శ్రీ కృష్ణ శతకము - పద్యం (౨౮ - 28)

 కందము :
*దుర్జనులగు నృపసంఘము*
*నిర్జింపఁగదలఁచి నీవు | నిఖిలాధారా*
*దుర్జనులను వధియింపను*
*నర్జునునకు నీవు సార | ధైతివి కృష్ణా !* 
తా.: ఓ రుక్మిణీ నాధా, సత్యా వల్లభా, గోపికాలోలా..
ఓ రాధా మానసచోరా,  సకల ప్రపంచానికి ఆధారమైనవాడవు నీవు, దుర్మార్గులైన రాజులను, లెక్కకు మిక్కిలిగా పెరిగిపోయిన పాపత్ములను నిర్మూలించి భూము భారాన్ని తగ్గించడానికి అర్జునునుకి రధసారధ్యం చేశావు మహానుభావా. ......అని  శతకకారుడు నృసింహ కవి వాక్కు
 
*ఓ దనుజవైరీ,  నీవుగాక దిక్కెవ్వరూ ...* అంటూ ఆ *నవరస నటనా నాయకుని* వేడుకొందాము.
.....ఓం నమో వేంకటేశాయ
Nagarajakumar.mvss
కామెంట్‌లు