రుక్మి గొప్పలు: రచన :లిఖిత్ కుమార్ గోదా:-ఇది మహాభారతంలోని కథ. భీష్మక మహారాజు కుమారుడు రుక్మి. అతడు మహా పరాక్రమవంతుడు. శ్రీకృష్ణుడి భార్య అయిన రుక్మిణి సోదరుడు. ఇంద్రుడికి ప్రాణస్నేహితుడు.గంధమాదన పర్వతం మీద ఉన్న ధ్రువుడు అనే కింపురుషుడి అనుగ్రహం వల్ల లోకంలో శ్రేష్టమైన మూడు ధనస్సు లో ఒకటైన "విజయం" అనే దివ్య ధనుస్సును సంపాదించాడు.కురు పాండవ సంగ్రామం కురుక్షేత్రం జరగబోతుందని తెలిసి ఒక అక్షౌహిణి సేనతో పాండు కుమారుల దగ్గరికి వెళ్ళాడు భీష్మక పుత్రుడు. పాండవులు అతన్ని సాదరంగా ఆహ్వానించి గౌరవించారు. సకల సౌకర్యాలు కల్పించారు . అతిధి సత్కారాలు అందుకున్నాక రుక్మి, పాండవులు ఇతర అతిథులు వింటూ ఉండంగా పార్ధున్ని పిలిచి "అర్జునా! రాబోయే కురుక్షేత్ర సంగ్రామం గురించి దిగులు చెందుతున్నారు అనుకుంటాను. నీకు భయం వద్దు. ఎందుకంటే "విజయధరుడు" అతి పరాక్రమవంతుడైన రుక్మి నీకు అండగా ఉంటాడు. నా అండదండల వల్ల నీకు కచ్చితంగా విజయం సిద్ధిస్తుంది.నన్ను మించిన పరాక్రమవంతుడు ఈ మూడు లోకాలలో లేడు కదా. పైగా నా దగ్గర తేజోమయమైన ధనస్సు ఉంది.దానితో ద్రోణ, భీష్మ, కృపాచార్య కౌరవులను క్షణాల్లో మట్టి కరిపిస్తాను. హస్తినాపుర రాజ్యాన్ని నీ వశం చేస్తాను. సరేనా!"అని అన్నాడు గొప్పలు చెప్పుకుంటూ. అర్జునుడు చిరునవ్వు నవ్వి "భీష్మక పుత్ర, విజయ ధనస్సు ధార, రుక్మి! మాకు సహాయం చేస్తానని ముందుకు వచ్చినందుకు నీకు మా ధన్యవాదాలు. అయితే మా బావ అయిన ద్వారకాధిపతి శ్రీకృష్ణుడు మాకు ఎల్లవేళలా సాయం గా ఉంటాడు అన్న సంగతి మాత్రం మర్చిపోకు. ఆ పరమాత్ముడి సాయం మా చెంత ఉంటే మాకు ఇంకెవరి అండదండలు అవసరం లేదు. పైగా నా చేతిలో గాండీవం ఉంది రుక్మి.సాక్షాత్తూ స్వర్గాధిపతియైన దేవేంద్రుని వజ్రాయుధం ధరించి వచ్చిన కూడా నేను భయపడను."అని బదులిచ్చాడు పార్ధుడు రుక్మితో. ఈ మాటలు విన్న రుక్మికి కోపం కట్టలు తెంచుకుంది.ఆ వెంటనే పాండవులు వద్ద కోపంగానే సెలవు తీసుకుని సుయోధనుడి దగ్గరికి వెళ్ళాడు."దుర్యోధనా!రాబోయే కురు పాండవ యుద్ధం లో నేను మీ పక్షాన ఉండి యుద్ధం చేస్తాను. నేను అతి పరాక్రమవంతుడును, విజయదారుడను, ఖచ్చితంగా మీ విషయానికి తోడు పడతాను. మనవిరువురం చేయి చేయి కలిపి పాండవుల పొగరును అణుద్దాం. నా చాపంతో వాళ్ళందర్నీ యమపురికి చేరుస్తాను. నా ప్రతాపం చూపిస్తాను"అని పలికాడు. అయితే సుయోధనుడు కూడా అభిమానం కలవాడు. అతడు కూడా "రుక్మి! నీ సహాయం నాకు అక్కర్లేదు" అని సున్నితంగా పలికాడు. రుక్మి సిగ్గుపడ్డాడు.దుర్యోధనుడు కూడా తిరస్కరించే వచ్చిన దారిని తన నగరానికి తిరిగి వెళ్ళాడు. కనుక నాతోటి మిత్రులారా! రుక్మి కథ వలన మనం నేర్చుకోవలసిన నీతి ఏమిటంటే తన గురించి తాను గొప్పలు చెప్పుకోవడం సరికాదు. తన శక్తియుక్తుల్ని అధికంగా ఊహించుకోవడం, ఎదుటివారి తెలివితేటల్ని, శక్తిని తక్కువగా అంచనా వేయడం ఎవరికీ మంచిది కాదు. అది మనల్ని నలుగురిలో నవ్వుల పాలు చేస్తుంది. రుక్మిణికి తన గురించి తాను గొప్పగా చెప్పుకోవడం అలవాటు మొదటి నుంచీ ఉంది. అందుకే చాలా సార్లు పరాభవాలు పొందాడు. రచన: లిఖిత్ కుమార్ గోదా(చిన్ని), ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం, బనిగండ్లపాడు గ్రామం, ఎర్రుపాలెం మండలం, ఖమ్మం జిల్లా.


