ఆబాల గోపాలాన్ని అలరించే "బాలకిరణాలు"---కయ్యూరు బాలసుబ్రమణ్యం రచించిన కవితా సంపుటి "బాల కిరణాలు " ఆబాల గోపాలాన్నిఅలరిస్తుందనడంలో సందేహం లేదు.అందరికి అర్థమయ్యే రీతిలో చాలా సరళమైన వచనంలో ఆయన కవితలను రాసారు. ఈ సంపుటిలోసమాజంలో నేటి పరిస్దితులలో ఉన్న అన్ని సమస్యలను ప్రస్తావించారు. 'రేపటి పౌరులు' కవితలోబాలలు ఏమిచేస్తారో చెప్పారు. 'గురువులకు వందనం ' లో గురువులపై తన అభిమానాన్ని చాటి చెప్పారు. నరకకుమా చెట్లు ..వేయకుమా ప్లాట్లు.. పడకుమా పాట్లు అంటూ 'మన బాధ్యతను గుర్తిద్థాం 'అంటూ ఆవేదనను వ్యక్తం చేసారు.భారత్ వెలుగుతోంది అంటూ దేశం పై ఉన్న దేశ భక్తిని తెలియ చేసారు. 'సుజల యజ్ఞం ' కవితలో నీటిప్రాముఖ్యతను వివరించారు. 'ఓటరూ మేలుకో 'అంటూ ఓటు యొక్క విలువలను ఉద్ఘాటించారు.'అమ్మ ఋణం తీర్చుకుందాం "అంటూ అమ్మనిఅశ్రద్ద చేయొద్దని తెలియచేసారు. 'మన బడి పిలుస్తోంది' కవితలో ప్రభుత్వ బడిలో చదివితే కలిగే లాభాలు గురించి ఆలోచనాత్మకంగా విశ్లేషించారు. 'విప్లవం' కవితలో కర్షకకార్మిక ,రైతు ,వెతలని కళ్ళకు కట్టినట్లు ఆవిష్కరించారు. ఇలా చెప్పుకుంటూ పోతే ఆయన కవితల్లో సామాజిక స్పృహ , సమాజానికి ఏదో చేయాలన్నతపన మెండుగా కనిపిస్తుంది. ప్రతి కవిత ఆలోచనాత్మకంగా ఉంటుంది.ఆయన కవిగానే కాక ఉపాధ్యాయుడుగా ,గాయకుడిగా ,మిమిక్రీ కళాకారుడి గా బహు ముఖ ప్రజ్ఞ కనబరుస్తూ సమాజానికి తనవంతు సేవలను అందిస్తూ అనేక అవార్డులను తీసుకుంటూ అందరికి ఆదర్శమవుతున్నారు.మరిన్ని కవితా సంపుటీలు ఆయన కలంనుండి జాలువారాలని అందరి మన్ననలు పొందాలని ఆశిద్దాం.


కామెంట్‌లు
Popular posts
తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు--ఎం బిందుమాధవి
చిత్రం
రామాయణం‌ నుండి108 ప్రశ్నలు –జవాబులు!:----సుజాత.పి.వి.ఎల్.
చిత్రం
వినదగు నెవ్వరు చెప్పిన: --ఎం బిందుమాధవి
చిత్రం
పూర్వ విద్యార్థుల సమ్మేళనం అపురూపం::-యాడవరo చంద్రకాంత్ గౌడ్ తెలుగు పండిట్- సిద్దిపేట-9441762105
చిత్రం
కులవృత్తులు మరువకురా గువ్వలచెన్న వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండల్ గొటిక ఖుర్డు ప్రాథమిక పాఠశాలలో కుల వృత్తుల పై విద్యార్థులు వినూత్న ప్రదర్శన విద్యార్థుల వినూత్న ప్రదర్శన అభినందించిన బషీరాబాద్ వైస్ ఎంపీపీ జడల అన్నపూర్ణ వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల గోటిక ఖుర్దు స్కూల్లో గ్రామంలో ని కుల వృత్తులు పై విద్యార్థులు పాఠశాలల్లో వినూత్న ప్రదర్శన నిర్వహించారు నేటి సమాజంలో ప్రపంచీకరణ , ఆధునికత పేరుతో కులవృత్తులకు ఆదరణ కరువు అయినవీ పల్లె నుండి పట్నంకు బతుకుదెరువు కోసం కన్నతల్లిని ఉన్న ఊరిని వదిలి కుల వృత్తిని వదిలి పట్నంలో వెళ్లి కూలీ గా పనిచేస్తున్నారు కావున ఆనాటి నుండి నేటి వరకు గ్రామంలో అనేక కుల వృత్తుల ప్రాధాన్యత ఉంది సమాజంలో కుమ్మరి కమ్మరి మేతరి చాకలి . వడ్రంగి. రైతులు .పోస్ట్ మాన్ కురువ. లాయర్. డాక్టరు మొదలైన వృత్తుల ప్రతిబింబించే విధంగా కళ్లకు కట్టిన విధంగా పాఠశాల ఆవరణంలో విద్యార్థులు చక్కగా ప్రదర్శించారు పాఠశాల ప్రధానోపాధ్యాయులు మురళి హరినాథ్ విద్యార్థుల చేత 26 వేషధారణ వేసి విద్యార్థుల నైపుణ్యాన్ని వెలికి తీయడం కోసం మరుగునపడిన కులవృత్తులను గుర్తు చేసుకోవడం కోసం చక్క గా ప్రదర్శించడం జరిగింది విద్యార్థులలో చిన్నప్పటినుండి అన్ని అంశాలపై అవగాహన కలిగినట్లయితే భవిష్యత్తులో వారికి నిత్య జీవితంలో ఎంతో ఉపయోగపడుతుంది ప్రభుత్వ పాఠశాలలు మరింత బలోపేతం చేయడం కోసం విద్యార్థులను సర్వతోముఖాభివృద్ధి చేయడం కోసం కృషి చేస్తున్నానని ప్రధానోపాధ్యాయుడు మురళి హరినాథ్ చెప్పారు విద్యార్థులకు ఒత్తిడి లేకుండా జాయ్ full learning నేర్పించాలని సంకల్పించడం జరిగిందని అన్నారు ఈ కార్యక్రమంలో లో గ్రామ పెద్దలు శ్రీనివాస్ రెడ్డి ఉపాధ్యాయులు జయ శ్రీ .నవనీత. విటల్ గౌడ్. చంద్రయ్య. సత్యం. ఆశన్నప్పా జ్యోతి. లక్ష్మీ. మరియు విద్యార్థులు పాల్గొన్నారు
చిత్రం