బంగారు పక్షి:-ప్రతాప్ కౌటిళ్యా
కండ్ల అఖండ జ్యోతిని వెలిగిస్తూ నే గాలి నాలుగు గదుల హృదయంలో ప్రవహిస్తున్న నదిలా ఎగిరేసిన తెరచాప నావలా కొట్టుకుంటున్న గుండె నడిగితే ఏం చెప్తుంది!

గడ్డకట్టిన నీటిని కరిగించాలంటే నీరు ఆవిరైపోతుంది అన్న నిజం నువ్వు తెలుసుకోవాలి

ఊపిరి ఊదీన బెలూన్ను కాదు భూగోళం గాలిని తీసేస్తే నింపడానికి
అక్కర లేని ఆత్మ పరమాత్మ ప్రాణం తో పాటు పారిపోవడానికి !?

మట్టిని గడ్డ కట్టిస్తే పాత కొత్త పర్వతమై
పోతుంది
రాతిపై మొలకెత్తించే మొక్కల్లా మనుషులు గండు చీమల్లా ఎగబాకాల్సీ వస్తుంది!?

నీరు నెత్తురు పాత స్నేహితులు తెల్లని పావురాళ్ళ భూమిపై ఎగిరే సత్యాలు!?

రంగుల గురించి మాట్లాడకు ఆకాశంలోనే కనిపిస్తే అందవు కానీ అరచేతుల్లో విరబూసిన రంగులు నీ సొంతం!?

రంగుల్ని కళ్ళల్లో వెలిగించాలి కానీ గుండెల్లో వెలిగిస్తే బండరాళ్లు అవుతాయి!?

పెనవేసుకున్న పాదాలకు ముందు వెనుక నడకలు ఉన్నవి ఆ పాదాలు ఎవరివో అని ప్రశ్నిస్తే మనిషి దేవుడై కిందికి దిగి వస్తాడు!?

ఎదిరించడానికి ఎదురుగా ఎవరూ లేరు గాలి తప్ప!?
చూపించడానికి చుట్టూ శూన్యం ఒక్క కాంతి తప్ప!?
దీపం వెలిగిస్తూ నే ఉండు సూర్యుడు ఓడిపోయే దాకా!?

ప్రాణం పోసి ప్రాణం తీసి పంచేంద్రియాలను ప్రయోగశాలలో పరిక్షచేస్తే పంచభూతాలు ప్రత్యక్షమవుతాయి కానీ మనిషి మాయమవుతాడు!?

కన్నీరు నీరు కాదు నీరు నెత్తురు వెలిగిస్తున్న ఏడు ఖండాల అఖండ దీప మే మనిషి!?

బరువులేని గాలినే మళ్ళించ లేని భూగోళం ఇప్పుడు సముద్రాల్నీనదుల్ని శూన్యంలోకి మళ్లించి అంగారకున్నీబంగారు పక్షి గా ఎగరేస్తోంది !?
Dedicated to Beloved late
Srmt Dhanasri garu ,Pune
Pratapkoutilya, lecturer in Bio-Chem

కామెంట్‌లు
Popular posts
తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు--ఎం బిందుమాధవి
చిత్రం
వినదగు నెవ్వరు చెప్పిన: --ఎం బిందుమాధవి
చిత్రం
కులవృత్తులు మరువకురా గువ్వలచెన్న వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండల్ గొటిక ఖుర్డు ప్రాథమిక పాఠశాలలో కుల వృత్తుల పై విద్యార్థులు వినూత్న ప్రదర్శన విద్యార్థుల వినూత్న ప్రదర్శన అభినందించిన బషీరాబాద్ వైస్ ఎంపీపీ జడల అన్నపూర్ణ వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల గోటిక ఖుర్దు స్కూల్లో గ్రామంలో ని కుల వృత్తులు పై విద్యార్థులు పాఠశాలల్లో వినూత్న ప్రదర్శన నిర్వహించారు నేటి సమాజంలో ప్రపంచీకరణ , ఆధునికత పేరుతో కులవృత్తులకు ఆదరణ కరువు అయినవీ పల్లె నుండి పట్నంకు బతుకుదెరువు కోసం కన్నతల్లిని ఉన్న ఊరిని వదిలి కుల వృత్తిని వదిలి పట్నంలో వెళ్లి కూలీ గా పనిచేస్తున్నారు కావున ఆనాటి నుండి నేటి వరకు గ్రామంలో అనేక కుల వృత్తుల ప్రాధాన్యత ఉంది సమాజంలో కుమ్మరి కమ్మరి మేతరి చాకలి . వడ్రంగి. రైతులు .పోస్ట్ మాన్ కురువ. లాయర్. డాక్టరు మొదలైన వృత్తుల ప్రతిబింబించే విధంగా కళ్లకు కట్టిన విధంగా పాఠశాల ఆవరణంలో విద్యార్థులు చక్కగా ప్రదర్శించారు పాఠశాల ప్రధానోపాధ్యాయులు మురళి హరినాథ్ విద్యార్థుల చేత 26 వేషధారణ వేసి విద్యార్థుల నైపుణ్యాన్ని వెలికి తీయడం కోసం మరుగునపడిన కులవృత్తులను గుర్తు చేసుకోవడం కోసం చక్క గా ప్రదర్శించడం జరిగింది విద్యార్థులలో చిన్నప్పటినుండి అన్ని అంశాలపై అవగాహన కలిగినట్లయితే భవిష్యత్తులో వారికి నిత్య జీవితంలో ఎంతో ఉపయోగపడుతుంది ప్రభుత్వ పాఠశాలలు మరింత బలోపేతం చేయడం కోసం విద్యార్థులను సర్వతోముఖాభివృద్ధి చేయడం కోసం కృషి చేస్తున్నానని ప్రధానోపాధ్యాయుడు మురళి హరినాథ్ చెప్పారు విద్యార్థులకు ఒత్తిడి లేకుండా జాయ్ full learning నేర్పించాలని సంకల్పించడం జరిగిందని అన్నారు ఈ కార్యక్రమంలో లో గ్రామ పెద్దలు శ్రీనివాస్ రెడ్డి ఉపాధ్యాయులు జయ శ్రీ .నవనీత. విటల్ గౌడ్. చంద్రయ్య. సత్యం. ఆశన్నప్పా జ్యోతి. లక్ష్మీ. మరియు విద్యార్థులు పాల్గొన్నారు
చిత్రం
రామాయణం‌ నుండి108 ప్రశ్నలు –జవాబులు!:----సుజాత.పి.వి.ఎల్.
చిత్రం
పూర్వ విద్యార్థుల సమ్మేళనం అపురూపం::-యాడవరo చంద్రకాంత్ గౌడ్ తెలుగు పండిట్- సిద్దిపేట-9441762105
చిత్రం