మొక్కల విలువ_;- పుల్లగూర్ల సాయికృప, -ఏడో తరగతి,జి.ప.ఉ.పా.ఘనపురం, -తొగుట మండలం, సిద్దిపేట జిల్లా.
   అనగనగా ఒక చిన్న పల్లెటూరు. ఆ పల్లెటూరులో లహరి, సంయుక్త అనే ఇద్దరు స్నేహితులు ఉండేవారు. సంయుక్త వాళ్ళ అమ్మానాన్నల పేర్లు సురేష్ సుశీల. లహరి వాళ్ళ అమ్మానాన్నల పేర్లు వరలక్ష్మి వంశీ. వీళ్ళ తల్లిదండ్రులు కూడా మంచి స్నేహితులే. వీళ్ళ  నాన్నలు ఒకే ఆఫీస్ లో పనిచేసేవారు.
         సంయుక్త లహరికి మొక్కలు అంటే ప్రాణం.లహరి,  సంయుక్త వాళ్లకు ఉన్న కొద్దిపాటి స్థలంలో రోజు ఏదో ఒక మొక్క నాటేవారు. నాటిన మొక్కలను పెంచి పెద్ద చేసేవారు. మొక్కలను ప్రాణంలా చూసుకునేవారు. కొన్ని పూల మొక్కలు పండ్ల మొక్కలు నాటారు. ఆ పూల మొక్కలు పండ్ల మొక్కలు పెద్దవై పూలు పూయడం, పండ్లు కాయడం మొదలయ్యాయి. అలా కొన్ని చెట్లు కాస్త తోట గా మారాయి.వాళ్ల తల్లిదండ్రులు ఎందుకమ్మా సమయం వృధా చేసుకుంటారు వాటి వల్ల మనకు ఏమొస్తుంది అనేవారు. అయినా వాళ్ళు ప్రయత్నాన్ని ఆపలేదు. ఈ చెట్లు మనల్ని ఎప్పటికైనా రక్షిస్తాయి అనేవారు...
      కొన్ని రోజుల తరువాత వీళ్ళ తల్లిదండ్రులు పనిచేసే ఆఫీస్ మూతపడింది. డబ్బులకు కష్టాలు మొదలయ్యాయి. అప్పులు చేయాల్సి వచ్చింది. వాళ్ల నాన్నలు ఒక దగ్గర కూర్చొని ఎలా అని బాధపడుతున్నారు. అప్పుడు లహరి మరియు సంయుక్త ఈ విషయం తెలుసుకొని వాళ్ల దగ్గరికి వెళ్లి  "నాన్న మీరు బాధపడకండి మేము కొన్ని చెట్లను పెంచుతున్నాం వాటికి పూలు, పండ్లు చాలా ఉన్నాయి. ఆ పూలను పండ్లను అమ్మి మనం సమస్యను తీర్చుకుందాం అని అనగానే  వాళ్ల తల్లిదండ్రులు సంతోషపడి పూలు పండ్లు మార్కెట్లో అమ్మి వాళ్ల కష్టాలను తీర్చుకున్నారు. సంయుక్త లహరి లను వాళ్ల తల్లిదండ్రులు చాలా మెచ్చుకొని వాళ్లు కూడా మొక్కలను పెంచడం ప్రారంభించి,వాటి ద్వారా జీవనోపాధి పొందుతున్నారు...
నీతి:-  "వృక్షో రక్షతి రక్షితః"
    
కామెంట్‌లు
Popular posts
నిశ్శబ్ద కోరిక : - D.రసన్య,10వ తరగతి, తెలంగాణ మోడల్ స్కూల్, ఘన్పూర్ (స్టేషన్), జనగామ (జి)
చిత్రం
తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు--ఎం బిందుమాధవి
చిత్రం
ఉరుదూ తెలుగు సాహిత్య వారధి డా. సామల సదాశివ; రామ్మోహన్ రావు తుమ్మూరి
చిత్రం
తెలుగు సాహిత్యం-శివ కవులు-- బెహరా ఉమామహేశ్వరరావు--సెల్ నెంబర్: 9290061336.
