*మడుగుకు జని కాళీయుని**పడగలపై భరతశాస్త్ర | పద్ధతి వెలయన్**గడు వేడుకతో నాడెడు**నడుగులు నా మదిని దలఁతు | నచ్యుత కృష్ణా !*తా.: ఓ రుక్మిణీ నాధా, సత్యా వల్లభా, గోపికాలోలా..కృష్ణా, కాళీయుడు అనే పాము ఆసరస్సుకు వచ్చిన వారిని అందరిని తన విషం చల్లి చంపేస్తున్నాడు. ఆ మడుగుకు వెళ్ళి, నీవు ఆ కాళీయుని పడగలపై నీ పాదాలతో అద్భుతంగా భరతనాట్యం పద్ధతులు చూపించావు. అటువంటి నీ పాదాలను నా మనస్సులో ధ్యానించి నమస్కరిస్తున్నాను.......అని శతకకారుడు నృసింహ కవి వాక్కు*కాళీయ ఫణి ఫణ జాలాన ఝణఝణ కేళీ ఘటించిన గపకిశోరా* అంటూ ఆ అమేయాత్మని వేడుకొందాము......ఓం నమో వేంకటేశాయNagarajakumar.mvss
శ్రీ కృష్ణ శతకము - పద్యం (౧౭ - 17)
addComments
కామెంట్ను పోస్ట్ చేయండి