సామెతల ఊట -సునందమ్మ నోట: - వురిమళ్ల (భోగోజు) సునందా ఉపేందర్ రావు ఖమ్మం

 సామెత -262: ఇద్దరే మంచోళ్ళు -పుట్టనోడు, గిట్టినోడు
***
"ఏంది శెల్లే! మాంచి తీర్ బార్గ వొచ్చినవ్. ఏవఁన్న ముచ్చెటి వుందా?"
 "ఎప్పుడు ఏదోటి  శెప్పుడు, నిన్ను అడ్గుడు. ఒకోపాలి అవ్వనేమన్న యిసిగిచ్చి శికాకు శేత్తన్నా ఏంది అన్పిత్తుంది.గందుకే గియ్యాల ఊకెనే నీతాన జెర సేపు కూసోని పోదమని వొచ్చినవ్వా!"
 "శెల్లే! ఎన్నడన్న నిన్ను యిస్రుకున్ననా? కస్రుకున్ననా శెప్పు. నూగాని, ఇంకెవలన్న గని అడ్గితే నా మీన గురి మరియాద కొద్ది అడిగిర్రని సంబురంగుంటది.ఏదో గింత మాట సాయం, తోశిన మంచి శెప్పడం గదేమన్న బండలెత్తుకుంటున్నా? బర్వులెత్తుకుంటున్నా శెప్పు శెల్లే! ఇంకో త్యేప గిస్మంటి యిశారం ఎప్పుడు శెయ్యబాకు." 
 "గట్లనే అవ్వా! నీ మన్సు నాకు తెల్వదా ఏంది? అగ్గో మొన్న ఎన్కింటి ఎంకటమ్మ మూతి మూడొంకల తిప్పుకుంట గామేమో గుర్వు గీమేమొ బల్లె పోరి లెక్క ఏందో అడ్గుత నని పొద్దత్తమానం పోతదని" నాకినబడాలని లాశిగ పక్కనున్న  పార్తమ్మతో అంటుంటే శెవులార యిన్న అవ్వా! మస్తు బాదయింది.గప్పన్నించి మన్సుల ఒకటే మెరమెర. అవ్వని యిసిగిత్తున్ననా ఏందని. ఏజ్జర్గినా నీకు శెప్పకపోతే మన్సాగదవ్వా!"
"శెల్లే! ఎందుకంత యిదైతవ్. లోకం కాకుల్లాంటిదని మా అవ్వ శిన్నప్పుడు శెప్పేది. గట్ల వొర్రేటోళ్ళు వొర్రతనే ఉంటరు.గవన్ని మన్సుల పెట్టుకోవద్దు. పతోళ్ల తాన శిన్నదో పెద్దదో లోపముంటది శెల్లే! గయ్యన్ని పట్టిచ్చుకుంటే బత్కలేం ''అన్నోడు బాగనే ఉంటడు- ఇన్నోడు బాగనే ఉంటడు పడ్డోడికి పగలు రాత్రి మనియాది ఉంటది. గందుకే. గయ్యన్ని వొదిలెయ్యాలే. గవీటి వల్ల ఏవఁన్న ఫాయిదా ఉందా శెప్పు.
 " అవునవ్వా! నిజవేఁ గని నా జోలి గామెకెందుకు? గామెని ఎన్నడన్న నల్లన్ననా? తెల్లన్ననా?" ఊకున్నోళ్ళమీద బట్ట గాల్చి ఏత్తరు. ఏం మడ్సులో ఏమో? "
 " శెల్లే! పతోల్లకి ఏదోక లోపముంటదని శెప్పినగద! కొన్ని సూత్తూ పోవాలె, కొన్ని యిని వొదిలెయ్యాలె. ఇంకొన్ని మంచైతే నేర్సుకోవాలె. గంతే శెల్లే! "
 " అవ్వా!  పతోళ్లకి లోపమంంటె గీ లోకంల ఇంగ మంచోళ్ళు అన్నోల్లే  లేరా ఏంది? "
 "ఎందుకు లేరు శెల్లే ఉండ్రు. ఇద్దరే ఇద్దరు మంచోళ్ళు ఉండ్రు శెల్లే! "
" గీ పెపంచకం మొత్తాన యిద్దరే మంచోళ్ళుర్రా? ఎవలాళ్ళు అవ్వా? గాళ్ళు నిజ్జంగా దేవుల్లే . గాళ్లెవలో శెప్పవ్వా!"
" గాళ్ళా? గాళ్ళే ఒకడు పుట్టనోడు, ఇంకోడు గిట్టినోడు శెల్లే. పుట్టనోడు ఎస్మంటోడో తెల్వదు.గాడెవడికన్న నట్టం కట్టం కల్గిత్తడా లేదు గద గంద్కనే గాడు మంచోడన్న మాట."
