*శ్రీ శివపురాణ మాహాత్మ్యము**రుద్ర సంహిత - ద్వితీయ (సతీ) ఖండము-(౧౧౭ - 117)*
 బ్రహ్మ, నారద సంవాదంలో.....
*కామదేవుని పేర్లు - రతీదేవి తో వివాహము - సంధ్య చరిత్ర - చంద్రభాగ పర్వతము మీద సంధ్య తపస్సు*
*బ్రహ్మ, నారదుని ఇలా చెప్పాడు -*
*నారదా! నా మానసపుత్రిక అయిన "సంధ్య" కు ఒక రోజు కామభావము కలిగింది. అప్పుడు ఆమె ఇంకా బాలిక. "ఇటువంటి కోరికలు ఈ వయస్సు లో కలగడం సరికాదు. యుక్త వయస్సు వచ్చే వరకు భూమి మీద ఏ ప్రాణికీ కామభావం కలుగకుండా, బాల బాలికల మీద కామ దేవుని ప్రభావం వుండకుండా వుండేలా పరమేశ్వరుని అనుగ్రహం పొందడానికి గొప్ప తపస్సు చేసి, ఒక హద్దు నియమించి, నేను తనువు చాలిస్తాను" అని చెప్పి నా అనుమతి తీసుకుని తపస్సు కొరకు బయలు దేరింది, "సంధ్య".*
*ఆవిధంగా తపస్సు కోసం బయలుదేరిన సంధ్య, "చంద్రభాగా నది" పుట్టిన "చంద్రభాగ" పర్వతము మీదికి చేరుకుంది. చంద్రభాగ నది, పర్వతము మీది నుండి దక్షిణము వైపుకు ప్రవహిస్తోంది. ఈ చంద్రభాగ పర్వతము మీద వున్న, అన్ని సరోవర లక్షణములతో కూడిన "బృహల్లోహిత" అనే సరోవరము వద్ద కూర్చుని తపస్సు ఎలాచేయాలి అని ఆలోచిస్తోంది సంధ్య. బ్రహ్మ ఆజ్ఞతో మూర్తీభవించిన బ్రహ్మచర్యం లాగా, తేజోసంపన్నుడై కనిపిస్తున్న వశిష్టుడు, సంధ్యను వెతుకుతూ వచ్చి బృహల్లోహిత సరోవరం పక్కన కూర్చుని వున్న సంధ్యను చూచి ఆమె ఈ ప్రదేశానికి ఏ కారణంగా వచ్చింది అని అడుగుతాడు. తాను, బ్రహ్మ మానసపుత్రికననీ, తపస్సు చేయాలని వచ్చాననీ, కానీ తపస్సు యొక్క విధివిధానాలు తెలియకపోవడం వలన ఇలా కూర్చున్నాననీ, తనకు తపస్సు చేసే పద్ధతి చెప్పమని, వశిష్ఠుని అడిగింది, సంధ్య.*
*బ్రహ్మ విద్యలో శ్రేష్ఠడైన వశిష్ఠుడు సంధ్య తో " దేవీ! అన్నిటికీ ఆదిమూలమైన వాడు, పరమారాధ్యుడు, గొప్ప మహిమలు కలిగిన వాడు, ధర్మ, అర్ధ, కామ మోక్షము లకు కారణమైన వాడు అయిన శంభుదేవుని మనసు లో నిలుపుకుని, "ఓం నమశ్శివాయ ఓం" అని మౌనముగా జపము చేస్తూ తపస్సు చేయి. అందరి కోరికలనూ తీర్చే ఆదిశంకరుని ఈ మంత్రము తో మౌనముగా ప్రార్ధిస్తే, బ్రహ్మచర్య ఫలము లభిస్తుంది. ఈ తపస్సు కాలం అంతా నీరు మాత్రమే త్రాగి దీక్షగా వుండాలి. ఇలా జలాహారము తీసుకుంటూ చేసే మౌన తపస్సు, అన్ని కోరికలనూ తీరుస్తుంది. ఇది సత్యము. ఇదే సత్యము. సందేహము అవసరం లేదు. తప్పకుండా పరమేశ్వరుడు అనుగ్రహించి ఆ స్వామి నీ కోరికలను తీరుస్తాడు" అని చెప్పి వశిష్ఠుడు అంతర్ధానం అవుతాడు.*
*ఇతి శివమ్*
*శివో రక్షతు! శివో రక్షతు!! శివో రక్షతు!!!*
.... ఓం నమో వేంకటేశాయ
Nagarajakumar.mvss

కామెంట్‌లు
Popular posts
తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు--ఎం బిందుమాధవి
చిత్రం
రామాయణం‌ నుండి108 ప్రశ్నలు –జవాబులు!:----సుజాత.పి.వి.ఎల్.
