జాదూ గాళ్ళు వున్నారు జాగ్రత్త...;-డా.నీలం స్వాతి,చిన్న చెరుకూరు గ్రామం,నెల్లూరు.6302811961.
 అలా ఎవ్వరూలేరనుకున్నారా
అయితే మీరు పప్పులో కాలేసినట్టే... జాగ్రత్త మిత్రమా... జాగ్రత్త…
జాదు గాళ్ళు వున్నారు జాగ్రత్త!!!
చీటీలంటూ, చిట్ ఫండ్స్ అంటూ చందాలదందాలను చేస్తూ 
హుందాగా చలామణి అవుతున్న చిల్లర దొంగలున్నారు జాగ్రత్త...
ఆకాశాన్ని ఆశ చూపించి అమాంతం దాచుకున్న సొమ్మును దోచుకెళ్ళే 
కేటుగాళ్ళు ఉన్నారు జాగ్రత్త...
మాటలతోనే మంత్రాలు వేస్తూ
మోసాలను చేసే మాయగాళ్ళు
ఉన్నారు జాగ్రత్త...
జాగ్రత్త మిత్రమా...జాగ్రత్త!!!
బహుమతులంటూ, కూపన్ లంటూ, కుప్పలు తెప్పలుగా ఆఫర్ల మోతను మోగిస్తున్న 
ముసుగుదొంగలున్నారు జాగ్రత్త...
మధ్య తరగతి వాళ్ళనే లక్ష్యంగా చేసుకుంటూ, 
కల్లబొల్లి కబుర్ల కహానీలను చెపుతూ, మిత కాలంలోనే  
అమితమైన వసూళ్లను తేలికగా రాబడుతున్న రాబందులు వున్నారు జాగ్రత్త...
చేజిక్కిన మొత్తాన్ని చేతబట్టి
రాత్రికి రాతిరే దివాళా తీసే హవాలా గాళ్ళు వున్నారు జాగ్రత్త...
అందుకే దయచేసి అపరిచితుల మాటలను వినకండి...
అత్యాశలకు పోయి ఆపదలను కొని తెచ్చుకోకండి...
కష్టపడి దాచుకున్న ధనాన్ని
మాయగాళ్లకు ముట్టజెప్పి మోసాలకు గురికాకండి...
జాగ్రత్త మిత్రమా...జాగ్రత్త మరి!!!!

కామెంట్‌లు
Popular posts
తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు--ఎం బిందుమాధవి
చిత్రం
వినదగు నెవ్వరు చెప్పిన: --ఎం బిందుమాధవి
చిత్రం
కులవృత్తులు మరువకురా గువ్వలచెన్న వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండల్ గొటిక ఖుర్డు ప్రాథమిక పాఠశాలలో కుల వృత్తుల పై విద్యార్థులు వినూత్న ప్రదర్శన విద్యార్థుల వినూత్న ప్రదర్శన అభినందించిన బషీరాబాద్ వైస్ ఎంపీపీ జడల అన్నపూర్ణ వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల గోటిక ఖుర్దు స్కూల్లో గ్రామంలో ని కుల వృత్తులు పై విద్యార్థులు పాఠశాలల్లో వినూత్న ప్రదర్శన నిర్వహించారు నేటి సమాజంలో ప్రపంచీకరణ , ఆధునికత పేరుతో కులవృత్తులకు ఆదరణ కరువు అయినవీ పల్లె నుండి పట్నంకు బతుకుదెరువు కోసం కన్నతల్లిని ఉన్న ఊరిని వదిలి కుల వృత్తిని వదిలి పట్నంలో వెళ్లి కూలీ గా పనిచేస్తున్నారు కావున ఆనాటి నుండి నేటి వరకు గ్రామంలో అనేక కుల వృత్తుల ప్రాధాన్యత ఉంది సమాజంలో కుమ్మరి కమ్మరి మేతరి చాకలి . వడ్రంగి. రైతులు .పోస్ట్ మాన్ కురువ. లాయర్. డాక్టరు మొదలైన వృత్తుల ప్రతిబింబించే విధంగా కళ్లకు కట్టిన విధంగా పాఠశాల ఆవరణంలో విద్యార్థులు చక్కగా ప్రదర్శించారు పాఠశాల ప్రధానోపాధ్యాయులు మురళి హరినాథ్ విద్యార్థుల చేత 26 వేషధారణ వేసి విద్యార్థుల నైపుణ్యాన్ని వెలికి తీయడం కోసం మరుగునపడిన కులవృత్తులను గుర్తు చేసుకోవడం కోసం చక్క గా ప్రదర్శించడం జరిగింది విద్యార్థులలో చిన్నప్పటినుండి అన్ని అంశాలపై అవగాహన కలిగినట్లయితే భవిష్యత్తులో వారికి నిత్య జీవితంలో ఎంతో ఉపయోగపడుతుంది ప్రభుత్వ పాఠశాలలు మరింత బలోపేతం చేయడం కోసం విద్యార్థులను సర్వతోముఖాభివృద్ధి చేయడం కోసం కృషి చేస్తున్నానని ప్రధానోపాధ్యాయుడు మురళి హరినాథ్ చెప్పారు విద్యార్థులకు ఒత్తిడి లేకుండా జాయ్ full learning నేర్పించాలని సంకల్పించడం జరిగిందని అన్నారు ఈ కార్యక్రమంలో లో గ్రామ పెద్దలు శ్రీనివాస్ రెడ్డి ఉపాధ్యాయులు జయ శ్రీ .నవనీత. విటల్ గౌడ్. చంద్రయ్య. సత్యం. ఆశన్నప్పా జ్యోతి. లక్ష్మీ. మరియు విద్యార్థులు పాల్గొన్నారు
చిత్రం
రామాయణం‌ నుండి108 ప్రశ్నలు –జవాబులు!:----సుజాత.పి.వి.ఎల్.
చిత్రం
పూర్వ విద్యార్థుల సమ్మేళనం అపురూపం::-యాడవరo చంద్రకాంత్ గౌడ్ తెలుగు పండిట్- సిద్దిపేట-9441762105
చిత్రం