" ఇంగ రెండోడు గిట్టినోడు.గిట్టినోడంటె తెల్సుగద సచ్చినోడు. గాడు బత్కున్నప్పుడు మంచో శెడో ఏం జేసినా సచ్చినంక జెయ్యలేడు గద.గందుకే గానంత మంచోడు లేడన్న మాట."
 " బలేగ శెప్పినవవ్వా! గీ లోకంల పుట్టినోడు ఎంత మంచోడైనా ఏదోక లోపముంటది గని,పుట్టనోడి,సచ్చినోడికి ఇంగ ఇంగేం లోపముంటది.నువ్వన్నది నిజవేఁ అవ్వా! ఇగ్గో గిస్మంటి ముచ్చెట్లు, లోకం పోబడి తెలుత్తదనే నీ తానికి వొత్తా? ఎవలనుకుంటే నాకేంది. ఏన్గు బోతుంటే కుక్కలు మొర్గవా? గది గిట్లనే అన్కుంట అవ్వా! గిట్ల మంచి శెబర ఎవలు శెప్తరు జెప్పు."
 ఓ శెల్లె బంగారం! నన్ను ముల్క శెట్టు ఎక్కియ్యకే తల్లీ! నీకు పున్నెముంటది."
 గదేం లేదవ్వ! నీ యిష్యం శెప్తె నాకె మంచిగుంటది. గింత మంచిగ శిలక్కి జెప్పినట్టు ఎవలు శెప్తరు జెప్పు. "
" గదండీ సంగతీ! ఇద్దరే మంచోళ్ళు -పుట్టనోడు గిట్టినోడు" అంటే గిదే మరి.
కామెంట్‌లు
Popular posts
నిశ్శబ్ద కోరిక : - D.రసన్య,10వ తరగతి, తెలంగాణ మోడల్ స్కూల్, ఘన్పూర్ (స్టేషన్), జనగామ (జి)
చిత్రం
అణిమ - మహిమ -------------------------------- అష్ట సిద్ధులు అనే మాట ఆనోటా ఈనోటా వింటూ ఉంటాం. ఇంతకూ ఆ అష్ట సిద్ధులు ఏంటో తెలుసా? అణిమ, మహిమ, లఘిమ, గరిమ, ప్రాప్తి, ప్రాకామ్యం, ఈశత్వం, వశిత్వం - ఈ ఎనిమిదింఃఇనీ అష్టసిద్ధులు అంటారు. ఈ ఎనిమిది సిద్ధులు సామాన్యమైనవి కావు. వేటి ప్రానాన్యం వాటివే. వాటిలో మొదటిదైన అణిమ అంటే శరీరాన్ని అతి చిన్నదిగా చేసుకోవడం. మహిమ అంటేనేమో శరీరాన్ని పెద్దదిగా చేసుకోవడం. ఈ రెండింటినీ సాధించిన వాడు ఆంజనేయుడు. సీతాన్వేషణ సమయంలో ఆంజనేయుడు ఈ రెండు సిద్ఝులనూ ఆచరించి చూపాడు. లంకలో ప్రవేశించినప్పుడు, సూర్యాస్తమయం తర్వాత పిల్లి అంత చిన్నవాడిలా మారిపోయి ఆశ్చర్యకరమైన రూపాన్ని పొందాడు. వృషదంశకమంటే పిల్లి. అలాగే, ఆకాశమంత ఎత్తుకు ఎదిగి సముద్రాన్ని దాటేటప్పుడు మహిమ సిద్ధిని ప్రదర్శించాడు. ఆంజనేయుడి బలపరాక్రమాలను తెలుసుకోవాలనుకున్న దేవతలు దక్షప్రజాపతి కుమార్తె అయిన క్రోధవశకు జన్మించిన నాగమాత సురసాదేవిని కోరారు. అంతట సురసాదేవి రాక్షస దేహం ధరించి "దేవతలు నిన్ను ఆహారంగా సమర్పించారు. నా నోటిలోకి ప్రవేశించు" అని అడుగుతుంది. అప్పుడు 80 యోజనాల భారీకాయుడైన హనుమ కోసం 90 యోజనాల నోరు తెరిచిన ఆ సురసాదేవి నోట్లోకి ప్రవేశించి, ఆమె నోరు మూసే లోపల, బొటన వేలడంతవాడై బయటకు వచ్చేశాడు. అదీ హనుమంతుడి శక్తి!! - యామిజాల జగదీశ్
చిత్రం
తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు--ఎం బిందుమాధవి
చిత్రం
