముడు వ్యూహరచన చేసాడు. భీష్ముడు, ద్రోణుడు పడమర ముఖంగా నిలబడ్డారు. తమకు ఒక వైపు కృపాచార్య అశ్వథామలు, మరొక పక్క కృతవర్మ, శల్యులను నిలిపాడు. వెనుక బాహ్లిక సోమదత్తులు ఉన్నారు. నడుమ సుయోధనుడు ఉన్నాడు. సుశర్మ మొదలైన వారిని అక్కడక్కడ నిలిపారు.
*రేపు *
భారతంలో ఉండేది భూమిపై ఎక్కడైనా ఉంటుంది భారతంలో లేనిది భూమిపై ఎక్కడా లేదు
రోజూ భారతం చదవండి భగవద్ అనుగ్రహం పొందండి
కౌరవుల యుద్ధ సన్నాహం
సంజయుడు వ్యాసభగవానుని స్మరించి వివరణ ప్రారంభించాడు. " రాజా ! ముందుగా నేను మన సైన్యం విదడిది చేసిన ప్రదేశంలో నీ కుమారుని స్తావరానికి వెళ్ళాను అక్కడ సుయోధనుడు గాంగేయాదుల మధ్య కూర్చుని మంతనాలు జరుపుతూ " దుశ్శాసనా ! పాండవులతో యుద్ధం చేయాలన్న మన కుతూహలం ఈ నాటికి తీరనున్నది. భీష్ముడు మన సైన్యాలకు ఆరవ ప్రాణం అతడు ఒక్కడే పాండవ సైన్యాలను అంత మొందించగల యోధుడు . మనలను రక్షించు భీష్ముని మనం కంటికి రెప్పవలె రక్షించుకోవాలి . ఈతడిని ఎదిరించి నిలువగలిగిన వీరుడు ఈ అవనిలో లేడు. శిఖండి తప్ప ఈడిని నిలుప గలిగిన వారు లేరు. కనుక మనం ఈ మహానుభావుడికి శిఖండి చేతిలో మరణం సంభవించకుండా కాపాడుకోవాలి. భీష్మునికి శిఖండి ఎదురు రాకుండా జాగ్రత్తగా చూడండి " అన్నాడు. ఆపై శంఖములు, దుందుభులు , మంగళ వాద్యముల నడుమ కౌరవ సేనలు యుద్ధానికి బయలు దేరాయి. సువర్ణ తాళ కేతనముతో భీష్ముడు, కాంచన వేదిక కేతనముగా ద్రోణుడు, బంగారు గోవు కేతనంగా కృపుడు, తోకసహిత సింహం కేతనంగా అశ్వధ్ధామ, అరటి చెట్టు కేతనంగా శల్యుడు మొదలైన వీరులు బయలు దేరారు. యాదవ బలంతో కృతవర్మ, ససైన్య సమేతంగా మహారధుడైన జయద్రధుడు, గజబలంతో విందానువిందులు, కళింగ సైన్య సమేతంగా భగదత్తుడు, ససైన్య సమేతంగా తన కుమారులు తమ్ములు వెంట రాగా గాంధార రాజు శకుని , సోమదత్తుడు, భూరి శ్రవుడు, బాహ్లికుడు తమ తమ సైన్యాలతో మొహరించారు. కాంభోజరాజు సుదక్షిణుడు, కోసలరాజు బృహద్బలుడు, మహిష్మతీ పురాధీశుడు నీలుడు, త్రిగర్తాధిపతి సుశర్మ, అసుర వీరుడు అలంబసుడు, సాళ్వ, సౌవీర, శూరసేన, యవన రాజులంతా పది అక్షౌహినుల సైన్యంతో సిద్ధంకాగా నీ కుమారుడు తన అక్షౌహిని సైన్యంతో పాము పడగ కేతనంతో యుద్ధానికి తరలి వెళ్ళారు. నీ కుమారునికి ఇరు వైపుల దుశ్శాసనుడు, దుర్మరణుడు, వివింశతి , వికర్ణుడు ఉన్నారు.
భీష్ముడు సైన్యాలను యుద్ధోన్ముఖులను చేయుట
సైన్యాధ్యక్షుడైన భీష్ముడు " మహావీరులారా ! క్షత్రియ వీరులకు యుద్ధభూమిలో స్వర్గద్వారాలు తెరిచి ఉంటాయి. ఇంతకు ముందు ఎందరో యుద్ధంలో మరణించి ఆ మార్గంలో ప్రయాణించారు. క్షత్రియ వీరులకు ఇంట్లో రోగాల బారిన పడి మరణించడం కంటే మరో పాపం లేదు కనుక మీరు కూడా ఆ మార్గంలో పయనించండి. రణరంగం క్షత్రియులకు పెన్నిధి వంటింది " అన్నాడు. ఆ మాటలు విన్న క్షత్రియ వీరులు ఉత్సాహంగా " మేమంతా మీ వెంట ఉండి విజయమో వీరస్వర్గమో తేల్చుకుంటాము " అన్నారు. తరువాత సుయోధనుని అడిగి కర్ణుడు తన పుత్ర, మిత్ర, అమాత్య, బంధు సహితంగా యుద్ధభూమిలో లేడని నిర్ధారించుకున్నాడు. సుయోధనుడు కర్ణుడు అతని సంబంధితులు యుద్ధ భూమిలో లేరని భీష్మునకు తెలిపి అలాగే వ్యూహ రచన చేయమని వేడుకున్నాడు. భీష్ముడు వ్యూహరచన చేసాడు. భీష్ముడు, ద్రోణుడు పడమర ముఖంగా నిలబడ్డారు. తమకు ఒక వైపు కృపాచార్య అశ్వథామలు, మరొక పక్క కృతవర్మ, శల్యులను నిలిపాడు. వెనుక బాహ్లిక సోమదత్తులు ఉన్నారు. నడుమ సుయోధనుడు ఉన్నాడు. సుశర్మ మొదలైన వారిని అక్కడక్కడ నిలిపారు.
*రేపు *
భారతంలో ఉండేది భూమిపై ఎక్కడైనా ఉంటుంది భారతంలో లేనిది భూమిపై ఎక్కడా లేదు
రోజూ భారతం చదవండి భగవద్ అనుగ్రహం పొందండి

addComments
కామెంట్ను పోస్ట్ చేయండి