సంపూర్ణ మహాభారతముసరళ వ్యావహారిక భాషలో...!
 భీష్మ పర్వము ద్వితీయాశ్వాసము-247 వ రోజు
అర్జునిని ప్రతాపం
కృష్ణార్జునుల శంఖారావం విన్న భీష్ముడు, భూరిశ్రవుడు, శల్యుడు, దుర్యోధనుడు ఒక్క సారిగా అర్జునినిపై శక్తి, గదా, తోమరములు ప్రయోగించారు. అర్జునుడు వాటిని అన్నింటిని ఒక్కసారిగా తుంచి వేసి వారిపై ఇంద్రాస్థాన్ని ప్రయోగించాడు. ఇంద్రాస్త్రం కౌరవ సేనలను విధవిధాలుగా నాశనం చేసాయి. అర్జునుడు భీష్మునిపై అతి క్రూరమైన బాణములు వేసాడు, భూరిశ్రవుని విల్లు విరిచాడు, తొమ్మిది బాణములను శల్యునిపై సంధించాడు. పాంచాల విరాట సైన్యాలు అక్కడకు చేరాయి. అర్జునిని పరాక్రమం చూసి కౌరవ సేన బెదిరి పోయింది. కౌరవులు అందరూ కలసి అర్జునిని రథమును చుట్టుముట్టారు. ఇంద్రాస్త్ర తాపనాకి కౌరవ సేనలు చాప చుట్టలా పడి పోతున్నాయి. హయములు, రథములు, ఏనుగులు కూలి పోతున్నాయి. ఆయుధములు, ఛామరములు, కేతనములు, ఛత్రములు తుక్కు తుక్కుగా అయినాయి. కృషార్జునులు పాంచజన్య దేవదత్తములు పూరించి సింహనాదం చేసారు. అర్జునిని ధాటికి ఆగలేని కౌరవ సేన ఆరోజుకు యుద్ధాన్ని ఆపి తమ నివాసములకు చేరుకున్నాయి. వంధిమాగదులు పాండవుల విజయానికి కీర్తిస్తుండగా పాండవ సేనలు తమ నివాసములకు చేరాయి.
నాల్గవరోజు యుద్ధం
నాల్గవ రోజు యుద్ధానికి భీష్ముడు అపారమైన సైన్యాలను తీసుకుని వచ్చాడు. ద్రోణుడు, సుయోధనుడు, బాహ్లికుడు రణరంగం చేరుకున్నారు. భీష్ముడు భీకరంగా శంఖనాదం చేసాడు. గజ సమూహాలు ఘీంకారం చేసాయి. పాండవ సేనలు కూడా రణరంగ ప్రవేశం చేసాయి. కృషార్జునులు సూర్య చంద్రులలా ప్రకాశిస్తూ పాంచజన్య దేవదత్తములు పూరించారు. మిన్నంటే భేరి తూర్య నాదముల మధ్య ఇరుపక్షాలు యుద్ధ సద్ధం అయ్యాయి. ఇరు పక్షాలు తలపడ్డాయి. తోమరములు, క్షురికలు, బల్లెములు, గదలు, కుంతములు మొదలైన ఆయుధములతో కాల్బలం పోరు సాగిస్తుంది. కరవాలములు తిప్పబడుతున్నాయి. గదలు, ముసలములు, ముద్గరములతో ఒకరిని ఒకరు మోదుకుంటున్నారు. భీష్ముడు అంతటా తానై యుద్ధం చేస్తున్నాడు. సుయోధనుడు, ద్రోణుడు, వివిశంతి, కృపాచార్యుడు, శల్యుడు, సోమదత్తుడు భీష్ముని వెన్నంటి ఉన్నాడు. ఇది చూసిన అభిమన్యుడు ఒక్కడే వారినీందరిని ఎదుర్కొని వారంతా ప్రయోగించిన బాణములను తుంచి వేస్తున్నాడు. భీష్ముడు అభిమన్యుని విడిచి అర్జునినితో పోరాడుతున్నాడు. భీష్మార్జునుల పోరు భీకరం కాగానే ఇరు పక్షముల వారి అది తిలకించ సాగారు.
అభిమన్యుని ప్రతాపం
అశ్వత్థామ, భూరిశ్రవుడు, శల్యుని కుమారుడు, చిత్రసేనుడు ఒక్కుమ్మడిగా అభిమన్యుని ఎదుర్కొన్నారు. అభిమన్యుడూ చిరు నవ్వు నవ్వుతూ అశ్వత్థామ గుండెలకు గిరి పెట్టి బాణమును విడిచాడు. భూరిశ్రవుని ఓడించాడు. అభిమన్యుని వంటి వీరుడు కౌరవ సేనలో కరువయ్యారు. అర్జునుడు అభిమన్యుని చూస్తూ కౌరవ సేనలను అంతటా తానై చీల్చి ఛండాడుతున్నాడు. సుయోధనుడు సుశర్మ, కృతవర్మ, కేకయ రాజులతో ముప్పై అయిదు వేల రథికులతో అభిమన్యుని చుట్టుముట్టాడు. అర్జునుని కొంత దూరంలో చూసిన ధృష్టద్యుమ్నుడు తన రథమును అటు పోనిచ్చాడు. అర్జునిని దాటి ముందుకు వెళ్ళి కృపాచార్యునిపై మూడు శరములను, శల్యునిపై పది శరములను, కృతవర్మపై ఒక్క బాణమును వేసి వారి హయములను, రథములను కూల్చాడు.
*రేపు *
భారతంలో ఉండేది భూమిపై ఎక్కడైనా ఉంటుంది భారతంలో లేనిది భూమిపై ఎక్కడా లేదు
రోజూ భారతం చదవండి భగవద్ అనుగ్రహం పొందండి

కామెంట్‌లు