బాలసాహిత్యానికి పండుగ రోజది.8గంటలకుతయారై రిసెప్షన్ హాలుకి వచ్చాం.రచయితలువారి కుటుంబ సభ్యులతో హాలు కోలాహలంగాఉంది. నిన్నటి రోజు పరిచయమయ్యేవాళ్ళంపలుకరించుకున్నాం.కొత్త వాళ్ళు కూడాపరిచయమయ్యారు.భాష పరిచయం లేనప్పుడుచిరునవ్వు కరచాలనాలే మనుషులను మనసులను కలిపే దివ్య సాధనాలు.అందరండైనింగ్ హాలులోకి వెళ్ళాం.బ్రేక్ ఫాస్ట్ చేసిరూమ్ చేరుకున్నాం.పది గంటలకు అకాడమీఉద్యోగులు రూం కి వచ్చారు. టి.ఏ;డి.ఏ బిల్లులునింపించారు.ఫ్లైట్ టిక్కెట్ల జెరాక్సు కాపీలుతీసుకున్నారు. అవార్డు నగదు రు.50000లుబదిలీ చేయడానికి నా బ్యాంకు అకౌంట్ నెంబర్తీసుకున్నారు. సాయంత్రం 5గంటలకల్లా రిసెప్షన్హాలుకి వచ్చేయండని చెప్పారు. మధ్యాహ్నంలంచ్ అయ్యాక విశ్రాంతి తీసుకున్నాం.ఏవేవోఆలోచనలు...పిల్లలు, పాటలు,కథలు,శిక్షణా శిబిరాలు,సదస్సులు,పోటీలు, బహుమతులు,పుస్తక ప్రచురణలు, పురస్కారాలు, ప్రశంసలు, ఆశీస్సులు,నా శ్రేయోభిలాషుల సద్విమర్శలు...ఇంకా ఏవేవో మనస్సును ఆహ్లాదపరిచే సంఘటనలు,మనసును చికాకు పెట్టే సంఘటన లు ఇవన్నీ నా మనస్సులో చుట్టుముట్టసాగాయి.పక్కనే ఉన్న మా ఆవిడను చూశాను. ప్రశాంతంగానిద్రపోతోంది. నా విజయంలో సగభాగం ఆమెదే.ఇంటి ఇల్లాలు భర్తను ప్రశాంత వాతావరణం లోఉంచగలిగితేనే ఆ భర్త విజయాలు సాధించగలుగుతాడు.ఆ వరం నాకు దక్కింది.జీవితంలో ఒడిదొడుకులు వచ్చినప్పుడు ఆమెనాలో నిబ్బరం సడలనివ్వకుండా రచనామార్గానికిఆటంకం లేకుండా చేసేది. మనస్సులోనే కృతజ్ఞతలుచెప్పుకున్నాను.కృతజ్ఞతలంటే ఆమె ఒప్పుకోదు.అది నా బాధ్యత అని అంటుంది.మీ అమ్మగారు ఆ బాధ్యతను అప్పజెప్పారంటుంది.టైం చూశాను. నాలుగయింది.ఆమెను తట్టి లేపాను.గబగబాతయారై ఇద్దరం రిసెప్షన్ హాలు చేరుకున్నాం.అప్పటికే పురస్కారప్రదానోత్సవ సభాస్థలికివాహనాలు వెళ్లివస్తున్నాయి.పది నిముషాలుహాలులో కూర్చున్నాం.అంతలో వెహికిల్ సిద్ధంగాఉంది రండి అన్నారు.ఇద్దరం వాహనమెక్కాం.మాతోపాటు మరికొంతమంది ఉన్నారు. వాహనంబయలుదేరి మైలాపూర్ లోని భారతీయ విద్యాభవన్ వద్ద ఆగింది. వాహనం దిగి మెయిన్ఆడిటోరియమ్ వద్దకు వెళ్ళాం.(సశేషం)
238.బాలసాహిత్య పురస్కార్ 2019 ప్రదానోత్సవం(మొదటి భాగం)::---బెలగాంభీమేశ్వరరావు,9989537835.
addComments
కామెంట్ను పోస్ట్ చేయండి