*శ్రీ శివపురాణ మాహాత్మ్యము**రుద్ర సంహిత - ప్రథమ (సృష్టి) ఖండము-(౧౧౫ - 115)*
 బ్రహ్మ, నారద సంవాదంలో.....
*పరమేశ్వరుడు కైలాసము చేరి - సృష్టి ఖండమును ఉపసంహరించుట*
*బ్రహ్మ, నారదుడు, రుషులు, దేవతలతో ఇలా చెప్పాడు -*
*నారదా! పరాత్పరుడు అయిన శివుడు కుబేరునకు ధనాధిపతి అయ్యేలా వరము ఇచ్చి తన లోకానికి వెళ్ళాడు. రద్రడు బ్రహ్మ (నా) నుదుటి నుండి పుట్టాడు. సాక్షాత్తు శివుడే. ప్రళయాన్ని సృష్టి చేయగలవాడు. రుద్రుడుగా వున్న నేను(శివుడు) కైలాసమునకు వెళ్ళి కుబేరునితో కలసి వుండి తనతో స్నేహం చేస్తాను. ఆ పర్వతం మీద ఆధారపడి గొప్ప తపస్సు చేస్తాను. అప్పుడు రుద్రుడు తన ఢమరుకమును వాయిస్తాడు. ఆ ఢమరు నుండి వచ్చే శబ్దము అందరినీ తన వద్దకు రమ్మని పిలుస్తున్నట్టుగా వుంది. అప్పుడు, విష్ణువు, నేను, సకల దేవతలు, శివగణములు, రాక్షసులు, శివుని పార్షదులు, గణాధిపతులు అయిన గణపతులు అందరూ అక్కడ చేరారు. ఈ గణపతులు మహావిష్ణువు లాగా, నా లాగా ఇంద్రుని లాగా తేజో సంపన్నులు గా వున్నారు. అణిమాది సిద్ధులు వారికి సొంతము అయ్యాయి. వీరందరినీ చూచిన పరమాత్మ, విశ్వకర్మను పిలిచి వారి వారి అర్హత ప్రకారం వుండటానికి నివాసగృహాలు ఏర్పాటు చేయమన్నారు. విశ్వకర్మ తమ కొరకు ఏర్పాటు చేసిన వసతి గృహాల లో అందరూ సేద తీరారు.*
*తరువాత, మేమందరమూ పరమేష్ఠిని అనేక విధాలుగా, ఎన్నో సార్లు వివిధ రకాల పూజలు చేసి ప్రసన్నం చేసుకున్నాము. ఈ పూజలకు ఆనందించిన పార్వతీ పతి, మాకు అందరకు మా మా కోరికలను తీర్చి, అభీష్ఠములైన వస్తువులను ఇచ్చారు. తరువాత, సదాశివుని ఆజ్ఞ తీసుకుని మేము మా మా ఇళ్ళకు వెళ్ళాము.*
*శంభుడు సర్వ స్వతంత్రుడు. యోగపరాయణుడు. ధ్యానతత్పరుడు. పర్వతములలో గొప్పదైన కైలాస పర్వతం మీద కొంతకాలం ఒంటరిగా దీర్ఘమైన తపస్సు చేసుకుంటూ స్వేచ్ఛగా సంచరించాడు. ఆ తరువాత దక్ష ప్రజాపతి కుమార్తె దాక్షాయణి అనబడే సతీ దేవిని చేపట్టాడు. లోకాచార పరాయణుడుగా సతీదేవి తో గూడి ఆనందనాట్యం చేస్తూ ఆనందనిలయంలో కొలువై వున్నాడు.*
*కైలాసనాధుని లీలను ఏకాగ్ర మనస్సు తో విని ఆనందించిన వారికి, సకల శుభములు, ఇహలోక సౌఖ్యములు, పారలౌకిక మోక్షము తప్పక లభిస్తుంది.*
*రుద్రసంహిత లోని సృష్టి ఖండము సంపూర్ణము.*
*ఇతి శివమ్*
*శివో రక్షతు! శివో రక్షతు!! శివో రక్షతు!!!*
.... ఓం నమో వేంకటేశాయ

Nagarajakumar.mvss

కామెంట్‌లు
Popular posts
తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు--ఎం బిందుమాధవి
చిత్రం
రామాయణం‌ నుండి108 ప్రశ్నలు –జవాబులు!:----సుజాత.పి.వి.ఎల్.
