రుక్మి గొప్పలు: రచన :లిఖిత్ కుమార్ గోదా:-ఇది మహాభారతంలోని కథ. భీష్మక మహారాజు కుమారుడు రుక్మి. అతడు మహా పరాక్రమవంతుడు. శ్రీకృష్ణుడి భార్య అయిన రుక్మిణి సోదరుడు. ఇంద్రుడికి ప్రాణస్నేహితుడు.గంధమాదన పర్వతం మీద ఉన్న ధ్రువుడు అనే కింపురుషుడి అనుగ్రహం వల్ల లోకంలో శ్రేష్టమైన మూడు ధనస్సు లో ఒకటైన "విజయం" అనే దివ్య ధనుస్సును సంపాదించాడు.కురు పాండవ సంగ్రామం కురుక్షేత్రం జరగబోతుందని తెలిసి ఒక అక్షౌహిణి సేనతో పాండు కుమారుల దగ్గరికి వెళ్ళాడు భీష్మక పుత్రుడు. పాండవులు అతన్ని సాదరంగా ఆహ్వానించి గౌరవించారు. సకల సౌకర్యాలు కల్పించారు . అతిధి సత్కారాలు అందుకున్నాక రుక్మి, పాండవులు ఇతర అతిథులు వింటూ ఉండంగా పార్ధున్ని పిలిచి "అర్జునా! రాబోయే కురుక్షేత్ర సంగ్రామం గురించి దిగులు చెందుతున్నారు అనుకుంటాను. నీకు భయం వద్దు. ఎందుకంటే "విజయధరుడు" అతి పరాక్రమవంతుడైన రుక్మి నీకు అండగా ఉంటాడు. నా అండదండల వల్ల నీకు కచ్చితంగా విజయం సిద్ధిస్తుంది.నన్ను మించిన పరాక్రమవంతుడు ఈ మూడు లోకాలలో లేడు కదా. పైగా నా దగ్గర తేజోమయమైన ధనస్సు ఉంది.దానితో ద్రోణ, భీష్మ, కృపాచార్య కౌరవులను క్షణాల్లో మట్టి కరిపిస్తాను. హస్తినాపుర రాజ్యాన్ని నీ వశం చేస్తాను. సరేనా!"అని అన్నాడు గొప్పలు చెప్పుకుంటూ. అర్జునుడు చిరునవ్వు నవ్వి "భీష్మక పుత్ర, విజయ ధనస్సు ధార, రుక్మి! మాకు సహాయం చేస్తానని ముందుకు వచ్చినందుకు నీకు మా ధన్యవాదాలు. అయితే మా బావ అయిన ద్వారకాధిపతి శ్రీకృష్ణుడు మాకు ఎల్లవేళలా సాయం గా ఉంటాడు అన్న సంగతి మాత్రం మర్చిపోకు. ఆ పరమాత్ముడి సాయం మా చెంత ఉంటే మాకు ఇంకెవరి అండదండలు అవసరం లేదు. పైగా నా చేతిలో గాండీవం ఉంది రుక్మి.సాక్షాత్తూ స్వర్గాధిపతియైన దేవేంద్రుని వజ్రాయుధం ధరించి వచ్చిన కూడా నేను భయపడను."అని బదులిచ్చాడు పార్ధుడు రుక్మితో. ఈ మాటలు విన్న రుక్మికి కోపం కట్టలు తెంచుకుంది.ఆ వెంటనే పాండవులు వద్ద కోపంగానే సెలవు తీసుకుని సుయోధనుడి దగ్గరికి వెళ్ళాడు."దుర్యోధనా!రాబోయే కురు పాండవ యుద్ధం లో నేను మీ పక్షాన ఉండి యుద్ధం చేస్తాను. నేను అతి పరాక్రమవంతుడును, విజయదారుడను, ఖచ్చితంగా మీ విషయానికి తోడు పడతాను. మనవిరువురం చేయి చేయి కలిపి పాండవుల పొగరును అణుద్దాం. నా చాపంతో వాళ్ళందర్నీ యమపురికి చేరుస్తాను. నా ప్రతాపం చూపిస్తాను"అని పలికాడు. అయితే సుయోధనుడు కూడా అభిమానం కలవాడు. అతడు కూడా "రుక్మి! నీ సహాయం నాకు అక్కర్లేదు" అని సున్నితంగా పలికాడు. రుక్మి సిగ్గుపడ్డాడు.దుర్యోధనుడు కూడా తిరస్కరించే వచ్చిన దారిని తన నగరానికి తిరిగి వెళ్ళాడు. కనుక నాతోటి మిత్రులారా! రుక్మి కథ వలన మనం నేర్చుకోవలసిన నీతి ఏమిటంటే తన గురించి తాను గొప్పలు చెప్పుకోవడం సరికాదు. తన శక్తియుక్తుల్ని అధికంగా ఊహించుకోవడం, ఎదుటివారి తెలివితేటల్ని, శక్తిని తక్కువగా అంచనా వేయడం ఎవరికీ మంచిది కాదు. అది మనల్ని నలుగురిలో నవ్వుల పాలు చేస్తుంది. రుక్మిణికి తన గురించి తాను గొప్పగా చెప్పుకోవడం అలవాటు మొదటి నుంచీ ఉంది. అందుకే చాలా సార్లు పరాభవాలు పొందాడు. రచన: లిఖిత్ కుమార్ గోదా(చిన్ని), ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం, బనిగండ్లపాడు గ్రామం, ఎర్రుపాలెం మండలం, ఖమ్మం జిల్లా.
Popular posts
తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు--ఎం బిందుమాధవి
• T. VEDANTA SURY
చిత్రం :సిహెచ్.పూజ-8వ.తరగతి-తెలంగాణ ఆదర్శ పాఠశాల-లింగాలఘణపురం మండలం-జనగామ జిల్లా
• T. VEDANTA SURY

బాల కథల పోటీ -2025
• T. VEDANTA SURY

చిత్రం : -బి.ఈశ్వరి,-9వ.తరగతి-తెలంగాణ ఆదర్శ పాఠశాల-లింగాల గణపురం మండలం-జనగామ జిల్లా
• T. VEDANTA SURY

పేదవాడు!!? - డా ప్రతాప్ కౌటిళ్యా.
• T. VEDANTA SURY

Publisher Information
Contact
molakanews@gmail.com
9848992841
H.NO. 1-9-319/1/1/G2, VIJAYADURGA RESIDENCY VIDYANAGAR,DIST-HYDERABAD-44
About
This is the children's page
Share this page
Email
Message
Facebook
Whatsapp
Twitter
LinkedIn
addComments
కామెంట్ను పోస్ట్ చేయండి