103వ సర్గ : - ఎడ్ల లక్ష్మి -సిద్దిపేట

కౌసల్యాదేవి వసిష్టునితో  చిత్రకూటమునందలి ఆశ్రమమునకు చేరుట



వసిష్టమహర్షి దశరథమహారాజుసతులను 
తీసుకొని శ్రీరాముని దర్శించుటకై 
పర్ణశాలప్రదేశమునకు వచ్చుచుండెను.
కౌసల్యాదేవి ముఖము వాడిపోయి యుండెను.

ఓ సుమిత్రా! మన పుత్రులు రామలక్ష్మణులు 
ఎన్నడూ ఎవరికి ఏమి హాని చేయలేదు 
అట్టివారు రాజ్యము నుండి వెళ్ళగొట్టబడిరి 
అనాధలవలె కాలము గడుపు చుండిరి. 

నీ కుమారుడు లక్ష్మణుడు రాముని సేవకై
ఎన్నో కష్టములనోర్చుతూ ఈ వనమున 
ఆకలి దప్పికలకోర్చి వారికి రక్షణగా ఉంటూ
వారితో పాటు కందములను భుజిస్తున్నాడు

కౌసల్య, సుమిత్రతో గూడి వెళ్తుంటే
ఆ నది తీరమున భూమిపై దర్భలపైన 
శ్రీరాముడు పితృ కార్యములపై యుంచిన 
గారపిండి పిండములను కౌసల్య జూసి

అప్పుడు ఆమె దశరథ సతులతో ఇలా అంటుంది 
సోదరీమణులారా! ఇక్ష్వాకువంశప్రభువైన 
మహాత్ముడగు దశరథుని కొరకు ఇచ్చట 
శ్రీరాముడు సమర్పించిన పిండములివి దర్శింపుడు .

కామెంట్‌లు