ప్రజాస్వామ్యం
పచ్చగా -
వర్ధిల్లుతోందని ,
అభివృద్ది ఆకాశాన్ని
అంటుతోందని,
సెలవిచ్చే,
మహ గొప్ప -
నాయకుడి ,
నిలువెత్తు బొమ్మ
దినపత్రికల్లో ,
ప్రకటన రూపంలో
ప్రహసనంగా
మారింది ....!
బొమ్మ చూసిన ఓటర్
ఇక ఎన్నికలెం దుకని,
చలి -పులిని ,
కరోనా ..రాక్షసిని
వూహించుకుంటూ,
ఇంటికే....
పరిమితం అయ్యాడు !
తనిఖీకి వెళ్లిన-
అధికారిని చూసి,
బ్యాలెట్ బాక్సు ..
కిసుక్కున నవ్వింది !!
addComments
కామెంట్ను పోస్ట్ చేయండి