ముల్లా కథలు - 12 న్యాయం లేని వాటా -------------------------- ముల్లా, అతని మిత్రుడు కలిసి ఓ కొబ్బరి మొక్కను కొనుగోలు చేసి పెంచనారంభించారు. ఇద్దరి మధ్య ఈ కొబ్బరి చెట్టుకు సంబంధించి ఓ ఒప్పందంకూడా కుదిరింది. కొంత కాలానికి కొబ్బరి చెట్టులో కాయలొచ్చాయి. "మన మధ్య కుదిరిన ఒప్పందం మేరకు మొదటి సగం వాటా తీసుకునే హక్కు నాకుంది. మిగిలిన సగం వాటా నీది" అన్నాడు మిత్రుడు. "అవును. అలాగే" అన్నాడు ముల్లా. "చెట్టు సగభాగం నుంచి ఆకులూ కాయలూ వరకూ నా వాటా. మిగిలిన సగం నుంచి భూమిలో పాతుకుపోయిన వేరు వరకూ నీ వాటా. అర్థమైందిగా. కనుక కాయలకోసం గొడవపడకు" అన్నాడు మిత్రుడు. మిత్రుడి మాటలన్నీ విన్న ముల్లా మౌనందాల్చాడు. కాయలు విరగ్గాసాయి. ఆ కాయలు కోయడం కోసం మిత్రుడు చెట్టెక్కాడు. కాస్సేపటికి గొడ్డలితో వచ్చిన ముల్లా ఆ చెట్టుని నరకడం మొదలుపెట్టాడు. చెట్టుపైకి చేరిన మిత్రుడు "ముల్లా! నీకేమన్నా పిచ్చా? ఎందుకని చెట్టు కింది భాగాన్ని నరుకుతున్నావు?" అడిగాడు చెట్టుపై నుంచి. "అవును. చెట్టు కింది భాగం నాదేగా. నా ఇష్టం వచ్చినట్దు నేను చేసుకుంటాను. అది అడ్డుకోవడానికి నీకే హక్కూ లేదు" అన్నాడు ముల్లా పెద్దపెద్దగా అరుస్తూ. అప్పటికి గానీ మిత్రుడి తీరులో మార్పు రాలేదు. సరే. కాచిన కాయల్లో ఇద్దరం చెరిసగం తీసుకుందాం అని రాజీకొచ్చాడు మిత్రుడు. - యామిజాల జగదీశ్


కామెంట్‌లు
Popular posts
తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు--ఎం బిందుమాధవి
చిత్రం
వినదగు నెవ్వరు చెప్పిన: --ఎం బిందుమాధవి
చిత్రం
కులవృత్తులు మరువకురా గువ్వలచెన్న వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండల్ గొటిక ఖుర్డు ప్రాథమిక పాఠశాలలో కుల వృత్తుల పై విద్యార్థులు వినూత్న ప్రదర్శన విద్యార్థుల వినూత్న ప్రదర్శన అభినందించిన బషీరాబాద్ వైస్ ఎంపీపీ జడల అన్నపూర్ణ వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల గోటిక ఖుర్దు స్కూల్లో గ్రామంలో ని కుల వృత్తులు పై విద్యార్థులు పాఠశాలల్లో వినూత్న ప్రదర్శన నిర్వహించారు నేటి సమాజంలో ప్రపంచీకరణ , ఆధునికత పేరుతో కులవృత్తులకు ఆదరణ కరువు అయినవీ పల్లె నుండి పట్నంకు బతుకుదెరువు కోసం కన్నతల్లిని ఉన్న ఊరిని వదిలి కుల వృత్తిని వదిలి పట్నంలో వెళ్లి కూలీ గా పనిచేస్తున్నారు కావున ఆనాటి నుండి నేటి వరకు గ్రామంలో అనేక కుల వృత్తుల ప్రాధాన్యత ఉంది సమాజంలో కుమ్మరి కమ్మరి మేతరి చాకలి . వడ్రంగి. రైతులు .పోస్ట్ మాన్ కురువ. లాయర్. డాక్టరు మొదలైన వృత్తుల ప్రతిబింబించే విధంగా కళ్లకు కట్టిన విధంగా పాఠశాల ఆవరణంలో విద్యార్థులు చక్కగా ప్రదర్శించారు పాఠశాల ప్రధానోపాధ్యాయులు మురళి హరినాథ్ విద్యార్థుల చేత 26 వేషధారణ వేసి విద్యార్థుల నైపుణ్యాన్ని వెలికి తీయడం కోసం మరుగునపడిన కులవృత్తులను గుర్తు చేసుకోవడం కోసం చక్క గా ప్రదర్శించడం జరిగింది విద్యార్థులలో చిన్నప్పటినుండి అన్ని అంశాలపై అవగాహన కలిగినట్లయితే భవిష్యత్తులో వారికి నిత్య జీవితంలో ఎంతో ఉపయోగపడుతుంది ప్రభుత్వ పాఠశాలలు మరింత బలోపేతం చేయడం కోసం విద్యార్థులను సర్వతోముఖాభివృద్ధి చేయడం కోసం కృషి చేస్తున్నానని ప్రధానోపాధ్యాయుడు మురళి హరినాథ్ చెప్పారు విద్యార్థులకు ఒత్తిడి లేకుండా జాయ్ full learning నేర్పించాలని సంకల్పించడం జరిగిందని అన్నారు ఈ కార్యక్రమంలో లో గ్రామ పెద్దలు శ్రీనివాస్ రెడ్డి ఉపాధ్యాయులు జయ శ్రీ .నవనీత. విటల్ గౌడ్. చంద్రయ్య. సత్యం. ఆశన్నప్పా జ్యోతి. లక్ష్మీ. మరియు విద్యార్థులు పాల్గొన్నారు
చిత్రం
రామాయణం‌ నుండి108 ప్రశ్నలు –జవాబులు!:----సుజాత.పి.వి.ఎల్.
చిత్రం
పూర్వ విద్యార్థుల సమ్మేళనం అపురూపం::-యాడవరo చంద్రకాంత్ గౌడ్ తెలుగు పండిట్- సిద్దిపేట-9441762105
చిత్రం