స్నేహమంటే…: --పి.గురులక్ష్మి .8వతరగతి…కొత్తపేట

 రాజు,రాము మంచి స్నేహితులు.రాజు వాళ్ళు డబ్బున్న వాళ్ళు.రాముకు నాన్నలేడు.రాము వాళ్ళు
పేదవాళ్ళు.అయినా అలాంటి ఆలోచనలు
వారికి ఎప్పుడూ రాలేదు.ఏబేధాభిప్రాయలు
లేవు.
ఒకరోజు రాము బడికి రాలేదు.సాయంకాలం
రాజు,రాముఇంటికెళ్ళాడు.రాము అమ్మ
జ్వరంతో  బాధపడుతూ మంచంలో ఉంది.రాము అమ్మ కాళ్ళు నొక్కుతున్నాడు.విషయం
తెలుసుకున్న రాజు"హాస్పిటల్ కు వెళ్ళలేదా?"
అని రామును అడిగాడు.
"డబ్బులేక వెళ్ళలేదురా! మందులషాపు లో
మాత్రలు తెచ్ఛివాడాను" చెప్పాడు రాము.
రాజు  తన ఇంటికెళ్ళి నాన్నతో విషయంచెప్పి డబ్బు తెచ్చి రాము
అమ్మను హాస్పిటల్ కు తీసుకెళ్ళి చూపించాడు.అవసరమైన మందులు కొనిచ్చాడు.రెండురోజులకు జ్వరం తగ్గిపోయింది.
రాము ,రాజుకు కృతజ్ఞతలు  చెప్పబోతే
"ఇందులో నాగొప్పదనం లేదురా!మాఅమ్మ,
నాన్న నాకు సహకారగుణాన్ని ,మంచిగా ఆలోచించడాన్ని నేర్పారు"అన్నాడు రాజు.
(డి.కె.చదువులబాబు సంపాదకత్వంలో విద్యార్థులు వ్రాసిన కొత్తపేటకలాలు కథాసంకలనంలో కథ) 
కామెంట్‌లు