మహాభారతంలో వింత పేర్లు.డా.బెల్లంకొండనాగేశ్వరరావు. (నేడు సుబ్బారావు.శంకరరావు పేరు పలువురికి ఎలాఉన్నాయో నాటి కాలంలో కూడా ఒకే పేరు పలువురికి ఉండేది.పురాణలపట్ల ఆసక్తి, అవగాహన కోరుకునేవారికొరకు ఈవ్యాసం.) మహాభారతంలో రమారమి 1655 ప్రాత్రలు మనకు కనిపిస్తాయి. 'అజుడు'దశలధమహారాజు తండ్రి.మరో'అజుడు'పాండవులతరపున యుధ్ధంచేసినరాజు అతిరథుడు.(భీష్మపర్వం)అలాగే నలుగురు 'అనువిందులు'1.దుర్యోధనుని తమ్ముడు (ఆదిపర్వం) 2.సహాదేవుని దక్షణదిగ్విజయ యాత్రలో ఓడిన రాజు(సభాపర్వం) 3.కేకేయరాజు (భీష్మపర్వం)4.కౌరవల తరపున పోరాడిన అవంతీశ్వరుడు. (ఉద్యోగపర్వం)ముగ్గురు 'అలంబసులు' 1.జటాసురునికుమారుడు. (ద్రోణపర్వం)2.బకాసురునిసోదరుడు.(ద్రోణపర్వం) 3.ఒకరాజుయుద్ధంలో 14.రోజు సాత్యకిచేతిలోమరణించారు.(ద్రోణపర్వం)ఇద్దరు 'అశ్మీకుడు'లు 1అభిమన్యునిచేతిలో మరణించినకౌరవుడు(ద్రోణపర్వం) 2.ఇక్షాకు వంశరాజు,కల్మషపాదుని కుమారుడు.(ఆదిపర్వం)ఇద్దరు 'ఉగ్రశ్రవశుడు' 1.దుర్యోధనుని తమ్ముడు(ఆదిపర్వం) 2.వ్యాసమహర్షి శిష్యుడు. (ఆదిపర్వం)ఇద్దరు 'ఉగ్రసేనుడు'1.జనమజేయునితమ్ముడు(ఆది) 2.దుర్యోధనుని తమ్ముడు.(ఆది)ఇద్దరు 'ఉగ్రాయుధుడు' 1.పాంచాలకుమారుడు (కర్ణ) 2.దుర్యోధనునితమ్ముడు. (ఆది)ఇద్దరు 'ఉత్తరలు'1దక్షునికుమార్తే (ఆది) 2.వరాటమహారాజు కుమార్తె (విరాటపర్వం)ఇద్దరు 'బుచీకకులు'1.ఔర్యునికుమారుడు. (ఆది) 2.దేవాతిథి కుమారుడు.(ఆది)ఇద్దరు 'కపిల'1.కస్యపునిభార్య. (ఆది) 2.గోవు.(ఆది)ఇద్దరు 'కర్ణులు'1.కుంతికుమారుడు. (ఆది) 2.దుర్యోధనుని తమ్ముడు.(ఆది)ముగ్గురు 'గాంధారీలు'1.కౌరవులతల్లి.(ఆది) 2.అజమీఢుని కుమార్తె(ఆది) 3.కుమారస్వామి కొలువులో దేవాంగన (అరణ్య)ముగ్గురు'గోపతి'లు 1.తపుడు అను వహ్ని పుత్రుడు. (అరణ్య)2.మయసభకు వెళ్లిన ఋషి.(సభా) 3.శిబి మనవడు.(శాంతి )ముగ్గురు 'ఘృతాచి'లు.1.అప్సరస.(ఆది)2.ఛ్యవనుని కోడలు.(ఆది)3.కశ్యపునిభార్య. (ఆది)ముగ్గురు'చంద్రసేనుడు'లు 1.శల్యుని చక్రరథికుడు.(శల్య)2.ద్రౌపతి స్వయంవరంకి వచ్చినరాజు. (ఆది)3.భీముని దిగ్విజయ యాత్రలో ఓడినరాజు. (సభా)ముగ్గురు 'చిత్రుడు'లు 1.పాంచాలరాజు.2. చేధిరాజు.(కర్ణ)ఇద్దరు 'చిత్రరథులు'1.ద్రుపద సంజాతుడు అయిన వీరకేతుని పుత్రుడు. (ద్రోణ)2.రేణుకాదేవి కి నీళ్లవద్ద కనిపించిన వాడు.3.అంగరాజు. (అరణ్య)ముగ్గురు'చిత్రవర్మ'లు1.వీరకేతుని పుత్రుడు. (ద్రోణ) 2.దుర్యోధనుడి తమ్ముడు.(ఆది)3.విరూపాక్ష అంశంతో జన్మించినవాడు. (ఆది)నలుగురు'చిత్రసేనులు'1.కర్ణుని చేతిలో మరణించిన పాండవవీరుడు. (కర్ణ)2.ఘోషూయాత్రలో దుర్యోధనుని బంధించినవాడు.(అరణ్య)3.కర్ణ తనయుడు.నకులునిచేతిలో మరణించాడు.(శల్య)4.పాండవ వీరుడుశ్రుతకర్మ చేతిలోమరణించాడు. (కర్ణ)(మిగిలినవి మరో పర్యాయం.)
చిత్రం
తెలుగు సాహిత్యం-శివ కవులు-- బెహరా ఉమామహేశ్వరరావు--సెల్ నెంబర్: 9290061336.
చిత్రం