ఆహారం కూడ సరిపోలేదు ఇవాళ. నాన్ రొట్టెలు బిగుసుకొని రుచి మారాయి. ఇంకో రెండు రోజులు ఇక్కడే..దగ్గరలోనే శత్రువుల స్థావరముంది.జాగ్రత్తగా వారిని వెళ్లగొట్టే పని చెయ్యాలని బాస్ ఆదేశించారు.బృందం లో తలో చోట ఉన్నారు. మన సరిహద్దులో వాడికి చోటు లేదు. తరిమేపని ఉంది. ఈ చలిలో ఇక్కడ కుటుంబానికి దూరంగా ఒంటరిగా ఉండేది చాలా దుర్భరం అనిపిస్తుంది రఘుకి.కానీ తనకు ఉన్న విద్యార్హతలకు,శరీర ధృఢత్వానికి వచ్చిన చక్కని ఉద్యోగం ఇది.మంచి జీతం. సమాజంలో సాటిలేని గౌరవం. తన తాతగారు రెండో ప్రపంచయుద్ధంలో సియాచిన్ లో ఉండి పాల్గొని వచ్చిన యోధుడు.ఆయనకు వచ్చిన మెడల్స్ ను తనకు చూపిస్తూ ఉంటే, ఆనాటి విశేషాలు వర్ణిస్తూ ఉంటే ఉత్తేజంతో మనసు ఉప్పొంగి పోతుంది.కానీ శిక్షణ కంటే మొదటి ఉద్యోగధర్మం ఇక్కడ కఠినంగా ఉంది అని, వెనక్కు ఇంటికి వెళ్ళాలి అనిపిస్తుంది.పెద్ద కుటుంబం ఆప్యాయత గుర్తు వచ్చి కళ్ల లో నీరు తిరిగి చొక్కా చేతితో అద్దుకున్నాడు రఘు.మొదటి నుండి ఆలోచన ఎక్కువ అమ్మ లాగా తనకు.కానీ ఒక్క కుటుంబం గురించి తాను ఆలోచన చేసాడే... ఈ సరిహద్దు రక్షణ వల్ల దేశంలో ఎన్ని కోట్ల కుటుంబాలు నిశ్చింతగా.. తమ జీవితం గడుపుతున్నాయి.!నిజమే సైనికులు అమ్మ లాంటి వాళ్ళు దేశానికి.. అనుకున్న రఘు, గుండెల్లో ఒక ధైర్యం, ఆత్మ విశ్వాసం తో దీర్ఘ స్వాస తీసుకొని బాగ్ ను పొట్టకుఆనించివెనక్కు వాలి కళ్ళుమూసుకున్నాడు.బెక్ బెక్ మని చప్పుడు మళ్ళీ.. ఆ పెద్దకప్ప గుమ్మడి కాయ అంత ఉంది. బూడిద రంగులో.. ఒక మూల గూడు తవ్వి కూర్చొని చూస్తున్నది. చిరాకుగా దాన్ని తుపాకీ బారెల్ కొస తో బెదిరింపులు చేసాడు రఘు. అది నిమ్మళంగా నే ఉంది. హఠాత్ గా రఘుకి జ్ఞానోదయం అయింది. తాను దీని సరిహద్దు లో ప్రవేశించి ఇబ్బంది పెట్టి తిరిగి దాన్నే బెదిరింపులు సబబు కాదు. ఒక పక్కన ఒత్తి గిలి కూర్చుని దానికి సరిపోయే దారి ఇచ్చాడు. నెమ్మదిగా ఆహరం కోసం బైట కు వెళ్ళింది కప్ప. జీవి మనుగడ ఎక్కడ అయినా ఒకే సూత్రం కదా.. సరిహద్దు న్యాయం గొప్ప ది.ఇవాళ తన కర్తవ్యం ఈ మూగజీవి ద్వారా ఎంతో బాగా అర్ధం అయింది అనుకున్నాడు సైనికుడు రఘు!
సరిహద్దు -ఎవరికైన ఒకటే ( కథానిక )-ఎం. వి. ఉమాదేవి -నెల్లూరు
addComments
కామెంట్ను పోస్ట్ చేయండి