కామెంట్‌లు
Popular posts
తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు--ఎం బిందుమాధవి
చిత్రం
రామాయణం‌ నుండి108 ప్రశ్నలు –జవాబులు!:----సుజాత.పి.వి.ఎల్.
చిత్రం
వినదగు నెవ్వరు చెప్పిన: --ఎం బిందుమాధవి
చిత్రం
పూర్వ విద్యార్థుల సమ్మేళనం అపురూపం::-యాడవరo చంద్రకాంత్ గౌడ్ తెలుగు పండిట్- సిద్దిపేట-9441762105
చిత్రం
కులవృత్తులు మరువకురా గువ్వలచెన్న వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండల్ గొటిక ఖుర్డు ప్రాథమిక పాఠశాలలో కుల వృత్తుల పై విద్యార్థులు వినూత్న ప్రదర్శన విద్యార్థుల వినూత్న ప్రదర్శన అభినందించిన బషీరాబాద్ వైస్ ఎంపీపీ జడల అన్నపూర్ణ వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల గోటిక ఖుర్దు స్కూల్లో గ్రామంలో ని కుల వృత్తులు పై విద్యార్థులు పాఠశాలల్లో వినూత్న ప్రదర్శన నిర్వహించారు నేటి సమాజంలో ప్రపంచీకరణ , ఆధునికత పేరుతో కులవృత్తులకు ఆదరణ కరువు అయినవీ పల్లె నుండి పట్నంకు బతుకుదెరువు కోసం కన్నతల్లిని ఉన్న ఊరిని వదిలి కుల వృత్తిని వదిలి పట్నంలో వెళ్లి కూలీ గా పనిచేస్తున్నారు కావున ఆనాటి నుండి నేటి వరకు గ్రామంలో అనేక కుల వృత్తుల ప్రాధాన్యత ఉంది సమాజంలో కుమ్మరి కమ్మరి మేతరి చాకలి . వడ్రంగి. రైతులు .పోస్ట్ మాన్ కురువ. లాయర్. డాక్టరు మొదలైన వృత్తుల ప్రతిబింబించే విధంగా కళ్లకు కట్టిన విధంగా పాఠశాల ఆవరణంలో విద్యార్థులు చక్కగా ప్రదర్శించారు పాఠశాల ప్రధానోపాధ్యాయులు మురళి హరినాథ్ విద్యార్థుల చేత 26 వేషధారణ వేసి విద్యార్థుల నైపుణ్యాన్ని వెలికి తీయడం కోసం మరుగునపడిన కులవృత్తులను గుర్తు చేసుకోవడం కోసం చక్క గా ప్రదర్శించడం జరిగింది విద్యార్థులలో చిన్నప్పటినుండి అన్ని అంశాలపై అవగాహన కలిగినట్లయితే భవిష్యత్తులో వారికి నిత్య జీవితంలో ఎంతో ఉపయోగపడుతుంది ప్రభుత్వ పాఠశాలలు మరింత బలోపేతం చేయడం కోసం విద్యార్థులను సర్వతోముఖాభివృద్ధి చేయడం కోసం కృషి చేస్తున్నానని ప్రధానోపాధ్యాయుడు మురళి హరినాథ్ చెప్పారు విద్యార్థులకు ఒత్తిడి లేకుండా జాయ్ full learning నేర్పించాలని సంకల్పించడం జరిగిందని అన్నారు ఈ కార్యక్రమంలో లో గ్రామ పెద్దలు శ్రీనివాస్ రెడ్డి ఉపాధ్యాయులు జయ శ్రీ .నవనీత. విటల్ గౌడ్. చంద్రయ్య. సత్యం. ఆశన్నప్పా జ్యోతి. లక్ష్మీ. మరియు విద్యార్థులు పాల్గొన్నారు
చిత్రం