ఎండమావులు ;- డి.కె.చదువులబాబు.ప్రొద్దుటూరు.కడపజిల్లా--9440703716

 ఎండమావులు అనే మాట మీరు చాలాసార్లు విని ఉంటారు. అవి కేవలం భ్రాంతి లేదా మిధ్యగా గుర్తించాలి. వీటికి కారణం కాంతి కిరణాల వక్రీభవనం. దూర ప్రాంతాలలోని వస్తువు లేదా దృశ్యం నుంచి ప్రయాణించిన కాంతి పుంజము భిన్న సాంద్రతలు గల గాలిపొరలలోంచి ప్రయాణించడం వల్ల ఈ విధంగా కనబడటానికి అవకాశం ఏర్పడుతుంది. మంచి ఎండ కాస్తున్న సమయంలో తారు రోడ్డు ఎడారి లేదా నల్లరేగడి మన్ను ప్రాంతాలను తీసుకుందాం. నేలకు దాపుగా సూర్యరశ్మి అతి వేడిగా ఉండటం వల్ల అక్కడ గాలి కూడా అధిక ఉష్ణోగ్రత కలిగి ఉంటుంది. ఇక్కడి నుంచి కొద్ది కొద్దిగా పైకి పోతే గాలి కింద గాలి అంత వేడిగా ఉండదు. అందువల్ల ఈ గాలి సాంద్రతలలో కూడా ఈ తేడా కనబడుతుంది. పై పొరగల గాలి సాంద్రత హెచ్చుగా ఉంటుంది. అందువల్ల దీని వక్రీభవన శక్తి అధికంగా ఉంటుంది.
     ఈ పరిస్థితుల్లో దూరంగా ఒక తాటి చెట్టు ఉంది. దీని పైభాగం నుంచి ప్రయాణించిన కాంతికిరణం పై చల్లని పొరల్లో సామాన్య రీతిలోనే ప్రయాణిస్తుంది. ఈ కాంతి కిరణం సామాన్యంగా మన కంటికి కనబడదు. దాన్ని మార్గం పైనుంచి ఉంటుంది. కానీ భూమికి దాపుల్లో ఉన్న విరళీకృతమైన గాలి పొరల్లోకి ప్రవేశించగానే అది పైకి వంగి మన కంటి మార్గంలో ప్రయాణిస్తుంది.అంటే ఈ వేడిగాలికి దిగువ నుంచి వచ్చిన కిరణం మాదిరిగా ప్రవర్తిస్తుంది. ఈ విధంగా వక్రీభవనము చెందని సామాన్య కిరణాలు, వక్రీభవనము చెందిన కిరణాలు రెండు మన కంటికి చేరి రెండు చెట్ల దృశ్యాలు కనబడతాయి. ఒకటి సామాన్య చెట్టు దృశ్యము. మరొకటి మిధ్యా
దృశ్యము.  ఆకాశమే భూమి మీద ఒక పొర నీరుగా లేదా సరస్సుగా గోచరిస్తుంది. దృశ్యా సందర్భంగా ఇది సత్యం. భౌతిక రీత్యా ఇది ఒక భ్రమ. అక్కడ ఏమీ లేదు. అయినా విశేషం ఏమంటే మంచి కెమెరాలతో ఈ మిధ్యను కూడా బంధించవచ్చు.      వాతావరణంలోని గాలి పొరలు ఈ మాదిరిగా ఏర్పడడం వల్ల ఎండమావులు ఏర్పడుతున్నాయి. ఈ విధంగా ఎడారిలో సరస్సు ప్రత్యక్షమవుతుంది. మంచి ఎండ కాస్తున్న సమయంలో రోడ్డు మీద ముందు కొలను ఉన్నట్లుగా కనబడుతుంది. వీటికి కారణం కాంతి కిరణాల వక్రీభవనం.
డి.కె.చదువులబాబు.
