*శ్రీ శివపురాణ మాహాత్మ్యము**రుద్ర సంహిత - ద్వితీయ (సతీ) ఖండము-( 118 )*
 బ్రహ్మ, నారద సంవాదంలో.....
*సంధ్య తపస్సు - శివుని స్తుతి - మేధాతిథి యజ్ఞమునకు వెళ్ళుట*
*బ్రహ్మ, నారదుని ఇలా చెప్పాడు -*
*నారదా! వశిష్ఠుని వలన తపో విధానమును తెలుసుకున్న సంధ్య బృహల్లోహిత సరోవర తీరంలో తపస్సు చేయడానికి యోగ్యమైన రూపంలో, వశిష్ఠుడు ఉపదేశించిన మంత్రమును మనసులో వుంచుకుని, పరమ భక్తి భావనతో నాలుగు యుగముల కాలము శంభుని గూర్చి సుదీర్ఘమైన తపస్సు చేసింది. ఇంత సుదీర్ఘ కాలము, ఏకాగ్రతతో సంధ్య చేసిన తపస్సుకు మెచ్చిన సాంబశివుడు సంతోషించి ఆమె ఎదుట ప్రత్యక్షమై నిలిచాడు. తాను కొలుస్తున్న దేవదేవుడు ఒక్కసారిగా ఎదురుగా కనిపించే సరికి సంధ్య సరిగా చూడ లేక పోయింది. మళ్ళీ, ఆ నిర్గుణ రూపుని ధ్యానించి కనులు మూసుకోగా, సదాశివ సమా రంభుని రూపము సంధ్య హృదయంలో కనిపించి ఆమెకు దివ్య దృష్టిని, జ్ఞానాన్ని ఇచ్చాడు. అప్పుడు తనకు లభించిన దివ్య జ్ఞానం తో సాంబసదాశివుని చూచి వేయి వేయి విధాలుగా కీర్తిస్తూ, నామ సంకీర్తన చేస్తూ నమస్కారం చేసింది.*
*బ్రహ్మాది దేవతలు కూడా నిన్ను గురించి తెలుసుకోలేరు. నేను మానవ జాతిలో పుట్టిన స్త్రీ ని నిన్ను తెలుసుకుని స్తుతించడం సాధ్యమా! మీరు నిర్గుణులు. తపోధనులు. మీకు పదే, పదే నమస్కరిస్తున్నాను. నా మీద దయతో ప్రసన్నుడవు అవు తండ్రీ! అని ప్రార్ధించిన సంధ్య తో శివభగవానుడు ఇలా పలుకుతాడు.*
*ఇతి శివమ్*
*శివో రక్షతు! శివో రక్షతు!! శివో రక్షతు!!!*
.... ఓం నమో వేంకటేశాయ

Nagarajakumar.mvss

కామెంట్‌లు
Popular posts
తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు--ఎం బిందుమాధవి
చిత్రం
రామాయణం‌ నుండి108 ప్రశ్నలు –జవాబులు!:----సుజాత.పి.వి.ఎల్.
చిత్రం
వినదగు నెవ్వరు చెప్పిన: --ఎం బిందుమాధవి
చిత్రం
పూర్వ విద్యార్థుల సమ్మేళనం అపురూపం::-యాడవరo చంద్రకాంత్ గౌడ్ తెలుగు పండిట్- సిద్దిపేట-9441762105
చిత్రం
కులవృత్తులు మరువకురా గువ్వలచెన్న వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండల్ గొటిక ఖుర్డు ప్రాథమిక పాఠశాలలో కుల వృత్తుల పై విద్యార్థులు వినూత్న ప్రదర్శన విద్యార్థుల వినూత్న ప్రదర్శన అభినందించిన బషీరాబాద్ వైస్ ఎంపీపీ జడల అన్నపూర్ణ వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల గోటిక ఖుర్దు స్కూల్లో గ్రామంలో ని కుల వృత్తులు పై విద్యార్థులు పాఠశాలల్లో వినూత్న ప్రదర్శన నిర్వహించారు నేటి సమాజంలో ప్రపంచీకరణ , ఆధునికత పేరుతో కులవృత్తులకు ఆదరణ కరువు అయినవీ పల్లె నుండి పట్నంకు బతుకుదెరువు కోసం కన్నతల్లిని ఉన్న ఊరిని వదిలి కుల వృత్తిని వదిలి పట్నంలో వెళ్లి కూలీ గా పనిచేస్తున్నారు కావున ఆనాటి నుండి నేటి వరకు గ్రామంలో అనేక కుల వృత్తుల ప్రాధాన్యత ఉంది సమాజంలో కుమ్మరి కమ్మరి మేతరి చాకలి . వడ్రంగి. రైతులు .పోస్ట్ మాన్ కురువ. లాయర్. డాక్టరు మొదలైన వృత్తుల ప్రతిబింబించే విధంగా కళ్లకు కట్టిన విధంగా పాఠశాల ఆవరణంలో విద్యార్థులు చక్కగా ప్రదర్శించారు పాఠశాల ప్రధానోపాధ్యాయులు మురళి హరినాథ్ విద్యార్థుల చేత 26 వేషధారణ వేసి విద్యార్థుల నైపుణ్యాన్ని వెలికి తీయడం కోసం మరుగునపడిన కులవృత్తులను గుర్తు చేసుకోవడం కోసం చక్క గా ప్రదర్శించడం జరిగింది విద్యార్థులలో చిన్నప్పటినుండి అన్ని అంశాలపై అవగాహన కలిగినట్లయితే భవిష్యత్తులో వారికి నిత్య జీవితంలో ఎంతో ఉపయోగపడుతుంది ప్రభుత్వ పాఠశాలలు మరింత బలోపేతం చేయడం కోసం విద్యార్థులను సర్వతోముఖాభివృద్ధి చేయడం కోసం కృషి చేస్తున్నానని ప్రధానోపాధ్యాయుడు మురళి హరినాథ్ చెప్పారు విద్యార్థులకు ఒత్తిడి లేకుండా జాయ్ full learning నేర్పించాలని సంకల్పించడం జరిగిందని అన్నారు ఈ కార్యక్రమంలో లో గ్రామ పెద్దలు శ్రీనివాస్ రెడ్డి ఉపాధ్యాయులు జయ శ్రీ .నవనీత. విటల్ గౌడ్. చంద్రయ్య. సత్యం. ఆశన్నప్పా జ్యోతి. లక్ష్మీ. మరియు విద్యార్థులు పాల్గొన్నారు
చిత్రం