పరిసరాల పరిశుభ్రత- సన తబసుం-ఎనిమిదో-తరగతి-ZPHS హవేలీ ఘనపూర్-మెదక్ జిల్లా-9948307160
  అనగనగా నర్సాపూర్ అనే ఒక పెద్ద ఊరు ఉండేది. ఆ ఊరిలో చాలా జనం నివసిస్తూ ఉండేవారు. వాళ్ల ఊరిలో ఏ పని కూడా సరిగా దొరికేది కాదు. కొంతమంది మాత్రమే పని చేస్తూ ఉండేవాళ్ళు. రాజు, రజిత దంపతులకు ఒక్కగానొక్క కూతురు కౌసల్య. ఒకరోజు వారి ఇంట్లో ఉన్న చెత్తను ఒక మూలన వేసి వెళ్తున్నారు. అలా చెత్త వేయడం చూసిన మల్లవ్వ అనే ముసలవ్వ అలా చెత్త వేస్తే పిల్లలకు, పెద్దలకు అనారోగ్యం వస్తుందని చెబుతోంది.  కానీ వాళ్లు ముసలవ్వ మాట వినకుండా ప్రతిరోజు అక్కడే చెత్త వేయసాయరు. 
              ఇంట్లో చెత్తతో పాటుగా ప్లాస్టిక్ వస్తువులు కూడా చుట్టూ పరిసరాల వద్ద వేయసాగారు. జంతువులు కూడా అక్కడే తిరుగుతూ పరిసరాలను అపరిశుభ్రం చేస్తున్నాయి. ఆప్రాంతమంతా దోమలతో నిండిపోయింది. చిన్నారి కౌసల్యతో పాటుగా పక్కన ఉన్న పిల్లలకు అందరికీ జ్వరం వచ్చింది. 
               డాక్టర్లు వైద్య పరీక్షలు చేసి డెంగ్యూ జ్వరం వచ్చింది దోమల వల్ల అని చెప్పాడు. అందరూ ఆలోచనలో పడతారు. పిల్లల వైద్యానికి చాలా డబ్బులు ఖర్చు అవుతాయి. హాస్పటల్ నుంచి పిల్లలు ఇంటికి వచ్చేలోగా ఇంటి పరిసరాలలో చెత్త లేకుండా శుభ్రం చేయసాగారు. ముసలవ్వ మాట వినుంటే ఇంత సమస్య వచ్చేది కాదని తమ తప్పును తెలుసుకొని పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోసాగారు.
-----------------------------------------------

నీతి: ఎవరు మంచి మాట చెప్పినా వినాలి. పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలి
.




            
కామెంట్‌లు