స్వశక్తిని నమ్ముకోవడం"(మినీ కథ-2):-నెనావత్ మౌనిక 10వ తరగతిZPHS నేరెళ్లపల్లిబాలానగర్ మండలంమహబూబ్ నగర్ జిల్లాతెలంగాణా రాష్ట్రం7013264464

  అనగనగా ఒక అడవిలో ఒక చెట్టు మీద ఒక కాకి  నివసించేది. అది చాలా బద్దకస్థురాలు. ఏ విషయం పట్టించుకునేది కాదు.  తన గూడు కూడా  విరిగిపోయి శిథిలావస్థలో ఉన్నది.  కాకి తనలో తాను ఇలా అనుకుంది. ఎవడు చూస్తాడు, ఏమౌతుంది,  నాకు నీడ ఉంటే చాలు అనుకునేది. ఒక రోజు రాత్రి వర్షం కురిసి, కాకి గూడు మొత్తం కిందపడి విరిగిపోయింది. కాకి కి ఏం చేయాలో అర్థం కాక, తన స్నేహితురాలైన చిలుకమ్మ దగ్గరికి వెళ్లి గట్టి, గట్టిగా పిలుస్తుంది. చిలకమ్మా చిలకమ్మా   నేను వర్షంలో తడిచి పోతున్నాను.  ఈ వర్షం ఆగేదాకా నీ దగ్గర అని కాస్త చోటు ఇవ్వు,  అని అడుగుతుంది. చిలక తలుపు తీసి సరే సరే రా, అని లోపలికి పిలిచింది. కాసేపయ్యాక వర్షం తగ్గింది.  అయినా కాకి బయటకు వెళ్ళలేదు. ఇల్లు చాలా బాగుంది నేను ఈ  ఇల్లు ని ఆక్రమించు కోవాలి . అని మనసులో అనుకుంది. అప్పుడు చిలుక కాకి దగ్గరికి వచ్చి  వెళ్ళు, చెట్టు దగ్గరికి వెళ్లి నీ ఇల్లు కట్టుకో అన్నది.  కాకి వినలేదు. నేను వెళ్ళను, కావాలంటే నువ్వే వెళ్లి వేరే ఇల్లు కట్టుకో, నాకు ఈ  ఇల్లు చాలా బాగా నచ్చింది.  నేను ఇక్కడే  ఉంటాను అన్నది కాకి. చిలుక చాలా బాధపడింది.  కానీ చిలుకకు కోపం కూడా  వచ్చింది. చిలక తన ముక్కుతో కాకి ని గట్టిగా గుచ్చి గుచ్చి పొడిచి పెట్టింది. దాంతో కాకి, తల్లి ఆపు ఎందుకు ఇలా చేస్తున్నావ్.   నేను ఈ ఇల్లు విడిచి వెళ్లి పోతాలే అన్నది. ఇలా చిలక తన ఇంటిని కాకి బారినుండి కాపాడుతుంది.    
        ఒకరోజు చిలక ఆహారం వెతకడానికి అడవి కి వెళ్ళింది. అక్కడ చిలుకకు చాలా మంచి ఆహారం దొరికింది. తరువాత చిలుక కాకి దగ్గరికి వచ్చింది. కాకమ్మా కాకమ్మా..!  నేను ఈరోజు చాలా మంచి ఆహారం తిన్నాను.  ఇలాంటి ఆహారం నా జీవితంలో ఎప్పుడు తినలేదు అన్నది. కాకి ఆ మాట వినగానే తను కూడా వెళ్ళాలని నిర్ణయించుకుంది. కాకి చిలుక తో ఇలా అంది. చిలకమ్మా చిలకమ్మా నేను నీతో వస్తా సాయంత్రం, ఆహారం తినడానికి అన్నది. అప్పుడు చిలక, అక్కడ ఒక మనిషి పక్షులను పట్టుకుంటూ ఉన్నాడు నువ్వు వస్తే, దొరికిపోతావు. మరి చాలా జాగ్రత్తగా ఉండాలి  అన్నది. "ఏం కాదు నేను నీ కంటే తెలివైన దానినీ నన్ను ఎవరూ పట్టుకోలేరు ఉన్నది కాకి. "సరే నీ ఇష్టం ఉన్నది చిలక. ఆ రోజు సాయంత్రం కాకి చిలుక ఇద్దరు ఆహారం కోసం వెళ్లారు. అక్కడ కాకి ఒక మనిషికి దొరికిపోయింది. చిలక  మనసులో ఇలా అనుకుంది, ఇంత చెప్పినా వినలేదు అని. కాకి లోపలినుంచి అరుస్తుంది.  చిలకమ్మా. ! చిలకమ్మా..! దయచేసి నన్ను కాపాడు అని వేడుకుంది.  చిలక తనం తెలివితేటలతో  కాకమ్మను  కాపాడింది. ఆ తర్వాత కాకి చిలుక ఇద్దరు చెట్టు దగ్గరికి వచ్చారు.
