భారతియార్ అంతిమయాత్రలో పాల్గొన్నవారు పద్నాలుగు మందే!:-- యామిజాల జగదీశ్
 'చిన్నస్వామి సుబ్రహ్మణ్య భారతి' (1882 - 1921) ప్రముఖ కవి, రచయిత, పత్రికా సంపాదకుడు. స్వాతంత్ర్య సమరయోధుడు. సంఘసంస్కర్త. ఆధునిక తమిళ కవిత్వానికి మార్గదర్శిగా వినుతికెక్కిన భారతియార్ ఇప్పటి తూత్తుకుడి జిల్లాలోని ఎట్టయాపురంలో జన్మించారు. ఆయన తల్లి లక్ష్మీఅమ్మాళ్. తండ్రి   చిన్నసామి సుబ్రహ్మణ్య అయ్యర్. ఆయన ఐదో ఏట తల్లిని, పదహారో యేట తండ్రిని కోల్పోయారు. ఆయనకు పద్నాలుగో ఏట పెళ్ళయింది. ఆమె పేరు చెల్లమ్మ. అప్పుడామె వయస్సు ఏడేళ్ళు. ఆయనకు మూడు విదేశ భాషలతోసహా మొత్తం  ముప్పైరెండు భాషలు తెలుసు.   
పదకొండో యేటనే కవితలు చెప్పడం అలవరచుకున్న ఆయనకు “భారతి” అన్న బిరుదు విద్యలకు అధిదేవతైన సరస్వతీ దేవి పేరిట ప్రదానం చేశారు.
ఆయనకు 1921 సెప్టెంబరు ఒకటో తేదీన కడుపు నొప్పి తలెత్తింది. సన్నగా ఉండిన ఆయన దేహం ఈ కడుపునొప్పిని తట్టుకోలేకపోయింది. వ్యాది తీవ్రరూపం దాల్చింది. స్వదేశమిత్రన్ అనే పత్రిక నుంచి వచ్చిన కొందరు ఆయనను చూడటానికి వచ్చారు. అప్పుడు భారతియార్ వారితో మాట్లాడుతూ, తాను సెప్టెంబరు పన్నెండో తేదీన విధులకు హాజరవుతానని చెప్పారు. అయితే బాధాకరమైన విషయమేమిటంటే సరిగ్గా ఆ రోజే ఆయన దేహానికి అంత్యక్రియలు జరిగాయి. సెప్టెంబరు పదకొండో తేదీ అర్ధరాత్రి దాటిన తర్వాత ఆయనకు ఆరోగ్యం మరింత విషమించింది. అప్పుడు ఆయన వెంట కొందరు మిత్రులు మాత్రమే ఉన్నారు. వారిలో ఒకరైన నీలకంఠ బ్రహ్మచారి చెప్పిన విషయాలలోంచి కొన్ని మాటలు ఇక్కడ ఇస్తున్నాను......
శ్రీ ప్రకాశ్ సోదరుడైన హోమియోపతి డాక్టర్ జానకిరామన్ భారతియార్ ని చూడటానికి వచ్చారు. ఆయన భారతియార్ ని చూసి మీకెలా ఉంది అని అడిగారు. ఈ మాట వినడంతోనే భారతియార్ కు కోపం ఉప్పొంగింది.
 “నాకేమిటీ, నేను దర్జాగా ఉన్నాను. ఎవరికి ఆరోగ్యం బాగులేదు. మిమ్మల్నెవరు ఇక్కడికి రమ్మన్నారు....నన్నిలానే విడిచిపెట్టి వెళ్ళండి” అని అన్నారు.
ఇక చేసేదేమీ లేక డాక్టర్ జానకిరామన్ అక్కడి నుంచి వెళ్ళిపోయారు.
అనంతరం భారతియార్ ఇంటికి దగ్గర్లో ఉండే ఓ మహిళ భారతియార్ ని చూడటానికి వచ్చారు. ఏంటీ నీకు ఆరోగ్యం బాగులేదటగా అని ఆమె అన్నారో లేదో భారతియార్ కు తెగ కోపం వచ్చింది.
ఎవరికి ఆరోగ్యం బాగులేదు....నేను బాగానే ఉన్నాను. నన్నిలాటి ప్రశ్నలతో విసిగించకండి....మీకందరికీ మరేమీ పని లేదా అని భారతియార్ పెద్దగా అరిచారు. ఆ తర్వాత భారతియార్ తన మిత్రులతో మాట్లాడుతూ, అమానుల్లాఖాన్ గురించి ఓ వ్యాసం రాయాలని ఉందన్నారట. ఈ అమానుల్లాఖాన్ మరెవరో కాదు. ఆఫ్గనిస్థాన్లో చక్రవర్తిగా ఉన్నారు. ఈ మాట తర్వాత ఆయన స్పృహ కోల్పోయారు. రాత్రి ఒకటి ముప్పైకి తుది శ్వాసవిడిచారు. ముప్పై తొమ్మిదో ఏట చనిపోయిన భారతియార్ అంతిమయాత్రకు కేవలం పద్నాలుగు మంది మాత్రమే హాజరయ్యారు. జాతీయ స్థాయిలో ఓ మహాకవిగా ప్రసిద్ధి పొందిన భారతియార్ అంతిమయాత్రకు హాజరైన పద్నాలుగు మందిలో ఇద్దరేమో బంధువులు. మరో ఇద్దరు మిత్రులు. మగిలిన పది మంది వివరాలు తెలియరాలేదు.
