కోతితో స్నేహమా? (కథ) సరికొండ శ్రీనివాసరాజు

 అనగనగా ఒక అడవిలో ఒక కోతి దురుసు స్వభావం కలిగేది ఉండేది. దానితో ఏం మాట్లాడినా కష్టమే. అందుకే చాలా జంతువులు, పక్షులు దానికి దూరంగా ఉండేవి. ఈ మధ్యనే ఒక రామచిలుక ఆ కోతితో స్నేహం చేయడానికి ప్రయత్నించింది. తరచుగా కోతి యోగక్షేమాలు విచారించడమే కాక కోతితో స్నేహ పూర్వకంగా మాట్లాడటానికి ప్రయత్నిస్తుంది. ఇది గమనించిన ఒక పావురం. "శుక మిత్రమా! దురుసు స్వభావం కలవారితో స్నేహం తగదు. అది ఎప్పటికైనా మనకు ప్రమాదకరమే." అంది. "నేను ఖచ్చితంగా ఆ కోతి స్వభావాన్ని మార్చుతాను చూడు." అంది రామచిలుక. "నీ ఖర్మ." అంది పావురం.
ఒకరోజు కోతి ఎందుకో తనలో తాను నవ్వుకుంటుంది. అప్పుడు రామచిలుక కోతి వద్దకు వెళ్ళి "ఏం మిత్రమా! నీలో నువ్వే నవ్వుకుంటున్నావు. ఏమైంది నీకు. ఏమైనా తిన కూడనిది తిని మెదడు పని చేయడం లేదా?" అని ఇతర జంతువుల ముందు కోతితో తన చనువును నిరూపించుకోవడానికి బడాయిగా అంది రామచిలుక. "నా దగ్గరకు రా మిత్రమా!" అని ఆప్యాయంగా పిలిచింది కోతి. రామచిలుక దానికి దగ్గరగా వెళ్ళింది. కోతి అమాంతం రామచిలుక గొంతు పట్టుకొని పైకెత్తి "నాకే మెదడు లేదని అంటావా? నిన్ను చంపేస్తాను చూడు." అంది. రామచిలుక ప్రాణభయంతో వణికిపోయింది. అప్పుడే ఆ కోతికి తల్లి అయిన మరో కోతి అక్కడికి రాగానే కోతి రామచిలుకను వదిలిపెట్టింది. రామచిలుక బతుకుజీవుడా అంటూ అక్కడ నుంచి వెళ్ళిపోయింది. మళ్ళీ ఎప్పుడూ కోతి వైపు రాలేదు.
కామెంట్‌లు
Popular posts
తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు--ఎం బిందుమాధవి
చిత్రం
వినదగు నెవ్వరు చెప్పిన: --ఎం బిందుమాధవి
చిత్రం
కులవృత్తులు మరువకురా గువ్వలచెన్న వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండల్ గొటిక ఖుర్డు ప్రాథమిక పాఠశాలలో కుల వృత్తుల పై విద్యార్థులు వినూత్న ప్రదర్శన విద్యార్థుల వినూత్న ప్రదర్శన అభినందించిన బషీరాబాద్ వైస్ ఎంపీపీ జడల అన్నపూర్ణ వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల గోటిక ఖుర్దు స్కూల్లో గ్రామంలో ని కుల వృత్తులు పై విద్యార్థులు పాఠశాలల్లో వినూత్న ప్రదర్శన నిర్వహించారు నేటి సమాజంలో ప్రపంచీకరణ , ఆధునికత పేరుతో కులవృత్తులకు ఆదరణ కరువు అయినవీ పల్లె నుండి పట్నంకు బతుకుదెరువు కోసం కన్నతల్లిని ఉన్న ఊరిని వదిలి కుల వృత్తిని వదిలి పట్నంలో వెళ్లి కూలీ గా పనిచేస్తున్నారు కావున ఆనాటి నుండి నేటి వరకు గ్రామంలో అనేక కుల వృత్తుల ప్రాధాన్యత ఉంది సమాజంలో కుమ్మరి కమ్మరి మేతరి చాకలి . వడ్రంగి. రైతులు .పోస్ట్ మాన్ కురువ. లాయర్. డాక్టరు మొదలైన వృత్తుల ప్రతిబింబించే విధంగా కళ్లకు కట్టిన విధంగా పాఠశాల ఆవరణంలో విద్యార్థులు చక్కగా ప్రదర్శించారు పాఠశాల ప్రధానోపాధ్యాయులు మురళి హరినాథ్ విద్యార్థుల చేత 26 వేషధారణ వేసి విద్యార్థుల నైపుణ్యాన్ని వెలికి తీయడం కోసం మరుగునపడిన కులవృత్తులను గుర్తు చేసుకోవడం కోసం చక్క గా ప్రదర్శించడం జరిగింది విద్యార్థులలో చిన్నప్పటినుండి అన్ని అంశాలపై అవగాహన కలిగినట్లయితే భవిష్యత్తులో వారికి నిత్య జీవితంలో ఎంతో ఉపయోగపడుతుంది ప్రభుత్వ పాఠశాలలు మరింత బలోపేతం చేయడం కోసం విద్యార్థులను సర్వతోముఖాభివృద్ధి చేయడం కోసం కృషి చేస్తున్నానని ప్రధానోపాధ్యాయుడు మురళి హరినాథ్ చెప్పారు విద్యార్థులకు ఒత్తిడి లేకుండా జాయ్ full learning నేర్పించాలని సంకల్పించడం జరిగిందని అన్నారు ఈ కార్యక్రమంలో లో గ్రామ పెద్దలు శ్రీనివాస్ రెడ్డి ఉపాధ్యాయులు జయ శ్రీ .నవనీత. విటల్ గౌడ్. చంద్రయ్య. సత్యం. ఆశన్నప్పా జ్యోతి. లక్ష్మీ. మరియు విద్యార్థులు పాల్గొన్నారు
చిత్రం
రామాయణం‌ నుండి108 ప్రశ్నలు –జవాబులు!:----సుజాత.పి.వి.ఎల్.
చిత్రం
పూర్వ విద్యార్థుల సమ్మేళనం అపురూపం::-యాడవరo చంద్రకాంత్ గౌడ్ తెలుగు పండిట్- సిద్దిపేట-9441762105
చిత్రం