చిత్రం
మహాభారతంలో వింత పేర్లు.డా.బెల్లంకొండనాగేశ్వరరావు. (నేడు సుబ్బారావు.శంకరరావు పేరు పలువురికి ఎలాఉన్నాయో నాటి కాలంలో కూడా ఒకే పేరు పలువురికి ఉండేది.పురాణలపట్ల ఆసక్తి, అవగాహన కోరుకునేవారికొరకు ఈవ్యాసం.) మహాభారతంలో రమారమి 1655 ప్రాత్రలు మనకు కనిపిస్తాయి. 'అజుడు'దశలధమహారాజు తండ్రి.మరో'అజుడు'పాండవులతరపున యుధ్ధంచేసినరాజు అతిరథుడు.(భీష్మపర్వం)అలాగే నలుగురు 'అనువిందులు'1.దుర్యోధనుని తమ్ముడు (ఆదిపర్వం) 2.సహాదేవుని దక్షణదిగ్విజయ యాత్రలో ఓడిన రాజు(సభాపర్వం) 3.కేకేయరాజు (భీష్మపర్వం)4.కౌరవల తరపున పోరాడిన అవంతీశ్వరుడు. (ఉద్యోగపర్వం)ముగ్గురు 'అలంబసులు' 1.జటాసురునికుమారుడు. (ద్రోణపర్వం)2.బకాసురునిసోదరుడు.(ద్రోణపర్వం) 3.ఒకరాజుయుద్ధంలో 14.రోజు సాత్యకిచేతిలోమరణించారు.(ద్రోణపర్వం)ఇద్దరు 'అశ్మీకుడు'లు 1అభిమన్యునిచేతిలో మరణించినకౌరవుడు(ద్రోణపర్వం) 2.ఇక్షాకు వంశరాజు,కల్మషపాదుని కుమారుడు.(ఆదిపర్వం)ఇద్దరు 'ఉగ్రశ్రవశుడు' 1.దుర్యోధనుని తమ్ముడు(ఆదిపర్వం) 2.వ్యాసమహర్షి శిష్యుడు. (ఆదిపర్వం)ఇద్దరు 'ఉగ్రసేనుడు'1.జనమజేయునితమ్ముడు(ఆది) 2.దుర్యోధనుని తమ్ముడు.(ఆది)ఇద్దరు 'ఉగ్రాయుధుడు' 1.పాంచాలకుమారుడు (కర్ణ) 2.దుర్యోధనునితమ్ముడు. (ఆది)ఇద్దరు 'ఉత్తరలు'1దక్షునికుమార్తే (ఆది) 2.వరాటమహారాజు కుమార్తె (విరాటపర్వం)ఇద్దరు 'బుచీకకులు'1.ఔర్యునికుమారుడు. (ఆది) 2.దేవాతిథి కుమారుడు.(ఆది)ఇద్దరు 'కపిల'1.కస్యపునిభార్య. (ఆది) 2.గోవు.(ఆది)ఇద్దరు 'కర్ణులు'1.కుంతికుమారుడు. (ఆది) 2.దుర్యోధనుని తమ్ముడు.(ఆది)ముగ్గురు 'గాంధారీలు'1.కౌరవులతల్లి.(ఆది) 2.అజమీఢుని కుమార్తె(ఆది) 3.కుమారస్వామి కొలువులో దేవాంగన (అరణ్య)ముగ్గురు'గోపతి'లు 1.తపుడు అను వహ్ని పుత్రుడు. (అరణ్య)2.మయసభకు వెళ్లిన ఋషి.(సభా) 3.శిబి మనవడు.(శాంతి )ముగ్గురు 'ఘృతాచి'లు.1.అప్సరస.(ఆది)2.ఛ్యవనుని కోడలు.(ఆది)3.కశ్యపునిభార్య. (ఆది)ముగ్గురు'చంద్రసేనుడు'లు 1.శల్యుని చక్రరథికుడు.(శల్య)2.ద్రౌపతి స్వయంవరంకి వచ్చినరాజు. (ఆది)3.భీముని దిగ్విజయ యాత్రలో ఓడినరాజు. (సభా)ముగ్గురు 'చిత్రుడు'లు 1.పాంచాలరాజు.2. చేధిరాజు.(కర్ణ)ఇద్దరు 'చిత్రరథులు'1.ద్రుపద సంజాతుడు అయిన వీరకేతుని పుత్రుడు. (ద్రోణ)2.రేణుకాదేవి కి నీళ్లవద్ద కనిపించిన వాడు.3.అంగరాజు. (అరణ్య)ముగ్గురు'చిత్రవర్మ'లు1.వీరకేతుని పుత్రుడు. (ద్రోణ) 2.దుర్యోధనుడి తమ్ముడు.(ఆది)3.విరూపాక్ష అంశంతో జన్మించినవాడు. (ఆది)నలుగురు'చిత్రసేనులు'1.కర్ణుని చేతిలో మరణించిన పాండవవీరుడు. (కర్ణ)2.ఘోషూయాత్రలో దుర్యోధనుని బంధించినవాడు.(అరణ్య)3.కర్ణ తనయుడు.నకులునిచేతిలో మరణించాడు.(శల్య)4.పాండవ వీరుడుశ్రుతకర్మ చేతిలోమరణించాడు. (కర్ణ)(మిగిలినవి మరో పర్యాయం.)
చిత్రం