రెడ్డి రాజులు (13);- డా.నీలం స్వాతి,చిన్న చెరుకూరు గ్రామం,నెల్లూరు.6302811961.
 భరతుడు అంటేనే  వెలుగును చూపు వాడు అని అర్థం.  ధర్మబద్ధంగా రాజ్యం అన్నకే చెందాలి తప్ప నాకు కాదు  అన్న నిశ్చయంతో  అన్న వ్యతిరేకించినా వారి పాదుకలను తీసుకొని వచ్చి వారి పేరుతో రాజ్యాన్ని పరిపాలించాడు తప్ప తన పేరుతో కాదు  అంతత్యాగశీలి  రేణుకా దేవి పేరు ప్రతి ఒక్కరికి తెలిసినదే  ఈమె జమదగ్ని భార్య పరశురాముని తల్లి  రేణుక అంటే అణువు  జమదగ్ని అంటే  శరీరంలో ఉన్న పంచాగ్నులలో జమదగ్ని ఒకటి  పిల్లలు పుట్టడానికి  కారణభూతమైన అగ్నిగా చెప్తారు  పరశురాముడు  రాజులందరినీ  చంపినవాడు  కథలలో కూడా శాస్త్రీయ పద్ధతిని ప్రవేశపెట్టిన వాడు  వాల్మీకి మహర్షి  ఏ పేరు తీసుకున్నా దానికి ఒక ప్రత్యేకత ఉంటుంది. అది వినడం కోసం అది తెలియడం కోసమే  రామాయణం మీకు నేను చెప్తున్నాను.
స్త్రీ ఏ రంగంలో దిగినా కొమ్ములు తిరిగిన మేధావులను కూడా మూడు చెరువుల నీళ్లు తాగించగలిగిన  ధైర్య సైర్యాలతో  పాటు  ఆలోచనా శక్తితో  వారిని జయించగల శక్తి స్త్రీకి ఉంది  మేధావులకే మేధావిగా చెప్పబడే బ్రహ్మనాయుడుని ఎదిరించి  తన సామర్థ్యాన్ని చూపి  వీరనారిగా నాయకురాలు నాగమ్మ గారు  పేరు సంపాదించకున్న స్త్రీని గురించి మీకు ఈరోజు  చెప్పాలనుకున్నాను  ఆమె గురించి చెప్పిన తరువాత  సహజంగా పిల్లలలో  తమ తెలివితేటలను సక్రమంగా వినియోగించే  స్థితి రాదు  వచ్చినా దానిని  ఉపయోగించరు  మీరు మాత్రం అలా కాకుండా  ధైర్యంగా నిలబడి ధర్మం కోసం  పోరాడే  నారీ మణులుగా తయారు కావడం కోసం  ఆమె జీవిత చరిత్రను మీ ముందుకు తీసుకు వస్తున్నాను  జాగ్రత్తగా విని  ఆమె కౌశల్యం ఏమిటో తెలుసుకోండి. పలనాటి యుద్ధం లో బ్రహ్మనాయుడుని ఎదిరించి పోరాడిన వీరనారి  నలకామరాజు మంత్రి ఆరవెల్లి నాయకురాలు రెడ్డి నాగమ్మ  ఆమె పుట్టిన ఊరు కరీంనగర్ జిల్లా జగిత్యాల తాలూకా మల్యాల మండలంలో ఆరవీటి  ఇప్పటికీ ఆ గ్రామం వెలుపల పూజలు అందుకుంటున్న నాయకురాలు గుడి ఇందుకు ప్రత్యక్ష సాక్ష్యం. చిన్ననాడు అనారోగ్యంతో తల్లి మరణించగా తండ్రితో పాటు మేనమామ ఇంటికి పలనాడు గుంటూరు జిల్లా  వెళ్ళిందట నాగమ్మ.  ఆమె తండ్రి భర్త మరణాలకు కారకుడైన మంత్రి  బ్రహ్మనాయుడు పై పగ పెంచుకొని తన తెలివతేటలతో మంత్రిగా చేరి  అతని సవతి సోదరుడైన మలిదేవరాజాదులపై వైరం రగుల  గొల్పి కోడిపందాలలో ఓడించి వారిని ప్రవాసం పంపింది  మలి దేవరాజు మంత్రి వెలమ వీరుడు బ్రహ్మనాయుడు.


కామెంట్‌లు