చిత్రం
వినదగు నెవ్వరు చెప్పిన: --ఎం బిందుమాధవి
చిత్రం
పూర్వ విద్యార్థుల సమ్మేళనం అపురూపం::-యాడవరo చంద్రకాంత్ గౌడ్ తెలుగు పండిట్- సిద్దిపేట-9441762105
చిత్రం
కులవృత్తులు మరువకురా గువ్వలచెన్న వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండల్ గొటిక ఖుర్డు ప్రాథమిక పాఠశాలలో కుల వృత్తుల పై విద్యార్థులు వినూత్న ప్రదర్శన విద్యార్థుల వినూత్న ప్రదర్శన అభినందించిన బషీరాబాద్ వైస్ ఎంపీపీ జడల అన్నపూర్ణ వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల గోటిక ఖుర్దు స్కూల్లో గ్రామంలో ని కుల వృత్తులు పై విద్యార్థులు పాఠశాలల్లో వినూత్న ప్రదర్శన నిర్వహించారు నేటి సమాజంలో ప్రపంచీకరణ , ఆధునికత పేరుతో కులవృత్తులకు ఆదరణ కరువు అయినవీ పల్లె నుండి పట్నంకు బతుకుదెరువు కోసం కన్నతల్లిని ఉన్న ఊరిని వదిలి కుల వృత్తిని వదిలి పట్నంలో వెళ్లి కూలీ గా పనిచేస్తున్నారు కావున ఆనాటి నుండి నేటి వరకు గ్రామంలో అనేక కుల వృత్తుల ప్రాధాన్యత ఉంది సమాజంలో కుమ్మరి కమ్మరి మేతరి చాకలి . వడ్రంగి. రైతులు .పోస్ట్ మాన్ కురువ. లాయర్. డాక్టరు మొదలైన వృత్తుల ప్రతిబింబించే విధంగా కళ్లకు కట్టిన విధంగా పాఠశాల ఆవరణంలో విద్యార్థులు చక్కగా ప్రదర్శించారు పాఠశాల ప్రధానోపాధ్యాయులు మురళి హరినాథ్ విద్యార్థుల చేత 26 వేషధారణ వేసి విద్యార్థుల నైపుణ్యాన్ని వెలికి తీయడం కోసం మరుగునపడిన కులవృత్తులను గుర్తు చేసుకోవడం కోసం చక్క గా ప్రదర్శించడం జరిగింది విద్యార్థులలో చిన్నప్పటినుండి అన్ని అంశాలపై అవగాహన కలిగినట్లయితే భవిష్యత్తులో వారికి నిత్య జీవితంలో ఎంతో ఉపయోగపడుతుంది ప్రభుత్వ పాఠశాలలు మరింత బలోపేతం చేయడం కోసం విద్యార్థులను సర్వతోముఖాభివృద్ధి చేయడం కోసం కృషి చేస్తున్నానని ప్రధానోపాధ్యాయుడు మురళి హరినాథ్ చెప్పారు విద్యార్థులకు ఒత్తిడి లేకుండా జాయ్ full learning నేర్పించాలని సంకల్పించడం జరిగిందని అన్నారు ఈ కార్యక్రమంలో లో గ్రామ పెద్దలు శ్రీనివాస్ రెడ్డి ఉపాధ్యాయులు జయ శ్రీ .నవనీత. విటల్ గౌడ్. చంద్రయ్య. సత్యం. ఆశన్నప్పా జ్యోతి. లక్ష్మీ. మరియు విద్యార్థులు పాల్గొన్నారు
చిత్రం