*తోక లేని కోతి (సరదా బాలల సరదా కథ)* :-పునః కథనం: డా.ఎం.హరికిషన్-కర్నూలు-9441032212

 ఒక అడవిలో ఒక మామిడి చెట్టుపైన ఒక కోతి ఉండేది. దానికి అందమైన పొడవాటి తోక ఉండేది.
‘జింకకు కొమ్ములు అందం, నెమలికి పింఛం అందం, పులికి చారలు అందం, సింహానికి జూలు అందం. అలాగే నాకు నా తోక అందం' అని ఆనందంతో మురిసిపోయేది.
ఆ చెట్టు కింద ఒక కుందేలు , జింక ఉన్నాయి. వాటికి చిన్న చిన్న తోకలు ఉన్నాయి. అవి కోతి తోక చూసి బాగా అసూయపడేవి. దీని తోక ఎప్పుడో ఒకసారి విరిగి పోతే బాగుంటుంది అనుకునేవి. దానిని ఎప్పుడూ ఏదో ఒక మాట అంటూ ఏడిపించేవి.
ఒకరోజు సాయంకాలం జింక, కుందేలు చెట్టు పైకి చూసి చాలా ఆశ్చర్యపోయాయి.
ఎందుకంటే కోతికి తోక లేదు. మొత్తం ఊడి పోయింది. అది చూసి అవి చాలా సంబరపడ్డాయి.
“ ఓయ్... కోతీ... ఏమైంది నీ తోక. ఇప్పుడు నువ్వు ఎలా వున్నావో తెలుసా. అచ్చం  ఈకలు పీకేసిన కోడిలాగా, గుండు కొట్టిచ్చుకున్న సింహం లాగా , తొండం లేని ఏనుగులాగా ఉన్నావు. మాకు చూడు ఇప్పుడు నీకన్నా పెద్ద పెద్ద తోకలు వున్నాయి" అంటూ పక పక పక నవ్వుతూ కోతిని వెక్కిరించాయి. 
అంతలో చెట్టు మీద కూర్చున్న కోతికి దూరంగా ఒక పులి రావటం కనబడింది. వెంటనే అది 'ఓ పిచ్చి జంతువులారా... నా తోకను నేనే కొండ కింద వున్న హనుమంతునికి నైవేద్యంగా ఇచ్చాను. ఆయన సంతోషించి శత్రువును ముందుగా కనిపెట్టే వరాన్ని నాకు ఇచ్చాడు. తోక కన్నా ప్రాణాలే ఎక్కువ ముఖ్యం కదా. అందుకే దాన్ని వదిలేసాను. ఇదిగో ఇటువైపు కాసేపట్లో పులి వస్తుంది. మీరు తొందరగా దాక్కోండి" అనింది. రెండూ అలాగా అంటూ గబగబా దాక్కున్నాయి.
అంతలో పులి అక్కడికి వచ్చి ఏమీ కనబడక వెళ్ళిపోయింది. దానితో కోతి చెప్పిన మాటలు నిజం అని జింక, కుందేలు నమ్మాయి. అవి గూడా తమ తమ తోకలని కత్తరించుకోని హనుమంతునికి నైవేద్యం పెట్టాయి. కానీ కోతి చెప్పినట్టు అవి శత్రువుల రాకను ముందుగానే కనిపెట్టలేక పోయాయి. 
అప్పుడు కోతి నవ్వి "చూడు మిత్రులారా... ఒక బోనులో ఇరుక్కుని నా తోక తెగి నేను బాధ పడుతుంటే ఓదార్చాల్సింది పోయి నన్నే వెక్కిరించి ఏడిపిస్తారా. అందుకే మీకు బుద్ధి రావాలని అలా చెప్పాను. ఇప్పుడు నాకే కాక మీకూ తోకలు లేవు. సరిపోయిందా” అంటూ అక్కన్నించి వెళ్ళిపోయింది.

కామెంట్‌లు
Popular posts
తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు--ఎం బిందుమాధవి
చిత్రం
వినదగు నెవ్వరు చెప్పిన: --ఎం బిందుమాధవి
చిత్రం
కులవృత్తులు మరువకురా గువ్వలచెన్న వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండల్ గొటిక ఖుర్డు ప్రాథమిక పాఠశాలలో కుల వృత్తుల పై విద్యార్థులు వినూత్న ప్రదర్శన విద్యార్థుల వినూత్న ప్రదర్శన అభినందించిన బషీరాబాద్ వైస్ ఎంపీపీ జడల అన్నపూర్ణ వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల గోటిక ఖుర్దు స్కూల్లో గ్రామంలో ని కుల వృత్తులు పై విద్యార్థులు పాఠశాలల్లో వినూత్న ప్రదర్శన నిర్వహించారు నేటి సమాజంలో ప్రపంచీకరణ , ఆధునికత పేరుతో కులవృత్తులకు ఆదరణ కరువు అయినవీ పల్లె నుండి పట్నంకు బతుకుదెరువు కోసం కన్నతల్లిని ఉన్న ఊరిని వదిలి కుల వృత్తిని వదిలి పట్నంలో వెళ్లి కూలీ గా పనిచేస్తున్నారు కావున ఆనాటి నుండి నేటి వరకు గ్రామంలో అనేక కుల వృత్తుల ప్రాధాన్యత ఉంది సమాజంలో కుమ్మరి కమ్మరి మేతరి చాకలి . వడ్రంగి. రైతులు .పోస్ట్ మాన్ కురువ. లాయర్. డాక్టరు మొదలైన వృత్తుల ప్రతిబింబించే విధంగా కళ్లకు కట్టిన విధంగా పాఠశాల ఆవరణంలో విద్యార్థులు చక్కగా ప్రదర్శించారు పాఠశాల ప్రధానోపాధ్యాయులు మురళి హరినాథ్ విద్యార్థుల చేత 26 వేషధారణ వేసి విద్యార్థుల నైపుణ్యాన్ని వెలికి తీయడం కోసం మరుగునపడిన కులవృత్తులను గుర్తు చేసుకోవడం కోసం చక్క గా ప్రదర్శించడం జరిగింది విద్యార్థులలో చిన్నప్పటినుండి అన్ని అంశాలపై అవగాహన కలిగినట్లయితే భవిష్యత్తులో వారికి నిత్య జీవితంలో ఎంతో ఉపయోగపడుతుంది ప్రభుత్వ పాఠశాలలు మరింత బలోపేతం చేయడం కోసం విద్యార్థులను సర్వతోముఖాభివృద్ధి చేయడం కోసం కృషి చేస్తున్నానని ప్రధానోపాధ్యాయుడు మురళి హరినాథ్ చెప్పారు విద్యార్థులకు ఒత్తిడి లేకుండా జాయ్ full learning నేర్పించాలని సంకల్పించడం జరిగిందని అన్నారు ఈ కార్యక్రమంలో లో గ్రామ పెద్దలు శ్రీనివాస్ రెడ్డి ఉపాధ్యాయులు జయ శ్రీ .నవనీత. విటల్ గౌడ్. చంద్రయ్య. సత్యం. ఆశన్నప్పా జ్యోతి. లక్ష్మీ. మరియు విద్యార్థులు పాల్గొన్నారు
చిత్రం
రామాయణం‌ నుండి108 ప్రశ్నలు –జవాబులు!:----సుజాత.పి.వి.ఎల్.
చిత్రం
పూర్వ విద్యార్థుల సమ్మేళనం అపురూపం::-యాడవరo చంద్రకాంత్ గౌడ్ తెలుగు పండిట్- సిద్దిపేట-9441762105
చిత్రం