చిత్రం
వినదగు నెవ్వరు చెప్పిన: --ఎం బిందుమాధవి
చిత్రం
పూర్వ విద్యార్థుల సమ్మేళనం అపురూపం::-యాడవరo చంద్రకాంత్ గౌడ్ తెలుగు పండిట్- సిద్దిపేట-9441762105
చిత్రం
కులవృత్తులు మరువకురా గువ్వలచెన్న వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండల్ గొటిక ఖుర్డు ప్రాథమిక పాఠశాలలో కుల వృత్తుల పై విద్యార్థులు వినూత్న ప్రదర్శన విద్యార్థుల వినూత్న ప్రదర్శన అభినందించిన బషీరాబాద్ వైస్ ఎంపీపీ జడల అన్నపూర్ణ వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల గోటిక ఖుర్దు స్కూల్లో గ్రామంలో ని కుల వృత్తులు పై విద్యార్థులు పాఠశాలల్లో వినూత్న ప్రదర్శన నిర్వహించారు నేటి సమాజంలో ప్రపంచీకరణ , ఆధునికత పేరుతో కులవృత్తులకు ఆదరణ కరువు అయినవీ పల్లె నుండి పట్నంకు బతుకుదెరువు కోసం కన్నతల్లిని ఉన్న ఊరిని వదిలి కుల వృత్తిని వదిలి పట్నంలో వెళ్లి కూలీ గా పనిచేస్తున్నారు కావున ఆనాటి నుండి నేటి వరకు గ్రామంలో అనేక కుల వృత్తుల ప్రాధాన్యత ఉంది సమాజంలో కుమ్మరి కమ్మరి మేతరి చాకలి . వడ్రంగి. రైతులు .పోస్ట్ మాన్ కురువ. లాయర్. డాక్టరు మొదలైన వృత్తుల ప్రతిబింబించే విధంగా కళ్లకు కట్టిన విధంగా పాఠశాల ఆవరణంలో విద్యార్థులు చక్కగా ప్రదర్శించారు పాఠశాల ప్రధానోపాధ్యాయులు మురళి హరినాథ్ విద్యార్థుల చేత 26 వేషధారణ వేసి విద్యార్థుల నైపుణ్యాన్ని వెలికి తీయడం కోసం మరుగునపడిన కులవృత్తులను గుర్తు చేసుకోవడం కోసం చక్క గా ప్రదర్శించడం జరిగింది విద్యార్థులలో చిన్నప్పటినుండి అన్ని అంశాలపై అవగాహన కలిగినట్లయితే భవిష్యత్తులో వారికి నిత్య జీవితంలో ఎంతో ఉపయోగపడుతుంది ప్రభుత్వ పాఠశాలలు మరింత బలోపేతం చేయడం కోసం విద్యార్థులను సర్వతోముఖాభివృద్ధి చేయడం కోసం కృషి చేస్తున్నానని ప్రధానోపాధ్యాయుడు మురళి హరినాథ్ చెప్పారు విద్యార్థులకు ఒత్తిడి లేకుండా జాయ్ full learning నేర్పించాలని సంకల్పించడం జరిగిందని అన్నారు ఈ కార్యక్రమంలో లో గ్రామ పెద్దలు శ్రీనివాస్ రెడ్డి ఉపాధ్యాయులు జయ శ్రీ .నవనీత. విటల్ గౌడ్. చంద్రయ్య. సత్యం. ఆశన్నప్పా జ్యోతి. లక్ష్మీ. మరియు విద్యార్థులు పాల్గొన్నారు
చిత్రం