పోక్సో చట్టంతో బాల్యానికి భరోసా : -- పునశ్చరణలో నల్లాని రాజేశ్వరి వెల్లడి కేంద్ర ప్రభుత్వం పోక్సో చట్టంలో తగిన మార్పులు తేవడంతో బాల్యానికి మరింత భరోసా దక్కిందని కేంద్ర ప్రభుత్వ "రాజ్యమహిళా సమ్మాన్ " అవార్డు గ్రహీత, బాలల సంక్షేమ సమితి (సిడబ్ల్యూసి) ఛైర్ పర్సన్ నల్లాని రాజేశ్వరి అన్నారు. బాధితులను అన్నివిధాలా ఆదుకునేందుకు తక్షణమే ప్రభుత్వం, పౌరసంస్థలు సమిష్టిగా స్పందిస్తున్నాయన్నారు. ఏపీ ప్రభుత్వ బాలల సంక్షేమం, సంస్కరణ సేవలు, వీధిబాలల సంక్షేమ శాఖ సహకారంతో ఆన్ లైన్ శిక్షణ, పునశ్చరణ తరగతులను బుధవారం సాయంత్రం నిర్వహించారు. నోబెల్ శాంతి బహుమతి గ్రహీత కైలాస్ సత్యార్థి స్థాపించిన బచ్ పన్ బచావో ఆందోళన్ (బిబిఏ) సంస్థ ప్రతినిధులు ప్రత్యేకంగా పోక్సో చట్టం గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో అనంతపురం జిల్లా నుంచి సిడబ్ల్యూసి ఛైర్ పర్సన్ నల్లాని రాజేశ్వరి, డిసిపిఓ డా.దాసరి సుబ్రమణ్యం, తదితరులు ఆన్ లైన్ ద్వారా హాజరై పలు అంశాలపై చర్చించారు. క్షేత్రస్థాయిలో ఎదురవుతున్న సమస్యలను లేవనెత్తారు. బిబిఏ శిక్షణ, అడ్వకసీ సంచాలకులు జ్యోతిమాథుర్ పోక్సో చట్టంలోని కీలక అంశాలను సుదీర్ఘంగా వివరించారు. బిబిఏ కార్యక్రమ సమన్వయకర్త వరుణ్ , ఏపీ ప్రభుత్వ బాలల సంరక్షణ విభాగ సమన్వయకర్త జి. తిరుపతిరావులు చక్కటి అనుసంధానం చేశారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి సఖి కేంద్రం బాధ్యులు కూడా పాల్గొన్నారు.ఈ సందర్భంగా నల్లాని రాజేశ్వరి మాట్లాడుతూ, లింగసమానత్వం కోసం ప్రతిఒక్కరూ పాటుపడాలని కోరారు. పిల్లలపై అత్యాచారం, లైంగిక వేధింపులకు పాల్పడితే శిక్షలు కఠినంగా ఉంటాయన్నారు. బాలల హక్కుల పరిరక్షణ సామాజిక బాధ్యత అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చట్టాల రూపకల్పన, సవరణ, సంస్కరణల ద్వారా బాలలకు భరోసా కల్పిస్తున్నాయన్నారు. చట్టాలను సక్రమంగా సత్వరమే అమలుచేస్తేనే బాధితులకు తగిన న్యాయం జరుగుతుందన్నారు. 12 ఏళ్లలోపు పిల్లలపై అత్యాచారానికి పాల్పడిన నిందితులకు ఉరిశిక్ష విధించేలా చట్టాన్ని సవరించారని తెలిపారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు చిన్నారుల స్నేహపూర్వక న్యాయస్థానాలు కూడా ఏర్పాటయ్యాయని వివరించారు. బాలల భద్రత కోసం ప్రభుత్వంతో పాటు పౌరసంస్థలు, సామాజిక కార్యకర్తలు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు సమిష్టిగా పాటుపడాలని నల్లాని రాజేశ్వరి పిలుపునిచ్చారు.


