కందము :*నారాయణ పరమేశ్వర ధారధర నీలదేహ | దానవవైరీ*
*క్షీర్బాధి శయన యదుకుల వీరా నను గావు కరుణ | వరలయఁగ కృష్ణా!*
తా.: ఓ రుక్మిణీ నాధా, సత్యా వల్లభా, గోపికాలోలా..
నారాయణడువూ నీవే, పరమేశ్వరునివీ నువ్వే. నువ్వు వర్షాకాల మేఘము లాగా నల్లటి శరీరాన్ని కలిగివున్నావు. రాక్షసులను రూపుమాపే శతృవువి నువ్వే. పాలసముద్రము మీద పడుకుని సేదదీరుతూ, యదు వంశీయల వీరుడిగా వెలుగొందావు. ఇంతటి గొప్పవాడవైన యశోదా కృష్ణా, నీవు ఎంతో కొంత కరుణ చూపించి నన్ను కావవయ్యా....అని శతకకారుడు నృసింహ కవి వాక్కు
*"శ్రీ కృష్ణా, యదు భూషణా, నీ సమర్ధతనూ, గొప్పతనాన్ని మా లో వున్న అజ్ఞానము చేత మేము పొగడలేము. మేము నీ మాయలో, నీ వల్ల జీవిస్తున్నాము. నీవు అపరిమితమైన దయాశాలివి. అందుచేత, మా మీద దయచూపి, మమ్మల్ని ఈ సంసార పరమైన ఐహిక బంధనాలనుంచి రక్షించు, దేవదేవా"*
*"గోవిందా హరి గోవిందా! గోకుల నందన గోవిందా!!* అంటూ ముందుకు సాగుదాము.
.....ఓం నమో వేంకటేశాయ
Nagarajakumar.mvss
శ్రీ కృష్ణ శతకము* - పద్యం (౩ - 3)
addComments
కామెంట్ను పోస్ట్ చేయండి