      చిలక నీకు  ఒక మాట చెప్తాను విను అన్నది. నేను నీకు వర్షంలో తడుస్తున్నవాని చోటిస్తే  నువ్వు నా ఇంటిని ఆక్రమించాలని అనుకున్నావ్ కదా..! ఇపుడు కూడా కాపాడాను.చేసిన మేలు మరిచిపోయి ద్రోహం తలపెట్టకు.
    నీవు చాలా బద్దకంగా ఉంటూ నీ గూడును బాగు చేసుకోవడం లేదు. ఎన్ని ఇళ్ళని ఆక్రమిస్తావ్.  ఇంకోరోజు ఇలానే వర్షం పడుతుంది.  అప్పుడు  ఈ ఇల్లు కూడా విరిగి పోతుంది.   అప్పుడు ఏం చేస్తావ్. "త్వరగా గూడు నిర్మించుకో ..లేదంటే ప్రమాదంలో పడతావు అన్నది చిలక. వేరే వాళ్ల మీద ఎప్పుడు ఆధారపడకూడదు నీ తెలివి తేటలతో నువ్వు బతకాలి". నేను ప్రమాదం అని చెప్పినా కూడా నువ్వు ఆహారం కోసం అత్యాశతో వచ్చావు. "అత్యాశ ఎవరినైనా ప్రమాదంలో పడేస్తోంది". అన్నది చిలక. చిలక మాటలు విన్న కాకి అర్థం చేసుకొని తన జీవితాన్ని ఆనందంగా కొనసాగించింది. అప్పటి నుంచి చిలకా, కాకి ఒకరికి ఒకరు సహాయం చేసుకుంటూ హాయిగా  జీవించారు. 
    నీతి;- "ఎవరికైనా సరే అహంకారం ఉండకూడదు, బద్ధకం అస్సలు ఉండకూడదు. "    "ఎవరి దారి వాళ్లు చూసుకుని జీవితం కొనసాగిస్తే బాగుంటుంది" "ఎప్పుడైనా సరే వేరే వాళ్ళ మీద ఆధారపడకూడదు"

కామెంట్‌లు
Popular posts
తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు--ఎం బిందుమాధవి
చిత్రం
*బహు చక్కని కథలు బక్రిచెప్యాల బాదుషాలు*:- బట్టల సాయిచరణ్-7వ, తరగతి -జి.ప.ఉ.పా.బక్రిచెప్యాల -మం:సిద్ధిపేట -జాల్లా:సిద్ధిపేట
చిత్రం
ఏం కాలం? ఇది పోయే కాలం!:- యలమర్తి అనూరాధ
చిత్రం
విను చూడు!!?:-సునీతా ప్రతాప్-ఉపాధ్యాయిని పాలెం.