కామెంట్‌లు
Popular posts
నిశ్శబ్ద కోరిక : - D.రసన్య,10వ తరగతి, తెలంగాణ మోడల్ స్కూల్, ఘన్పూర్ (స్టేషన్), జనగామ (జి)
చిత్రం
మొల్ల విరులు;- .బి. అరుణ- పి జి టి - తెలుగు
ఉరుదూ తెలుగు సాహిత్య వారధి డా. సామల సదాశివ; రామ్మోహన్ రావు తుమ్మూరి
చిత్రం
తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు--ఎం బిందుమాధవి
చిత్రం
మహాభారతంలో వింత పేర్లు.డా.బెల్లంకొండనాగేశ్వరరావు. (నేడు సుబ్బారావు.శంకరరావు పేరు పలువురికి ఎలాఉన్నాయో నాటి కాలంలో కూడా ఒకే పేరు పలువురికి ఉండేది.పురాణలపట్ల ఆసక్తి, అవగాహన కోరుకునేవారికొరకు ఈవ్యాసం.) మహాభారతంలో రమారమి 1655 ప్రాత్రలు మనకు కనిపిస్తాయి. 'అజుడు'దశలధమహారాజు తండ్రి.మరో'అజుడు'పాండవులతరపున యుధ్ధంచేసినరాజు అతిరథుడు.(భీష్మపర్వం)అలాగే నలుగురు 'అనువిందులు'1.దుర్యోధనుని తమ్ముడు (ఆదిపర్వం) 2.సహాదేవుని దక్షణదిగ్విజయ యాత్రలో ఓడిన రాజు(సభాపర్వం) 3.కేకేయరాజు (భీష్మపర్వం)4.కౌరవల తరపున పోరాడిన అవంతీశ్వరుడు. (ఉద్యోగపర్వం)ముగ్గురు 'అలంబసులు' 1.జటాసురునికుమారుడు. (ద్రోణపర్వం)2.బకాసురునిసోదరుడు.(ద్రోణపర్వం) 3.ఒకరాజుయుద్ధంలో 14.రోజు సాత్యకిచేతిలోమరణించారు.(ద్రోణపర్వం)ఇద్దరు 'అశ్మీకుడు'లు 1అభిమన్యునిచేతిలో మరణించినకౌరవుడు(ద్రోణపర్వం) 2.ఇక్షాకు వంశరాజు,కల్మషపాదుని కుమారుడు.(ఆదిపర్వం)ఇద్దరు 'ఉగ్రశ్రవశుడు' 1.దుర్యోధనుని తమ్ముడు(ఆదిపర్వం) 2.వ్యాసమహర్షి శిష్యుడు. (ఆదిపర్వం)ఇద్దరు 'ఉగ్రసేనుడు'1.జనమజేయునితమ్ముడు(ఆది) 2.దుర్యోధనుని తమ్ముడు.(ఆది)ఇద్దరు 'ఉగ్రాయుధుడు' 1.పాంచాలకుమారుడు (కర్ణ) 2.దుర్యోధనునితమ్ముడు. (ఆది)ఇద్దరు 'ఉత్తరలు'1దక్షునికుమార్తే (ఆది) 2.వరాటమహారాజు కుమార్తె (విరాటపర్వం)ఇద్దరు 'బుచీకకులు'1.ఔర్యునికుమారుడు. (ఆది) 2.దేవాతిథి కుమారుడు.(ఆది)ఇద్దరు 'కపిల'1.కస్యపునిభార్య. (ఆది) 2.గోవు.(ఆది)ఇద్దరు 'కర్ణులు'1.కుంతికుమారుడు. (ఆది) 2.దుర్యోధనుని తమ్ముడు.(ఆది)ముగ్గురు 'గాంధారీలు'1.కౌరవులతల్లి.(ఆది) 2.అజమీఢుని కుమార్తె(ఆది) 3.కుమారస్వామి కొలువులో దేవాంగన (అరణ్య)ముగ్గురు'గోపతి'లు 1.తపుడు అను వహ్ని పుత్రుడు. (అరణ్య)2.మయసభకు వెళ్లిన ఋషి.(సభా) 3.శిబి మనవడు.(శాంతి )ముగ్గురు 'ఘృతాచి'లు.1.అప్సరస.(ఆది)2.ఛ్యవనుని కోడలు.(ఆది)3.కశ్యపునిభార్య. (ఆది)ముగ్గురు'చంద్రసేనుడు'లు 1.శల్యుని చక్రరథికుడు.(శల్య)2.ద్రౌపతి స్వయంవరంకి వచ్చినరాజు. (ఆది)3.భీముని దిగ్విజయ యాత్రలో ఓడినరాజు. (సభా)ముగ్గురు 'చిత్రుడు'లు 1.పాంచాలరాజు.2. చేధిరాజు.(కర్ణ)ఇద్దరు 'చిత్రరథులు'1.ద్రుపద సంజాతుడు అయిన వీరకేతుని పుత్రుడు. (ద్రోణ)2.రేణుకాదేవి కి నీళ్లవద్ద కనిపించిన వాడు.3.అంగరాజు. (అరణ్య)ముగ్గురు'చిత్రవర్మ'లు1.వీరకేతుని పుత్రుడు. (ద్రోణ) 2.దుర్యోధనుడి తమ్ముడు.(ఆది)3.విరూపాక్ష అంశంతో జన్మించినవాడు. (ఆది)నలుగురు'చిత్రసేనులు'1.కర్ణుని చేతిలో మరణించిన పాండవవీరుడు. (కర్ణ)2.ఘోషూయాత్రలో దుర్యోధనుని బంధించినవాడు.(అరణ్య)3.కర్ణ తనయుడు.నకులునిచేతిలో మరణించాడు.(శల్య)4.పాండవ వీరుడుశ్రుతకర్మ చేతిలోమరణించాడు. (కర్ణ)(మిగిలినవి మరో పర్యాయం.)
చిత్రం