మత్స్యావతారం ( గేయ కథ)( మణి పూసలు)(1) మొదటి భాగము:-ఎడ్ల లక్ష్మి-సిద్ధిపేట

సత్యవ్రతుడు అనె రాజు
మహా విష్ణువుని రోజు
మనసులోన కొలుస్తూ
సూర్యుని మొక్కు రాజు

శృతి మాలిక నీటిలో 
నీటిని పట్టి చేతిలో
దోసిలి నీ చూడగా
చేప ఉండెను నీటిలో

ఒక రోజే పెరిగెను
సరసు నిండా ఎదిగేను
చేతులెత్తి మొక్కె రాజు
చేప ముందర నొదిగెను

నిజరూపము చూపు స్వామి
మాయ లేము వద్దు స్వామి
నారాయణుడపుడు నవ్వి
చూపు నిజరూపం స్వామి

కామెంట్‌లు