చిత్రం
*తెలంగాణతొలిశతావధాని* శ్రీమాన్ శ్రీ శిరశినహల్ కృష్ణమాచార్యులు వర్ధంతి నేడు(ఏప్రియల్ 15) కృష్ణమాచార్యులు నిజామాబాద్ జిల్లా (అప్పటి కరీంనగర్ జిల్లా) లోని మోర్తాడ్ గ్రామంలో 1905, ఆగస్టు 12 వ తేదికి సరియైన క్రోధి నామ సంవత్సర, శ్రావణ శుక్ల విదియ నాడు రంగమ్మ, వేంకటాచార్యులకు జన్మించారు. వీరు బాల్యంలో పితామహులైన సింగారాచార్యులవద్ద మరియు తండ్రి గారైన వేంకటాచార్యుల వద్ద విద్యను అభ్యసించారు. తరువాత మాతామహులైన గోవిందాచార్యుల వద్ద 1914 నుండి 1921 వరకు ఏడు సంవత్సరాలు కావ్య, నాటక, అలంకార, సాహిత్య గ్రంథాలు, తిరుమంత్రార్థము, శ్రీ వచన భూషణ వ్యాఖ్యానము మొదలైన గ్రంథాలు అధ్యయనం చేశారు. పిమ్మట వల్లంకొండలో కనకాపురం శ్రీనివాసాచార్యుల వద్ద తర్క ప్రకరణాలు, మోర్తాడులో కందోఝల వెంకన్న వద్ద సిద్ధాంత భాగము, పిఠాపురంలో గుదిమెళ్ళ రంగాచార్య వద్ద వేదాంతమును అభ్యసించారు. 1926 నుండి కోరుట్ల లోని ఉభయవేదాంత సంస్కృత పాఠశాలలో ఉపాధ్యాయులుగా ప్రవేశించి అక్కడనే ప్రధానోపాధ్యాయులుగా పదవీవిరమణ చేశారు. మధ్యలో 1934-37లో కొడిమ్యాలలో ఆనందమ్మ అనే విద్యార్థినికి సంస్కృతాంధ్రాలు, 1937లో లింగాపురంలో అనసూయాదేవి, సుశీలాదేవి అనే విద్యార్థినులకు సంస్కృత సాహిత్యం నేర్పించారు. రచనలు-సంస్కృతాంధ్రాలలో 40కి పైగా గ్రంథాలను రచించారు. వీటిలో కావ్యాలు, శతకాలు, సుప్రభాతాలు, స్తుతిగీతాలు, హరికథలు మొదలైనవి ఉన్నాయి. వీరి రచనలలో కొన్ని: 1. కళాశాల అభ్యుదయం 2. రామానుజ చరితం 3. చిత్ర ప్రబంధం 4. రత్నమాల (ఖండ కావ్యం) 5. మనస్సందేశ కావ్యము 6. సంపత్కుమార సంభవ కావ్యము 7. గాంధీతాత నీతిశతకము 8. గీతాచార్య మతప్రభావ శతకము 9. వెదిర వేంకటేశ్వరస్వామి సుప్రభాతము 10. ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి సుప్రభాతము 11. వేణుగోపాల స్వామి సుప్రభాతము 12. నంబులాద్రి నృసింహస్వామి సుప్రభాతము 13. పద్మావతీ పరిణయము (హరికథ) 14. రుక్మిణీ కళ్యాణము (హరికథ) 15. ముకుందమాల 16. యామునాచార్యులవారి స్త్రోత్ర రత్నగీతములు 17. విశిష్టాద్వైతమత సంగ్రహము 18. వేదార్థ సంగ్రహము (అనువాదం) 19. గురువంశ కావ్యనిధి వీరు కోరుట్ల, జగిత్యాల, ధర్మపురి మొదలైన చోట్ల అష్టావధానాలు, శతావధానాలు చేశారు. తెలంగాణా ప్రాంతంలో వీరు మొట్టమొదటి అవధానిగా కీర్తి గడించారు. వీరికి నైజాం రాష్ట్రాద్య శతావధాని, పండితరత్న, ఉభయవేదాంత విద్వాన్, ఉభయ వేదాంతాచార్య మొదలైన బిరుదులు ఉన్నాయి. వీరిని తిరుమల తిరుపతి దేవస్థానం వారు, ఢిల్లీలో జియ్యర్ స్వామివారు, మొదటి ప్రపంచ తెలుగు మహాసభలలో ముఖ్యమంత్రి జలగం వెంగళరావు గారు ఘనంగా సత్కరించారు. మనోవిజయ బాణారంభం అనే మొదటగా రచించినట్లుగా కృష్ణమాచార్యులు రాసుకున్న స్వీయ కవితానుజీవనం అనే గ్రంథంలో రాసుకున్నారు. న్యాయశాస్త్రం అభ్యసించాలనే మక్కువతో అనేక కష్టాలను ఎదుర్కొంటూ, అసంపూర్తిగానే నిలిపివేసినప్పటికీ, తర్వాతి కాలంలో మద్రాస్ ప్రాంతానికి వెళ్లి తన వాంఛను నెరవేర్చుకున్నారు. కరీంనగర్ పట్టణంపై కంద పద్యాన్ని రాసి, వారి కవితా జీవనాన్ని ప్రారంభించారు. 