కామెంట్‌లు
Popular posts
తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు--ఎం బిందుమాధవి
చిత్రం
వినదగు నెవ్వరు చెప్పిన: --ఎం బిందుమాధవి
చిత్రం
కులవృత్తులు మరువకురా గువ్వలచెన్న వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండల్ గొటిక ఖుర్డు ప్రాథమిక పాఠశాలలో కుల వృత్తుల పై విద్యార్థులు వినూత్న ప్రదర్శన విద్యార్థుల వినూత్న ప్రదర్శన అభినందించిన బషీరాబాద్ వైస్ ఎంపీపీ జడల అన్నపూర్ణ వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల గోటిక ఖుర్దు స్కూల్లో గ్రామంలో ని కుల వృత్తులు పై విద్యార్థులు పాఠశాలల్లో వినూత్న ప్రదర్శన నిర్వహించారు నేటి సమాజంలో ప్రపంచీకరణ , ఆధునికత పేరుతో కులవృత్తులకు ఆదరణ కరువు అయినవీ పల్లె నుండి పట్నంకు బతుకుదెరువు కోసం కన్నతల్లిని ఉన్న ఊరిని వదిలి కుల వృత్తిని వదిలి పట్నంలో వెళ్లి కూలీ గా పనిచేస్తున్నారు కావున ఆనాటి నుండి నేటి వరకు గ్రామంలో అనేక కుల వృత్తుల ప్రాధాన్యత ఉంది సమాజంలో కుమ్మరి కమ్మరి మేతరి చాకలి . వడ్రంగి. రైతులు .పోస్ట్ మాన్ కురువ. లాయర్. డాక్టరు మొదలైన వృత్తుల ప్రతిబింబించే విధంగా కళ్లకు కట్టిన విధంగా పాఠశాల ఆవరణంలో విద్యార్థులు చక్కగా ప్రదర్శించారు పాఠశాల ప్రధానోపాధ్యాయులు మురళి హరినాథ్ విద్యార్థుల చేత 26 వేషధారణ వేసి విద్యార్థుల నైపుణ్యాన్ని వెలికి తీయడం కోసం మరుగునపడిన కులవృత్తులను గుర్తు చేసుకోవడం కోసం చక్క గా ప్రదర్శించడం జరిగింది విద్యార్థులలో చిన్నప్పటినుండి అన్ని అంశాలపై అవగాహన కలిగినట్లయితే భవిష్యత్తులో వారికి నిత్య జీవితంలో ఎంతో ఉపయోగపడుతుంది ప్రభుత్వ పాఠశాలలు మరింత బలోపేతం చేయడం కోసం విద్యార్థులను సర్వతోముఖాభివృద్ధి చేయడం కోసం కృషి చేస్తున్నానని ప్రధానోపాధ్యాయుడు మురళి హరినాథ్ చెప్పారు విద్యార్థులకు ఒత్తిడి లేకుండా జాయ్ full learning నేర్పించాలని సంకల్పించడం జరిగిందని అన్నారు ఈ కార్యక్రమంలో లో గ్రామ పెద్దలు శ్రీనివాస్ రెడ్డి ఉపాధ్యాయులు జయ శ్రీ .నవనీత. విటల్ గౌడ్. చంద్రయ్య. సత్యం. ఆశన్నప్పా జ్యోతి. లక్ష్మీ. మరియు విద్యార్థులు పాల్గొన్నారు
చిత్రం
రామాయణం‌ నుండి108 ప్రశ్నలు –జవాబులు!:----సుజాత.పి.వి.ఎల్.
చిత్రం
పూర్వ విద్యార్థుల సమ్మేళనం అపురూపం::-యాడవరo చంద్రకాంత్ గౌడ్ తెలుగు పండిట్- సిద్దిపేట-9441762105
చిత్రం