ఇదిలా ఉండగా, ట్రిప్లికేన్ లోని పార్థసారథి ఆలయ ఏనుగు తొక్కడంతో ఆయన  చనిపోయారని వ్యాపించిన వదంతలేవీ సరికావు. ఆయన ఏనుగు తొక్కడం వల్ల మరణించలేదు. ఆయనను ఏనుగు తొక్కిన మాటైతే నిజమే. కానీ ఆ దుర్ఘటన నుంచి ఆయన కోలుకున్నారు. ఆ తర్వాత కడుపు నొప్పితోనే ఆయన కన్ను మూసిన నిజాన్ని భారతియార్ పై పరిశోధనలు చేసిన వారు నిర్ధారించారు.

కామెంట్‌లు
Popular posts
తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు--ఎం బిందుమాధవి
చిత్రం
వినదగు నెవ్వరు చెప్పిన: --ఎం బిందుమాధవి
చిత్రం
కులవృత్తులు మరువకురా గువ్వలచెన్న వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండల్ గొటిక ఖుర్డు ప్రాథమిక పాఠశాలలో కుల వృత్తుల పై విద్యార్థులు వినూత్న ప్రదర్శన విద్యార్థుల వినూత్న ప్రదర్శన అభినందించిన బషీరాబాద్ వైస్ ఎంపీపీ జడల అన్నపూర్ణ వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల గోటిక ఖుర్దు స్కూల్లో గ్రామంలో ని కుల వృత్తులు పై విద్యార్థులు పాఠశాలల్లో వినూత్న ప్రదర్శన నిర్వహించారు నేటి సమాజంలో ప్రపంచీకరణ , ఆధునికత పేరుతో కులవృత్తులకు ఆదరణ కరువు అయినవీ పల్లె నుండి పట్నంకు బతుకుదెరువు కోసం కన్నతల్లిని ఉన్న ఊరిని వదిలి కుల వృత్తిని వదిలి పట్నంలో వెళ్లి కూలీ గా పనిచేస్తున్నారు కావున ఆనాటి నుండి నేటి వరకు గ్రామంలో అనేక కుల వృత్తుల ప్రాధాన్యత ఉంది సమాజంలో కుమ్మరి కమ్మరి మేతరి చాకలి . వడ్రంగి. రైతులు .పోస్ట్ మాన్ కురువ. లాయర్. డాక్టరు మొదలైన వృత్తుల ప్రతిబింబించే విధంగా కళ్లకు కట్టిన విధంగా పాఠశాల ఆవరణంలో విద్యార్థులు చక్కగా ప్రదర్శించారు పాఠశాల ప్రధానోపాధ్యాయులు మురళి హరినాథ్ విద్యార్థుల చేత 26 వేషధారణ వేసి విద్యార్థుల నైపుణ్యాన్ని వెలికి తీయడం కోసం మరుగునపడిన కులవృత్తులను గుర్తు చేసుకోవడం కోసం చక్క గా ప్రదర్శించడం జరిగింది విద్యార్థులలో చిన్నప్పటినుండి అన్ని అంశాలపై అవగాహన కలిగినట్లయితే భవిష్యత్తులో వారికి నిత్య జీవితంలో ఎంతో ఉపయోగపడుతుంది ప్రభుత్వ పాఠశాలలు మరింత బలోపేతం చేయడం కోసం విద్యార్థులను సర్వతోముఖాభివృద్ధి చేయడం కోసం కృషి చేస్తున్నానని ప్రధానోపాధ్యాయుడు మురళి హరినాథ్ చెప్పారు విద్యార్థులకు ఒత్తిడి లేకుండా జాయ్ full learning నేర్పించాలని సంకల్పించడం జరిగిందని అన్నారు ఈ కార్యక్రమంలో లో గ్రామ పెద్దలు శ్రీనివాస్ రెడ్డి ఉపాధ్యాయులు జయ శ్రీ .నవనీత. విటల్ గౌడ్. చంద్రయ్య. సత్యం. ఆశన్నప్పా జ్యోతి. లక్ష్మీ. మరియు విద్యార్థులు పాల్గొన్నారు
చిత్రం
రామాయణం‌ నుండి108 ప్రశ్నలు –జవాబులు!:----సుజాత.పి.వి.ఎల్.
చిత్రం
పూర్వ విద్యార్థుల సమ్మేళనం అపురూపం::-యాడవరo చంద్రకాంత్ గౌడ్ తెలుగు పండిట్- సిద్దిపేట-9441762105
చిత్రం