1929లో కళాశాలఅభ్యుదయ తొలి కావ్యంగా గుర్తింపు పొందింది. 1939లో శతవిధభంగ శతకాన్ని, అభినవ కుచేలోపాధ్యానము గ్రంథాలను రచించారు. నైజాం పరిపాలన సమయంలో కోరుట్ల కాంగ్రెస్ అధ్యక్షుడిగా పని చేసిన శతావధాని కృష్ణమాచార్యులు, తన తొలి శతావధాన్ని 1928లోనే నిర్వహించారు. ఆనాటి నుండి శతావధానిగా పేరొందిన కృష్ణమాచార్యులు, నైజాం రాష్ట్ర వైష్ణవ సంఘం ఆధ్వర్యంలో 1946లో పండితరత్న బిరుదు పొందిన కృష్ణమాచార్యులు, హరికథ కాలక్షేపాలు, రామానుజ చరిత్ర, తత్వార్థప్రకాశిక, శృంగారపంచపానవిజయ రచన తదితర గ్రంథాలను రచించారు. ద్రావిడ భాషలోని అనేక గ్రంథాలను తెలుగులోకి అనువదించారు. అర్చరాదిమార్గం, శ్రీవచన భూషణం తదితర పుస్తకాలను కూడా రచించిన కృష్ణమాచార్యులు, గాంధీతాత నీతి శతకాన్ని కూడా రచించారు. కులమత బేధాలు వద్దంటూ ఆనాడే తన కవితల ద్వారా సమాజానికి చెప్పిన కృష్ణమాచార్యులు, బాల్య వివాహాలు వద్దని పేర్కొంటునే, బాల వితంతు వివాహాలను ప్రోత్సహించే విధంగా కవితా సంపుటిలను కూడా సమాజానికి అందించారు. 1955లో తిరుపతిలో తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో జరిగిన వేదాంత సభల్లో కృష్ణమాచార్యుల గారికి ఘన సన్మానం లభించింది. విద్యాభూషణ, పండితరత్న, ఉభయవేదాంతచార్య తదితర బిరుదులు కృష్ణమాచార్యుల గారికి దక్కిన మణిమకుటాలు. ఎలాంటి సమస్యనైనా క్షణకాలంలో పరిష్కరించి, ఏకసంతాగ్రహిగా కీర్తి ఘడించిన కృష్ణమాచార్యుల గారికి సాక్షాత్యు సరస్వతిదేవియే స్వప్న సాక్షాత్కరించి సమస్యను ఇచ్చినట్లు తన కవితానుజీవనం పుస్తకంలో రాసుకున్నారు. 80సంవత్సరాల వయస్సులో ఏప్రిల్ 15, 1992 రోజున పరమపదాన్ని చేరుకున్న కృష్ణమాచార్యుల శత జయంతి ఉత్సవాలను కరీంనగర్‌లో శ్రీ త్రిదండి శ్రీరామన్నారాయణ రామానుజ చిన్నజీయర్ స్వామి పర్యవేక్షణలో మూడు రోజుల పాటు అత్యంత వైభవోపేతంగా నిర్వహించారు. తన ఇంటి ఇలవేల్పూ నంబులాద్రి లక్ష్మీనర్సింహాస్వామికి రాసిన సుప్రభాతం నేటికి ఆలయాల్లో ప్రతిధ్వనిస్తోంది. ఇటీవలే కృష్ణమాచార్యులు అందించిన మనస్సందేశ కావ్యాన్ని పుస్తక రూపంలో ప్రచురించి హైదరాబాద్‌లో పండితుల సమక్షంలో ఆవిష్కరించి, శతావధాని మధుర స్మృతులను గుర్తు చేసుకున్నారు. శతావధాని గారి రచనలపై చాలామంది విద్యార్థులు కాకతీయ, ఉస్మానియా యూనివర్సిటీల్లో పిహెచ్‌డిలు కూడా పూర్తి చేశారు. డాక్టర్ సముద్రాల శ్రీనివాసాచార్య కృష్ణమాచార్య శతావధాని తెలుగు రచనలు పరిశీలన అనే అంశంపై పై పీ.హెచ్. డీ చేశారు. వారి కుమారులు శిరిశినహళ్ వెంకటాచారి తన తండ్రి వారసత్వాన్ని కొనసాగిస్తూ వస్తున్నారు--డాక్టర్ . అమ్మిన శ్రీనివాస రాజు
చిత్రం